Lakshmi Parvathi Fires on Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి

May 27 2023 7:46 PM | Updated on May 27 2023 9:04 PM

Lakshmi Parvathi Fires Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు అని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు.. చివరికి ఆయన కుటుంబాన్ని కూడా దూరం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి పార్టీని కూలదోశారు.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించి ఎన్టీఆర్‌ను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన మనసున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆస్తులు పంచుకున్న కొడుకులు, పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వారసులు కాదని.. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి వీళ్లకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు వాడటానికి  కొడుకులకు కూడా నైతిక హక్కు లేదని.. ఎన్నికలొచ్చే సరికి కొడుకులకు తండ్రి గుర్తుకువచ్చాడా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలని చంద్రబాబు ఏరోజూ అడగలేదని నాటి ప్రధాని వాజ్‌పేయి తనతో స్వయంగా చెప్పారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నిజమైన వారసుడు సీఎం జగన్‌: దేవినేని అవినాష్‌
ఎన్టీఆర్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్‌ అని దేవినేని అవినాష్‌ అన్నారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ ఎన్టీఆర్ పేరును వాడుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారు.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఎన్టీఆర్ గుర్తొస్తారని ఎద్దేవా చేశారు.

చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement