సాక్షి, గుడివాడ: వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కొడాలినానికి హైకోర్టులో ఊరట లభించింది. గుడివాడలో ఆయనపై నమోదైన కేసును విచారించిన హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. గతంలో చంద్రబాబు,ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుడివాడ పోలీసులు ఆయనపై కేసు విధించారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు స్టే విధించింది.


