పాతిక లక్షల జనాభాకో లోక్ సభ సీటు | India may soon join the top countries in the world in voting percentage | Sakshi
Sakshi News home page

పాతిక లక్షల జనాభాకో లోక్ సభ సీటు

Jan 31 2025 3:39 AM | Updated on Jan 31 2025 3:39 AM

India may soon join the top countries in the world in voting percentage

మన దేశంలోనే లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక జనాభా

మిగతా దేశాల్లో అతి తక్కువ జనాభా

భారత్‌లో 25.7 లక్షల జనాభాకు ఒక లోక్‌సభ సీటు

యుఎస్‌లో 7.3 లక్షల జనాభాకు 1

ఇండోనేషియాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌లో 1.2 లక్షలే

మిగతా దేశాలతో పోల్చితే మహిళల ప్రాతినిధ్యం భారత్‌లో తక్కువ

ఓటింగ్‌ శాతం అన్ని దేశాల్లో దాదాపు సమానం

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రపంచంలోని ప్రధాన దేశా­లతో పోల్చితే ఒక లోక్‌సభ (దిగువ సభ) సీటుకు సగటు జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారత­దేశమే. మిగిలిన ప్రధాన దేశాల్లో ఒక లోక్‌సభ స్థానానికి సగటు జనాభా అతి తక్కువ అని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ఆధారంగా వివిధ దేశాల్లో దిగువ సభకు సీట్లు, ఒక సీటుకు జనాభా, మహిళల ప్రాతినిధ్యం, ఓటింగ్‌ శాతా­లను ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక విశ్లేషించింది.  

భారత దిగువ సభలో ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా 25.7 లక్షలు ఉండగా.. అమె­రికాలో 7.3 లక్షలే ఉన్న­ట్లు తెలిపింది. ఇండోనే­షి­యాలో 4.8 లక్షలు, జర్మనీ, ఫ్రాన్స్‌­లో 1.2 లక్షల జనాభానే ఉంద­ని తెలిపింది. మిగతా దేశాలతో పోల్చితే మన లోక్‌సభలో మహిళల ప్రా­తి­­నిధ్యం తక్కువ ఉందని నివేదిక తెలిపింది. 

అయితే భారత్‌ సహా ప్రధాన దేశాలన్నింటిలో ఓటింగ్‌ శాతం దాదాపు సమానంగా ఉన్నట్లు వెల్లడించింది. ఓటింగ్‌ శాతంలో త్వర­లోనే భారత్‌ ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన చేర­వ­చ్చునని తెలిపింది. దిగువ సభ ఓటింగ్‌ శాతం జర్మ­నీలో అత్యధికంగా ఉండగా, ఆ తరువాత ఫ్రా­న్స్, స్పెయిన్, భారత్‌ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement