ఆంధ్రప్రదేశ్: గుంటూరు తూర్పు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, ఆయన తనయుడు బషీర్పై నూజివీడు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం గుజరాత్లో ఉన్న ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకుని నూజివీడుకు తీసుకొచ్చారు.
అనంతరం ఆయనను నూజివీడు కోర్టులో హాజరుపరచగా, కేసును విచారించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముస్తఫాను నెల్లూరు జైలుకు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ న్యాయస్థానంలో కొనసాగనుంది.


