వధూవరులను ఆశీర్వదించిన గవర్నర్‌ నజీర్‌

Governor Justice Abdul Nazeer Bless The Newlyweds In Guntur - Sakshi

మంగళగిరి(గుంటూరు జిల్లా): జస్టిస్‌ కుంభజడల మన్మథరావు కుమారుడు కౌషిక్‌ వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరయ్యారు. గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో కౌషిక్‌ వివాహ రిసెప్షన్‌ బుధవారం రాత్రి జరిగింది.

వధువు ఉదయ, వరుడు కౌషిక్‌లను గవర్నర్‌ ఆశీర్వదించారు. కాగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
చదవండి: రెట్టించిన వృద్ధి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top