Sakshi News home page

#Janasena: పవన్‌కు చుక్కెదురు.. ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసు

Published Tue, Apr 2 2024 12:08 PM

Election Commission Allotted Free Symbol Glass To Jana Sena - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల్లో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్‌ జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్‌ పార్టీగానే గుర్తించింది. ఈ క్రమంలో జనసేనకు ఫ్రీ సింబల్‌గా గ్లాస్‌ గుర్తును కేటాయించింది. ఈ మేరకు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

కాగా, ఏపీలో ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాలను మంగళవారం ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీ సీఈవో గెజిట్‌ నోటిషికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఉన్నాయి. 

ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీకి ఫ్యాన​్‌ గుర్తు, టీడీపీకి సైకిల్‌ గుర్తును ఈసీ ప్రకటించింది. ఇదే సమయంలో జనసేనను ఈసీ ప్రాంతీయ పార్టీగా గుర్తించకపోవడం విశేషం. దీంతో, జనసేనను కేవలం రిజిస్టర్డ్‌ పార్టీగానే గుర్తించి.. ఎన్నికల్లో ఫ్రీ సింబల్‌ గ్లాసు గుర్తును కేటాయించింది. 
 

Advertisement
Advertisement