సాక్షి, విజయవాడ: విజయవాడ టీడీపీ ఎంసీ కేశినేని చిన్ని సతీమణి జానకీ లక్ష్మీకి తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP కంపెనీలో అవకతవకలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇందులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఈనెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, గతంలోనూ జానకీ లక్ష్మీకి ఈడీ సమన్లు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.



