
సాక్షి, విజయవాడ : రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనపై ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. రమేష్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణను జిల్లా కోర్టు ఈ నెల 21కు వాయిదా వేసింది. కాగా స్వర్ణ ప్యాలెస్లో రమేష్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. (ఆరోగ్యశ్రీ ముసుగులో ‘రమేష్’ మోసాలు!)