AP: దారుణం.. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి | Dogs Attack On 2 Years Boy In Ntr District Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: దారుణం.. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి

Nov 11 2024 7:48 PM | Updated on Nov 11 2024 8:21 PM

Dogs Attack On 2 Years Boy In Ntr District Andhra Pradesh

సాక్షి,ఎన్టీఆర్‌జిల్లా: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో సోమవారం(నవంబర్‌ 11) దారుణం జరిగింది. రెండేళ్ల బాలుడు బాలతోటి ప్రేమ్ కుమార్ తన ఇంటి ముందు ఆడుకుంటుండగా  వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.

దాడి చేసిన తర్వాత కుక్కలు బాలుడిని పొలాల్లోకి లాక్కెళ్లాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో పెనుగంచిప్రోలు గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి: రంగరాయలో ర్యాగింగ్‌ కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement