37 మంది జైలు వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు | Disciplinary action against 37 warders who violated rules: DIG Ravikiran | Sakshi
Sakshi News home page

37 మంది జైలు వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు

Dec 30 2024 5:00 AM | Updated on Dec 30 2024 5:00 AM

Disciplinary action against 37 warders who violated rules: DIG Ravikiran

జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజియన్‌ డీఐజీ రవికిరణ్‌ వెల్లడి

ఆరిలోవ (విశాఖ జిల్లా): విశాఖ కేంద్ర కారాగా­రంలో నిబంధనలు ఉల్లంఘించి­న 37 మంది వార్డర్లపై క్రమశిక్ష­ణా చర్యలు చేపట్టినట్లు జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజి­యన్‌ డీఐజీ రవికిరణ్‌ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారం పర్య­వేక్షణా­ధికారి ఎం.మహేశ్‌­బాబు అవమానించారని.. విధి నిర్వహణలో కఠినంగా ఉంటు­న్నారంటూ వార్డర్లు తమ కుటుంబ­సభ్యు­లతో జైలు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశా­రు. ఈ విషయం తెలుసుకున్న డీఐజీ రవి­కిరణ్‌ శనివారం అర్ధరాత్రి రాజమండ్రి నుంచి విశాఖ­కు చేరుకున్నా­రు.

వార్డర్ల­తో, జైలు సూపరింటెండెంట్‌తో చర్చించారు. ఆదివారం ఉద­యం జైలును సందర్శించి.. ఖైదీలతో మాట్లాడారు. అనంతరం మీడి­యాతో మాట్లాడు­తూ.. జైలులో ఉన్న­తాధికా­రుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయన్నారు. జైలు లోపలకు నిషేధిత వస్తువులు తెచ్చారని అనుమానం వస్తే.. ఎవరినైనా వెంటనే తనిఖీ చేయవచ్చని చెప్పారు. అందులో భాగంగా సూపరింటెండెంట్‌ సమక్షంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌.. ఇద్దరు వార్డర్లను తనిఖీ చేశారని తెలి­పా­రు. నిబంధనలను ఉల్లంఘించి జైల్‌ ముందు ధర్నా చేసి.. విధులకు గైర్హాజరైన 37 మంది వార్డర్లను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్లకు బదిలీ చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement