
‘సామాజిక బాధ్యత’కు కంపెనీల భారీ వ్యయం..
నిర్దేశిత మొత్తాన్ని మించి వెచ్చించిన 13,571 కంపెనీలు
2017–18లో ఇలాంటి కంపెనీలు 4,945 మాత్రమే..
సీఎస్ఆర్ ఫండింగ్లో ప్రైవేటు సంస్థల వాటా 86%
2022–23లో సీఎస్ఆర్కు మొత్తం రూ.29,987 కోట్లు.. పేదవారి చదువుకే మూడింట ఒక వంతు ఖర్చు
సాక్షి, స్పెషల్ డెస్క్: కార్పొరేట్ సామా జిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా కంపెనీలు తమ దాతృత్వాన్ని చాటు కుంటున్నాయి. కంపెనీలు ఏటా ఇందుకోసం వెచ్చిస్తున్న మొత్తం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022–23లో దేశ వ్యాప్తంగా 24,392 సంస్థలు సీఎస్ఆర్ కార్యక్రమాలకు రూ.29,987 కోట్లు ఖర్చు చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12.8% ఎక్కువ.
ఈ కంపెనీలు దేశ వ్యాప్తంగా మొత్తం 51,966 ప్రాజెక్టులు చేప ట్టాయి. 2021–22లో 19,888 కంపెనీలు రూ.26,580 కోట్లు ఖర్చు చేశాయి. అయితే 2022– 23లో 55.6% కంపెనీలు నిర్దేశిత మొత్తాన్ని మించి వ్యయం చేసిదాతృత్వంలో తమది పెద్ద చేయి అనిపించుకున్నాయి. సామాజిక బాధ్యతగా పేదవారి చదువుకే సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.
పెద్ద చేయి విస్తరిస్తోంది..
2022–23లో మొత్తం సీఎస్ఆర్ ఫండింగ్లో ప్రైవేటు సంస్థల వాటా ఏకంగా 86%. 13,571 కంపెనీలు నిర్దే శిత మొత్తం కంటే ఎక్కువగా వెచ్చించడం విశేషం. 2017– 18లో ఇటువంటి కంపెనీల సంఖ్య 4,945 మాత్రమే. నిర్దేశిత మొత్తాన్ని మించి సీఎస్ఆర్కు విరివిగా ఖర్చు చేస్తున్న టాప్– 10 సంస్థల్లో రిల యన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఐఓసీఎల్, మహానది కోల్ఫీల్డ్స్, గెయిల్ ఇండియా, విప్రో, ఎన్టీపీసీ, వేదాంత, మారుతీ సుజుకీ ఇండియా ముందున్నా యి.
నిర్దేశిత మొత్తం వ్యయం చేసిన కంపెనీలు 1,622. ఇక, రూపాయి కూడా విదిలించని కంపెనీల సంఖ్య 11,748 నుంచి 810కి దిగిరావడం శుభపరిణామం. సంస్థలు ఆర్జిస్తున్న లాభాల్లో మెరుగైన వృద్ధి సీఎస్ఆర్ నిధుల పెరుగుదలకు దోహదం చేస్తోంది. ఇక సీఎస్ఆర్లో భాగంగా 2022–23లో మూడు సంస్థలు రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేశాయి. 37 కంపెనీలు రూ.100–500 కోట్లు, 337 సంస్థలు రూ.10–100 కోట్లు వెచ్చించాయి. కంపెనీలు పేదల విద్య కోసం అత్యధికంగా రూ.10,086 కోట్లు వెచ్చించాయి. ఆరోగ్య సంరక్షణకు రూ.6,830 కోట్లు ఖర్చు చేశాయి.
ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు..
అన్లిస్టెడ్తో పోలిస్తే లిస్టెడ్ కంపెనీలే సీఎస్ఆర్లో ముందంజలో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్లో (ఎన్ఎస్ఈ) నమోదైన 1,394 సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం రూ.17,967 కోట్లు. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 15.7%అధికం. వీటిలో 66 ప్రభుత్వ సంస్థలు చేసిన వ్యయాలు అంత క్రితం ఏడా దితో పోలిస్తే 19% ఎగసి రూ.3,717 కోట్లకు చేరాయి. 2022–23లో 56 ప్రభుత్వ కంపెనీలు రూ.3,136 కోట్లు వెచ్చించాయి. 544 సంస్థలు విద్య కోసం రూ.1,104 కోట్లు ఖర్చు పెట్టాయి. ఆ తర్వాత ఆహారం, పేదరిక నిర్మూ లన, ఆరోగ్యం కోసం రూ.720 కోట్లు ఖర్చు పెట్టాయి.
సీఎస్ఆర్ చట్టం ఏం చెబుతోందంటే..
2014 ఏప్రిల్లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ సామాజిక బాధ్యత చట్టం ప్రకారం ఒక కంపెనీ రూ.500 కోట్ల విలువ కలిగి.. రూ.1,000 కోట్ల ఆదా యం లేదా రూ.5 కోట్ల నికరలాభం గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జిస్తే.. అంత క్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లో పొందిన లాభాల్లో సగటు మొత్తంపై 2% తప్పనిసరిగా సీఎస్ఆర్ కార్యక్రమాలకు వెచ్చించాలి.