ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు | Sakshi
Sakshi News home page

ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు

Published Fri, Apr 1 2022 7:09 PM

CM YS Jagan Couple Will Participate In Ugadi Celebrations On April 2 - Sakshi

సాక్షి, అమరావతి: శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రేపు(శనివారం) తాడేపల్లిలో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. ఉదయం 10.36కి పంచాంగ పఠనంలో సీఎం దంపతులు పాల్గొంటారు. పంచాంగ పఠనం కోసం గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు పూర్తి చేశారు.

చదవండి: శుభకృత్‌లో అన్నీ శుభాలు కలగాలి: సీఎం జగన్‌ 

శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు.

Advertisement
Advertisement