CM YS Jagan Console To YSRCP MLA Maddali Giridhar Family - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

May 23 2023 10:25 AM | Updated on May 23 2023 11:40 AM

CM YS Jagan Console To YSRCP MLA Maddali Giridhar Family - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. కాగా, ఎమ్మెల్యే గిరిధర్‌ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ మాతృమూర్తి శివపార్వతి సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.   

ఇది కూడా చదవండి: నేడు గుంటూరు నగరానికి సీఎం వైఎస్‌ జగన్‌ రాక.. ట్రాఫిక్‌ మళ్లింపులు ఇవే..

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement