గణతంత్ర దినోత్సవం.. సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: నేడు స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం తన సందేశాన్ని ట్వీట్ చేశారు. ‘‘ఇప్పటికి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగ కర్తలను స్మరించుకుందాం. వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం’’ అని సీఎం ట్విటర్లో పిలుపునిచ్చారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుంటూ వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం. #RepublicDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2023