వైఎస్సార్‌ జిల్లాపై సీఎం చంద్రబాబు మరోమారు కక్ష సాధింపు | Chandrababu Govt Order Issued On Msme Technology Establishment In Amaravati Instead Of Kopparthy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాపై సీఎం చంద్రబాబు మరోమారు కక్ష సాధింపు

Sep 24 2024 9:58 PM | Updated on Sep 25 2024 3:34 PM

Chandrababu Govt Order Issued On Msme Technology Establishment In Amaravati Instead Of Kopparthy

వైఎస్సార్‌ కడప, సాక్షి: వైఎస్సార్‌ జిల్లాపై సీఎం చంద్రబాబు మరో మారు కక్షసాధింపుకు దిగారు. జిల్లాలోని కొప్పర్తి సెజ్‌లో కేంద్రం కేటాయించిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తీసుకెళ్లారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొప్పర్తి నార్త్‌ బ్లాక్‌లో 19.5 ఎకరాల్లో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.  

అయితే, ప్రభుత్వం మారగానే కొప్పర్తికి మంజూరైన టెక్నాలజీ సెంటర్‌ను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకెళ్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. టెక్నాలజీ పార్క్‌ వల్ల యువతకు స్కిల్‌ ట్రైనింగ్, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్‌ నైపుణ్యాలు అందాల్సి ఉంది. కానీ చంద్రబాబు కడప యువత అవకాశాలను దెబ్బతీస్తూ జీవో నంబర్‌ 56ను విడుదల చేశారు.  

చదవండి : తిరుమల లడ్డు వివాదం : సిట్‌తో నిజాలు నిగ్గు తేల్చలేం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement