విజయవాడ: మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులపై ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుంది. పోర్టుల విస్తరణ సామర్థ్యాన్ని కుందించేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని చేపట్టారు.
ఇప్పుడు మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కి.మీ నుంచి 15 కి.మీ తీరప్రాంతానికి కుదిస్తూ, రామాయపట్నం పోర్టు పరిధిని 51 కి.మీ నుంచి 15 కి.మీ తీరప్రాంతానికి కుదిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం ఉపాధి కల్పనపై తీవ్ర ప్రభావం చూపనుంది.


