సాక్షి, తాడేపల్లి: భగీరథుని జయంతి సందర్భంగా సగరులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.#BhagirathaMaharshiJayanthi pic.twitter.com/HMuhFkZYEZ
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 23, 2026


