జమ్మూ కశ్మీర్‌లో బాపట్ల సైనికుడి మృతి | Bapatla soldier died in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌లో బాపట్ల సైనికుడి మృతి

Sep 26 2025 5:17 AM | Updated on Sep 26 2025 5:17 AM

Bapatla soldier died in Jammu and Kashmir

తలలోకి దూసుకెళ్ళిన బుల్లెట్‌

సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు 

బాపట్ల టౌన్‌: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ హవల్దార్‌­గా విధులు నిర్వర్తిస్తూ బాపట్లకు చెందిన సైనికుడు మృతి చెందారు. బాపట్ల మండలం, కంకటపాలేనికి చెందిన మద్దసాని గోపికృష్ణ(33) బుధవా­రం రాత్రి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా, తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో మృతి చెందారు. ప్రమా­దా­నికి గల కారణాలు తెలియరాలేదు. సైని­కుడి మృతిపై విచారణ జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అతని పార్థివ దేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు. 

జిల్లా పోలీస్‌ అధికారులు, సూర్యలంక ఎయిర్‌ ఫోర్స్, ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ అధికారులు, ఎన్‌సీసీ అధికారులు, ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు కంకటపాలేనికి చేరుకొని సైనికుడి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతునికి భార్య హేమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement