ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి | Attack on RTC Driver | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి

Sep 12 2026 12:08 PM | Updated on Sep 12 2026 12:45 PM

 Attack on RTC Driver

గుంటూరు: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై అమానుషంగా దాడిచేసిన ఘటనపై తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ బస్సు వెళ్తోంది. ఆ డ్రైవర్‌ను తలమల ఏసురాజు నడుపుతున్నాడు. బస్సు ముందు బైక్‌పై వెళ్తున్న పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం డ్రైవర్‌పై దాడిచేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ  తెలిపారు. 

ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్‌ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్‌ ఏసురాజును  కొట్టిన దుర్గాప్రసాద్‌ వీడియో ఫేస్‌బుక్‌ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి, నోటీసులు జారీ చేశారు.    

ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement