AP: Power Finance Corporation Sanctioned Loan Machilipatnam Port - Sakshi
Sakshi News home page

ఏపీ: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి మరో ముందడుగు

Published Sat, Nov 19 2022 12:53 PM

AP: Power Finance Corporation sanctioned Loan Machilipatnam port - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవలే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. 

తాజాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ. 3, 940 కోట్లు మంజూరు అయ్యింది. దీంతో పోర్టు వ్యయానికి అవసరమయ్యే వంద శాతం రుణం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినట్లయ్యింది.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి మంజూరు ఉత్తర్వులు పంపింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. దీంతో అతి త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement