19 కేసులు: 18 ఎఫ్ఐఆర్‌లపై ఏపీ హైకోర్టు స్టే | AP High Court Stay 18 FIRs Of 19 Cases Of Harishwar Reddy | Sakshi
Sakshi News home page

19 కేసులు: 18 ఎఫ్ఐఆర్‌లపై ఏపీ హైకోర్టు స్టే

May 1 2025 3:27 PM | Updated on May 1 2025 3:32 PM

AP High Court Stay 18 FIRs Of 19 Cases Of Harishwar Reddy

అమరావతి:   సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగ హరీశ్వరరెడ్డికి  ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హరీశ్వరరెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన 19 కేసుల్లో భాగంగా 18 ఎఫ్ఐఆర్ లపై హైకోర్టు స్టే విధించింది. ఒక్క ఎఫ్ఐఆర్ మినహా మిగిలిన 18 ఎఫ్ఐఆర్ లపై హైకోర్టు స్టే విధించింది. దాంతో ఒక్క ఎఫ్ఐఆర్ మీద దర్తాప్తునకు హైకోర్టు అనుమతి ఇచ్చినట్లయ్యింది.   18 కేసుల్లో స్టే విధించడంపై ప్రజాస్వామ్య వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అక్రమ కేసులు పెడుతున్న చంద్రబాబు సర్కారుకు ఇది చెంపపెట్టు వంటిదని వారు అంటున్నారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు , మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ హరీశ్వరరెడ్డి హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు గత వారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాలకు మేర తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్లు లోపు శిక్ష పడే కేసుల్లో కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారని, మేజిస్ట్రేట్లు తగిన కారణాలు కూడా వెల్లడించటం లేదన్నారు.

ఇది అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించడమే అవుతుందని,  హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.  లోపు భూయిష్ట ఉత్తర్వులను తమ దృష్టికి తీసుకువస్తే హైకోర్టు చర్యలు తీసుకుంటామందని, అందుకే నిబంధనలు పాటించలేని కొన్ని కేసులను తమ దృష్టికి తీసుకువస్తున్నట్లు హరీశ్వరరెడ్డి ఫిర్యాదులో వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement