ప్రవీణ్‌ ప్రకాష్‌ బదిలీకి సర్కారు ‘నో’

AP Government Rejected Orders To Transfer Praveen Prakash - Sakshi

సాక్షి, అమరావతి: సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్‌ ప్రకాష్‌ను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) జారీచేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసు అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఈసీకి లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదివారం ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ మీద చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని సీఎస్‌ కోరారు. (చదవండి: జేసీ విజయకు హైకోర్టులో చుక్కెదురు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top