
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పేర్ని వెంకట్రామయ్యకు (నాని) రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలను కూడా కేటాయించింది. ఈమేరకు బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జిఓఎంఎస్ సంఖ్య 144 ద్వారా రాజపత్రం(గెజిట్ నోటిఫికేషన్) జారీచేశారు.
చదవండి: (బస్సు ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్గ్రేషియా)