బందరు పోర్టుకు శంకుస్థాపనపై సీఎం జగన్ ట్వీట్

AP CM YS Jagan Mohan Reddy Tweet On Machilipatnam Port Inauguration - Sakshi

సాక్షి, తాడేపల్లి: బందరు పోర్టుకు శంకుస్థాపన చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం (బందరు) పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంకుస్థాపన చేశామని ట్వీట్‌లో పేర్కొన్నారు.

4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మిస్తున్నామని అన్నారు. కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్టును జాతీయ రహదారి-216కి, అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైనుకి అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.

కాగా, మచిలీపట్నం ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్‌ జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో.. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం సీం జగన్‌ తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్‌ ఆవిష్కరించారు. 

చదవండి: ఆయన కోరుకున్న అమరావతి అలాంటిది మరి!.. బాబు ‘సమాధి’ వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఆవేదన
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top