మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

Aug 6 2026 2:38 AM | Updated on Aug 6 2026 2:38 AM

శెట్టూరు: మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ సుమన్‌ తెలిపిన మేరకు.. మండలంలోని లక్ష్మంపల్లికి చెందిన నాగభూషణ (45) ఈ నెల 2న తన భార్య లక్ష్మిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. అప్పటికే అతను ఎక్కువగా మద్యం సేవించి ఉండటంతో డబ్బు ఇవ్వనని భార్య చెప్పింది. దీంతో తాను చనిపోతానంటూ భార్యను బెదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగభూషణ తిరిగి రాలేదు. చుట్టాల ఊరికి వెళ్లి ఉంటాడని భార్య భావించింది. ఈ క్రమంలోనే బుధవారం గ్రామానికి చెందిన బోయ బొజ్పప్ప పొలంలోని కంప చెట్లలో ఉరివేసుకుని నాగభూషణ మృతి చెందినట్లు గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సుమన్‌ పరిశీలించారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement