కోఆపరేటివ్ ఫ్యాక్టరీలను లిక్విడేషన్ చేసే పేరుతో వాటి ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. షేర్ హోల్డర్లుగా ఉన్న రైతుల సమ్మతితో తీర్మానం చేయకుండా ఫ్యాక్టరీలపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు. చోడవరం ఫ్యాక్టరీ భూముల విలువ పెరిగినందున వాటిని ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం హామీగా తీసుకున్న రుణాలను ప్రభుత్వం గ్రాంట్గా భరించాలి, ఆ భారాన్ని రైతులపై మోపకూడదు. చోడవరం రైతులకు కనీసం బ్యాంకు వడ్డీ అయినా చెల్లిస్తారో లేదో చెప్పాలి. ఆస్తుల బదలాయింపు చేస్తే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది.
– కరణం ధర్మశ్రీ, మాజీ ప్రభుత్వ విప్


