● ఉత్తర్వులు జారీ చేసినపురపాలక శాఖ కమిషనర్
యలమంచిలి రూరల్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముందస్తు కసరత్తు ప్రక్రియలో భాగంగా వార్డుల పునర్విభజన, పెంపునకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక చర్యలు చేపట్టారు. 25 వార్డులుగా ఉన్న యలమంచిలి పురపాలకసంఘంలో వార్డుల సంఖ్య 32కు పెంచుతూ పురపాలక శాఖ కమిషనర్ కె. సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గత మే నెలలో మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. దీనిపై పరిశీలన జరిపిన అధికారులు తాజాగా వార్డుల సంఖ్య 32కు పెంచారు.


