
పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు
అనంతగిరి(అరకులోయటౌన్): వైఎస్సార్సీపీ లో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరిలో పార్టీ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడారు. గ్రామ స్ధాయి నుం,ఇ నియోజకవర్గ స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని పిలుపు నిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. మండలంలోని రాజకీయ స్థితి గతులను అడిగి తెలుసుకున్నా రు. ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శెట్టి ఆనంద్, ఎస్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు స్వామి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అప్పారావు, సర్పంచ్లు రాములమ్మ, పెంటమ్మ, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎంపీటీసీ సభ్యులు తవిటి నాయుడు, అశోక్, నాయకులు చిన్నయ్య, మధుసుధాన్, తదితరులు పాల్గొన్నారు.