అథ్లెటిక్స్ పోటీల్లో పీడీ ప్రతిభ
● బంగారు పతకం సాధన
ఎటపాక: కరీంనగర్లో ఈనెల 27,28 తేదీల్లో జరిగిన 12 మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని నల్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగిరెడ్డి బంగారు పతకం సాధించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 45 నుంచి 50 ఏళ్ల వయసు విభాగం షాట్పుట్ విభాగంలో ఆయన ప్రతిభ కనబరిచారు. వంద మీటర్ల పరుగు పందెం, జావెలన్ త్రోలో సిల్వర్ పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రాజస్థాన్లో జరిగే జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నా ఆయనను సహచర ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.


