ఆదిలాబాద్టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. ఇందులో భాగంగా నేడు సమరభేరికి సిద్ధమయ్యారు. టీజీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం మహా ధర్నా చేపట్టనున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విన్నవించినా సానుకూల స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైనట్లు జేఏసీ నాయకులు చెబుతున్నారు. జిల్లాలోని నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు సుమారు 7వేల మంది వరకు ఇందులో పాల్గొననున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సైతం భాగస్వాములవుతున్నట్లు వెల్ల డించారు. మరోవైపు ఇప్పటికే కలెక్టర్ రాజర్షిషాను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశామని, ధర్నాకు అనుమతి కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ను కూడా కలిసినట్లు వివరించారు.
డిమాండ్లు ఇవే..


