ఏటా సీడ్ ఆలస్యంగా వదల డం ద్వారా మార్చి వరకు నీరు అడుగంటి చేపల బరువు తగి నంతగా పెరగడం లేదు. పంపి ణీ దశలోనే ఎక్కువగా చనిపోతున్నాయి. దీంతో నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా త్వరితగతిన పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. – అల్లుల భోజన్న,
గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు
6న టెండర్ నోటిఫికేషన్
చేప సీడ్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధులు సైతం కేటాయిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం ఈనెల 6న టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తాం. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తాం. ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం.


