ఉట్నూర్ జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయినా వైద్యసేవలు మాత్రం అంతంత మాత్రంగానే అందుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను రిమ్స్కు రిఫర్ చేస్తున్నారు. ఆర్థోపెడిక్, ఈఎన్టీ, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ తదితర పోస్టుల్లో స్పెషలిస్టు వైద్యులు లేరు. గైనిక్ విభాగంలో ఒక్కరితోనే సేవలు అందుతున్నాయి. టీహబ్ భవనం ఏర్పాటు చేసినా సిబ్బందిని నియమించలేదు. ఆస్పత్రి సిబ్బందితోనే పనులు కానిచ్చేస్తున్నారు. దీంతో వారిపై పనిభారం పెరుగుతోంది. ఐసీయూ ఏర్పాటు చేసినా ఎప్పుడు తాళం వేసే దర్శనమిస్తోంది.


