రీసర్వే సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రీసర్వే సద్వినియోగం చేసుకోవాలి

Jul 16 2026 5:06 AM | Updated on Jul 16 2026 5:06 AM

సాత్నాల: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన భూభారతి రీసర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ చిత్రు అన్నారు. భోరజ్‌ మండలంలోని తర్ణం గ్రామంలో మీర్జాపూర్‌,అవల్పూర్‌, కామ యి రైతులకు అవగాహన కల్పించేందు కు బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూముల హ ద్దులు, విస్తీర్ణం, రికార్డులు కచ్చితంగా నమోదు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో రైతులు తప్పని సరిగా పాల్గొని తమ భూముల హ ద్దులను పరిశీలించుకోవాలని, అభ్యంతరాలు, సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణారెడ్డి, ఏడి ప్ర భాకర్‌, తహసీల్దార్‌ రాథోడ్‌ బాబుసింగ్‌, స ర్పంచ్‌ అరవింద్‌, ఆర్‌ఐ విలాస్‌, సర్వేయర్‌ మోహనకృష్ణ,జీపీవోలు,రైతులు పాల్గొన్నారు.

నిరాలలో..

జైనథ్‌: భూభారతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని నిరాల రైతు వేదికలో నిరాల, ముక్తాపూర్‌, అడ, నిజాంపూర్‌ రైతులతో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. భూ రీసర్వే పై అవగాహన కల్పించారు. తహసీల్దార్‌ నారా యణ, సర్వేయర్‌ సుదర్శన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement