
భూభారతిపై అవగాహన అవసరం
ఇచ్చోడ: భూభారతి చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగా హన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. మండల కేంద్రంలోని షార్ప్గార్డెన్లో ఆదివా రం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూభారతి చట్టంతో భూసమ స్యలకు సత్వర పరిష్కారం లభించనుందని అన్నా రు. అనంతరం పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించగా పరిష్కార దిశగా ఆయన సూచనలు చేశారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదే వి, ఆర్డీవో వినోద్కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ: మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్న భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు.