
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ఆదిలాబాద్టౌన్(జైనథ్): రైతులు పండించి న పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శంకర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబడిని విక్రయించాలని సూచించారు. ఇందులో మార్కె ట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి, పీఏసీఎస్ చై ర్మన్ గోవర్ధన్రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
బేల:మండలకేంద్రంలోనిసబ్మార్కెట్యా ర్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లను ఎంపీనగేశ్, ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఇందులో మార్క్ఫెడ్ డీఎం ప్రవీ ణ్ రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి, వైస్ చైర్మన్ విలాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.