
బాల్య వివాహం చట్టరీత్యా నేరం
బేల: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని డీసీపీయూ సంరక్షణ అధికారి ఎన్. స్వామి అన్నారు. గురువారం మండల కేంద్రంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు 1098కు వచ్చిన సమాచారం మేరకు చైల్డ్ వెల్ఫేర్, డీసీ పీయూ, చైల్డ్లైన్, షూర్ ఎన్జీవో, పోలీసులతో కలిసి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు చేయడం తప్పన్నారు. ఈ చట్టం ప్రకారం రూ.2లక్షల జరిమానా, ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. ఇక్కడ అమ్మాయికి 16, అబ్బాయికి 18 ఏళ్లు మాత్రమే ఉన్నాయని, ఇద్దరూ మైనర్లేనన్నారు. ఇలా పెళ్లి చేయడంతో వారి ఉజ్వల భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. బాల్య వివాహం చేయమని ఇరువురి తల్లితండ్రులచే ఒప్పందపత్రం రాయించి తీసుకున్నా రు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కౌన్సిలర్ పద్మజారాణి, కేస్ వర్కర్ శ్రీకాంత్, షూర్ ఎన్జీవో కోఆర్డినేటర్ వినోద్, ఏఎస్సై లింగన్న, తదితరులు పాల్గొన్నారు.