venue
-
MI Vs PBKS: ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు!
న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం పంజాబ్ రెండో సొంత మైదానమైన ధర్మశాలలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా... ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై జట్టు ధర్మశాలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ను ముంబైలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యగా భారత సైన్యం... పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు విమానాశ్రయాలను మూసి వేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై జట్టు ధర్మశాల చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ ముంబైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా... గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ యథావిథిగా జరగనుంది. ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ‘బీసీసీఐ నుంచి కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో గురువారం మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేశాం. అధికారికంగా చెప్పనంత వరకు షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తాం’ అని హిమాచల్ప్రదేశ్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వేదిక మార్పునకు సంబంధించిన బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఐపీఎల్ సాగడంపై ఎలాంటి అనుమానాలు లేవని... ప్రభుత్వ సూచనల మేరకు లీగ్ నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. -
భారత్లో 6 లక్షల మంది కొన్న కారు ఇదే..
అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్ వెన్యూ' కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి.హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..హ్యుందాయ్ వెన్యూ మొత్తం 26 వేరియంట్లు, 3 ఇంజన్లు, 3 గేర్బాక్స్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కాగా కంపెనీ 2025 వెన్యూ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాబోయే 2025 వెన్యూ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
Hyundai Venue E+: ఎలక్ట్రిక్ సన్రూఫ్తో అదిరిపోతున్న కొత్త వేరియంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అప్డేట్ చేసిన ‘వెన్యూ ఈప్లస్’ (Hyundai Venue E+) వేరియంట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 లక్షలతో ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ జోడింపుతో ఈ లైనప్లో మొత్తం వెన్యూ వేరియంట్ల సంఖ్య పదికి చేరింది.‘వెన్యూ ఈప్లస్’ మోడల్ను ఎలక్ట్రిక్ సన్రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్రెస్ట్ వంటి సరికొత్త ఫీచర్లతో అప్డేట్ చేశారు. ఇక కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, వీటికి టూస్టెప్ రిక్లైన్ ఫంక్షన్ ఇచ్చారు. ఆరు ఎయిర్బ్యాగ్లు ప్రయాణికులకు భద్రత కల్పిస్తాయి. డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఇంజిన్ గురించి చెప్పుకోవాలంటే ‘వెన్యూ ఈప్లస్’ 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్తో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇంజిన్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే.. 82 బీహెచ్పీ, 114 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే ఈ, ఎస్, ఎస్ ప్లస్, ఎస్ (O), ఎగ్జిక్యూటివ్, ఎస్ (O) ప్లస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్, ఎస్ఎక్స్ ( O) వేరియంట్లు ఉన్నాయి. కొత్త ఈప్లస్ మోడల్ కావాలంటే ‘వెన్యూ ఈ’ వేరియంట్పై రూ. 29,000 అదనంగా ఖర్చవుతుంది. -
మన దౌత్యం...కొత్త శిఖరాలకు
న్యూఢిల్లీ: గత నెల రోజుల్లో భారత దౌత్య ప్రతిభ నూతన శిఖరాలను తాకిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 21వ శతాబ్దిలో ప్రపంచ గతిని నిర్ణయించే పలు కీలక నిర్ణయాలకు ఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు వేదికైందన్నారు. నేటి భిన్న ధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలను ఒకే వేదిక మీదికి తేవడం చిన్న విషయమేమీ కాదన్నారు. ‘దేశ వృద్ధి ప్రస్థానం నిర్నిరోధంగా సాగాలంటే స్వచ్ఛమైన, స్పష్టమైన, సుస్థిరమైన పాలన చాలా ముఖ్యం. ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు, మార్పులకు రాజకీయ స్థిరత్వం, విధాన స్పష్టత, పాలనలో ప్రతి అడుగులోనూ పాటిస్తున్న ప్రజాస్వామిక విలువలే ప్రధాన కారణం‘ అని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఇక్కడ జీ20 కనెక్ట్ లో విద్యార్థులు, బోధన సిబ్బంది, విద్యా సంస్థల అధిపతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతిని, వ్యవస్థలో లీకేజీలను అరికట్టేందుకు, దళారుల జాడ్యాన్ని నిర్మూలించేందుకు, పథకాల అమలుకు టెక్నాలజీని గరిష్టంగా వాడుకునేందుకు గత తొమ్మిదేళ్లలో తమ సర్కారు చిత్తశుద్ధితో ప్రయతి్నంచిందని చెప్పారు. భారత్, ద హ్యాపెనింగ్ ప్లేస్! భారత్ ఇప్పుడు ఎన్నో కీలక సంఘటనలకు వేదికగా మారుతోందని మోదీ అన్నారు. ‘గత నెల రోజుల ఘటనలే ఇందుకు నిదర్శనం. దానిపై ప్రగతి నివేదిక ఇవ్వదలచుకున్నా. అప్పుడు నూతన భారతం వృద్ధి పథంలో పెడుతున్న పరుగుల తాలూకు వేగం, తీవ్రత అర్థమవుతాయి. గత నెల వ్యవధిలో నేను ఏకంగా 85 దేశాల అధినేతలతో భేటీ అయ్యా. ఇక ఆగస్టు 23ను మనమెప్పటికీ గుర్తుంచుకోవాలి. అది భారత్ సగర్వంగా చంద్రుని మీద అడుగు పెట్టిన రోజు. ప్రపంచమంతా మన వాణిని విన్న రోజు. మనందరి పెదవులపై గర్వంతో కూడిన దరహాసం వెలిగిన రోజు. అందుకే జాతీయ అంతరిక్ష దినంగా ఆగస్ట్ 23 మన దేశ చరిత్రలో అజరామరంగా నిలవనుంది. ఆ విజయపు ఊపులో వెనువెంటనే సౌర యాత్రకు మనం శ్రీకారం చుట్టాం‘ అన్నారు. ఇక మామూలుగా కేవలం ఒక దౌత్య భేటీగా జరిగే జీ20 సదస్సును మన ప్రయత్నాలతో పౌర భాగస్వామ్యంతో కూడిన జాతీయ ఉద్యమంగా మలచుకున్నాం. ఢిల్లీ డిక్లరేషన్కు జీ20 దేశాల నుంచి 100 శాతం ఏకాభిప్రాయం దక్కడం ప్రపంచ స్థాయిలో పతాక శీర్షికలో నిలిచింది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్య దేశంగా చేరింది. ఇలాంటివన్నీ ఆ సదస్సు సారథ్య సందేశంగా మనం సాధించిన ఘనతలే. అంతేకాదు, భారత ప్రయత్నాల వల్ల మరో ఆరు దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి‘ అని వివరించారు. వీరికి అందలం, వారికి అరదండాలు! నేడు మన దేశంలో నిజాయితీపరులకు గుర్తింపు, అవినీతిపరులకు తగిన శిక్ష దక్కుతున్నాయని మోదీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మధ్య తరగతి శ్రేయస్సు కోసం గత నెల రోజుల్లో కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చింది. పీఎం విశ్వకర్మ యోజన, రోజ్ గార్ మేళాతో లక్ష మంది యువతకు ఉపాధి వంటివన్నీ వాటిలో భాగమే‘ అన్నారు. ‘మన దేశం మీద అంతర్జాతీయంగా భరోసా ఇనుమడిస్తోంది. విదేశీ పెట్టుబడుల వెల్లువ రికార్డులు తాకుతోంది. కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడి నూతన మధ్య తరగతిగా రూపుదాల్చారు‘ అని వివరించారు. యువతా! కలసి నడుద్దాం...! జీ20 సదస్సు ఘన విజయానికి యువత భాగస్వామ్యం ప్రధాన కారణమని మోదీ అన్నారు. లోకల్ నినాదానికి ఊపు తెచ్చేందుకు కాలేజీ, వర్సిటీ క్యాంపస్ లు కేంద్రాలుగా మారాలని ఆశాభావం వెలిబుచ్చారు. ‘ఖాదీ దుస్తులు ధరించడం ద్వారా వాటికి ప్రాచుర్యం కల్పించండి. క్యాంపస్లలో ఖాదీ ఫ్యాషన్ షోలు పెట్టండి’ అని యువతను కోరారు. ‘మన స్వాతంత్య్ర యోధుల్లా దేశం కోసం మరణించే అదృష్టం మనకు లేదు. కనీసం దేశం కోసం జీవితాలను అంకితం చేసే సదవకాశం మాత్రం మనందరికీ ఉంది’ అని గుర్తు చేశారు. వందేళ్ల క్రితం యువత స్వరాజ్య భారతం కోసం కదం తొక్కింది. మనమిప్పుడు సమృద్ద భారతం కోసం పాటుపడదాం. రండి, కలసి నడుద్దాం!‘ అని పిలుపునిచ్చారు. -
జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: జీ20 వేదిక భారత మండపం వద్ద వర్షపు నీరు వరదలుగా పారుతోందని విపక్షాలు చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పుబట్టింది. ప్రతిపక్షాల వ్యాఖ్యలు అవాస్తవాలని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తేలికపాటి వర్షం నీరు భారత మండపం బయట నిలిచిందని పేర్కొంది. వెంటనే ఆ నీటిని మోటర్లను ఉపయోగించి బయటకు పంపినట్లు వెల్లడించింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. అటు టీఎంసీ నేత సాకేత్ గోఖలే కూడా కేంద్రాన్ని విమర్శించారు. రూ.4000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వర్షం నీరు వరదలుగా పారుతోందని విమర్శించారు. నిధులను మోదీ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో తెలుస్తోందని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కేంద్రం స్పందించింది. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇదీ చదవండి: జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్కు అప్పగింత -
23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?
Hyundai Venue Knight Edition హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ దరను రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ఎడిషన్ ధర రూ. 13.48 లక్షలుగా ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ SUV S(O) , SX వేరియంట్లకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 1.2 l కప్పా పెట్రోల్ ఇంజన్ అమర్చింది. SX(O) వేరియంట్ కోసం 6MT, 7DCTతో 1.0 l T-GDi పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. వెన్యూ నైట్ ఎడిషన్ 4 మోనోటోన్ , 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, ఫియరీ రెడ్ అండ్ ఫియరీ రెడ్ విత్ అబిస్ బ్లాక్ కలర్స్లో కొత్త వెన్యూ నైట్ ఎడిషన్ లభ్యం. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ 23 ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్, హ్యుందాయ్ లోగో, బ్రాస్ కలర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్సర్ట్లు, ఫ్రంట్ వీల్స్పై బ్రాంచ్ కలర్ ఇన్సర్ట్లు, బ్రాంచ్ రూఫ్ రైల్ ఇన్సర్ట్లు, డార్క్ క్రోమ్ రియర్ హ్యుందాయ్ లోగో,వెన్యూ ఎంబ్లం, నైట్ ఎంబ్లం, బ్లాక్ ఉన్నాయి. పెయింట్ చేయబడిన రూఫ్ రెయిల్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, ORVMలు, రెడ్ కలర్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్/వీల్ కవర్, బ్లాక్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లతో పాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రధానంగా ఉన్నాయి. వెన్యూ నైట్ ఎడిషన్ 82 bhp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజీన్, 118 bhp 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండింటితో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెన్యూ , వెన్యూ ఎన్-లైన్ లా కాకుండా, టర్బో-పెట్రోల్ యూనిట్ మాన్యువల్ గేర్బాక్స్తో కొత్త ఎడిషన్ తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్లు iMTని పొందుతాయి. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఇంటీరియర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ బ్రాస్ కలర్ ఇన్సర్ట్లతో బ్లాక్ ఇంటీరియర్, బ్రాస్ కలర్ హైలైట్లతో ప్రత్యేకమైన బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ, డ్యుయల్ కెమెరాతో డాష్క్యామ్, స్పోర్టీ మెటల్ పెడల్స్, ECM IRVM , 3D డిజైనర్ మ్యాట్లను పొందుపర్చింది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
ఢిల్లీలో IECC ప్రారంభోత్సవం
-
ఇండియా - పాక్ మెగా ఫైట్కి స్పాట్ ఫిక్స్
-
ధర్మశాల టెస్టు వైజాగ్లో?
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ)కు చెందిన ఈ మైదానంలో అసంపూర్తి పనులవల్ల మ్యాచ్ వేదికను మార్చాల్సి వస్తుందని బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ధర్మశాల స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ సహా పిచ్పై పచ్చికను కొత్తగా పరిచారు. పిచ్ను ఇంకా పరీక్షించలేదు. అక్కడక్కడ పనులు ఇంకా పూర్తవలేదు. ప్యాచ్ వర్క్ అలాగే మిగిలిపోయింది. అందువల్లే ఐదు రోజుల ఆట (టెస్టు మ్యాచ్)ను అసంపూర్ణమైన మైదానంలో నిర్వహించడం సమంజసం కాదని బీసీసీఐ భావిస్తోంది. మూడో టెస్టుకు ప్రత్యామ్నాయ వేదికలుగా వైజాగ్, బెంగళూరు, ఇండోర్, రాజ్కోట్లను బోర్డు పరిశీలిస్తోంది. -
BGT 2023: బిగ్ న్యూస్.. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ వేదిక మార్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి బిగ్ న్యూస్ లీకైంది. సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వేదిక మారే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో జరిగేది అనుమానమని తెలుస్తోంది. ధర్మశాల స్టేడియంలో రెనొవేషన్ (పునరుద్ధరణ) పనులు జరుగుతున్నాయని, మార్చి 1 నాటికి అవి పూర్తవుతాయా.. లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారిందని సదరు అధికారి తెలిపాడు. ఈనెల (ఫిబ్రవరి) 3న బీసీసీఐ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఔట్ ఫీల్డ్తో పాటు పిచ్ సైడ్ ఏరియా పూర్తిగా సిద్ధంగా లేదని తేలిందని వివరించాడు. అయితే టెస్ట్ ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉందని, ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హిమాచల్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మూడో టెస్ట్కు బ్యాకప్గా మరో ఐదు స్టేడియాలు ఎంపిక చేసినట్లు వివరించాడు. మూడో టెస్ట్ మొహాలీలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్లు ఉన్నట్లు సదరు అధికారి తెలిపాడు. కాగా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిరోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్ను తొలగించి కొత్తది తయారు చేశారు. వర్షం కురిస్తే మ్యాచ్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను అమర్చారు. దీంతో పాటు గ్రౌండ్లో స్ప్రింక్లర్లను కూడా ఫిట్ చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలో మూడో టెస్ట్ జరిగేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
కేఎల్ రాహుల్- అతియా పెళ్లి వేదిక! ఎంత అందంగా ఉందో చూశారా?! (ఫొటోలు)
-
హైదరాబాద్ సాహిత్యోత్సవం.. ప్రత్యేకతలు ఇవే
సాక్షి, హైదరాబాద్: వైవిధ్యభరితమైన హైదరాబాద్ సాహితీ ఉత్సవం (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్) 13వ ఎడిషన్కు నగరం సన్నద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యారణ్య స్కూల్ వేదికగా వేడుకలు జరగనున్నాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్ఎల్ఎఫ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్ సాహిత్యోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2010 నుంచి నిరాటంకంగా (కోవిడ్ కాలం మినహా) జరుగుతున్న లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యాన్ని గడించింది. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, భిన్న భావజాలాలు, విభిన్న జీవన సమూహాలను ప్రతిబింబించే కళారూపాలకు, సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలకు ఇది వేదికగా నిలిచింది. మూడు రోజుల పాటు సాహితీ ప్రియులను అక్కున చేర్చుకొని సమకాలీన సాహిత్య, సామాజిక అంశాలపై లోతైన చర్చలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అతిథి దేశంగా జర్మనీ.. హెచ్ఎల్ఎఫ్ 13వ ఎడిషన్కు జర్మనీ అతిథి దేశంగా హాజరు కానుంది. ఆ దేశానికి చెందిన పలువురు రచయితలు, మేధావులు భాగస్వాములు కానున్నారు. ప్రముఖ జర్మనీ యువ నవలా రచయిత్రి ఎవేన్కో బుక్కోసీ ఈ వేడుకల్లో పాల్గొంటారు. జర్మనీ కళారూపాలను ప్రదర్శించనున్నారు. కొంకణి సాహిత్యం ఎంపిక.. ఈ ఏడాది కొంకణి భాషా సాహిత్యాన్ని భారతీయ భాషగా ఎంపిక చేశారు. గతేడాది జ్ఞానపీఠ అవార్డు పొందిన కొంకణికి చెందిన ప్రముఖ రచయిత దామోదర్ మౌజో ఈ వేడుకల్లో కీలకోపన్యాసం చేయనున్నారు. కొంకణి భాషా చిత్రాల దర్శకుడు బార్డ్రాయ్బరెక్టో పాల్గొంటారు. కొంకణి నృత్యాలు, జానపద కళలను ప్రదర్శించనున్నారు. ప్రముఖుల ప్రసంగాలు ప్రఖ్యాత దర్శకుడు దీప్తీ నవల్, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత పాలగుమ్మి సాయినాథ్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మానస ఎండ్లూరి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి గీతా రామస్వామి, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. జర్మనీతో పాటు అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్ చారిత్ర వైభవాన్ని, వాస్తు నైపుణ్యాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉషా ఆకెళ్ల రూపొందించిన ‘హమ్ ఐసీ బాత్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది అందరి వేడుక: ప్రొఫెసర్ విజయ్కుమార్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ఈసారి మెట్రో రైల్ ప్రత్యేక ప్రచారం నిర్వహించనుంది. ఖైరతాబాద్ నుంచి విద్యారణ్య స్కూల్ వరకు మూడు రోజుల పాటు ప్రతి 15 నిమిషాలకో ఉచిత ట్రిప్పును ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్ఫాం!) -
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కొత్త కార్ను భారత మార్కెట్లో నేడు (సెప్టెంబరు 6, 2022) లాంచ్ చేసింది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్యూవీ తర్వాత, స్పోర్టీ అవతార్లో హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ విడుదల చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఈ స్పోర్టీ ఎస్యూవీకి సంబంధించి ఇండియాలో రూ. 21వేలతో బుకింగ్లను కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఇంజీన్,ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 1.0 కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. 2వ జెన్ 7-స్పీడ్ డిసిటితో వస్తున్న ఈ ఇంజీన్ పవర్ట్రెయిన్ గరిష్టంగా 88.3 kw (120 PS), 172 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది. డ్యూయల్ కెమెరాతో ప్రత్యేకమైన డాష్క్యామ్ అందిస్తోంది. 60కి పైగా హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కారు ఫీచర్లున్నాయి. అలెక్సా , గూగుల్ వాయిస్ అసిస్టెంట్తో హోమ్ టు కార్ (H2C)ని కూడా కలిగి ఉంటుంది. అలాగే కస్టమర్లకు సాధారణ, ఎకో, స్పోర్ట్ మోడ్ల మధ్య ఎంచుకోవడానికి వీలు కల్పించే డ్రైవ్ మోడ్ ఎంపికను కూడా ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 30కి పైగా భద్రతా ఫీచర్లు , 20కిపైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 4 డిస్క్ బ్రేక్లు, ISOFIX, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, పార్కింగ్ అసిస్ట్ లాంటి హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్లోని ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూ ఎన్ ధరలు హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఎన్6, ఎన్8 అనే అనే రెండు వేరియంట్లలో లభ్యం. ఎన్ 6 వేరియంట్ ధర రూ. 12.16 లక్షలు కాగా, ఎన్8 వేరియంట్ ధర రూ. 13.15 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
హ్యుందాయ్ కొత్త వెన్యూ.. 40కి పైగా మార్పులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ వెన్యూ కొత్త వర్షన్ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్షోరూంలో 1.2 లీటర్ పెట్రోల్ ట్రిమ్ రూ.7.53 లక్షలు, 1.0 లీటర్ టర్బో పెట్రోల్తోపాటు డీజిల్ ట్రిమ్స్ రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం. నాలుగు మీటర్లలోపు కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ విభాగంలో తొలిసారిగా 11 ఫీచర్లను కొత్త వెన్యూకు జోడించారు. డిజైన్, ఇతర అంశాల్లో 40 రకాల మార్పులు చేసినట్టు కంపెనీ తెలిపింది. 60కిపైగా కనెక్టెడ్ ఫీచర్లున్నాయి. వెనుక సీట్లకు రీక్లైనింగ్ ఫంక్షన్, ఆంబియెంట్ నేచుర్ సౌండ్, 12 భాషలు, ఎయిర్ ప్యూరిఫయర్, పవర్ సీట్స్ వంటి హంగులు ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్, వెహికిల్ స్టేటస్ వంటి ఫంక్షన్స్ను ఇంటి నుంచే నియంత్రించవచ్చని హుందాయ్ వివరించింది. చదవండి: సీఎన్జీ వాహనాలకు డిమాండ్.. -
అమ్మకాల్లో ఔరా! ఈ కార్ల అమ్మకాలు అప్పుడే మూడు లక్షలు దాటాయట!
ఆటోమొబైల్ సెక్టార్లో దేశంలో రెండో అతి పెద్ద కంపెనీగా ఉన్న హ్యుందాయ్ మార్కెట్లో పాగా వేస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మోడల్స్ క్రమంగా మార్కెట్లో పాతుకుపోతున్నాయి. ఇప్పటికే క్రెటా మోడల్ అమ్మకాల్లో దుమ్ము లేపుతుండగా ఇప్పుడు దాని సరసన వెన్యూ కూడా చేరింది. హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు దేశీయంగా మూడు లక్షల మార్క్ని క్రాస్ చేశాయి. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీగా 2019లో మార్కెట్లో రిలీజ్ అయ్యింది వెన్యూ. ఏడాది గడిచేప్పటికే లక్ష కార్ల మైలు రాయిని చేరుకుంది. అయితే తర్వాత ఏడాదికే కరోనా రావడంతో అమ్మకాలు మందగించాయి. కానీ కరోనా ముగిసిన తర్వాత అమ్మకాల్లో వెన్యూ దూసుకుపోతోంది. కియా వెన్యూ ఈ, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలో లభిస్తోంది. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కావడంతో సిటీల్లో తిరగడానికి బయట ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం ఈ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహాదం చేసింది. వచ్చే నెలలో వెన్యూ అప్డేటెడ్ వెర్షన్ మార్కెట్లోకి రాబోతుంది. చదవండి: అవును నిజం.. త్వరలో ఎలక్ట్రిక్ ‘అంబాసిడర్’ కారు! -
హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. జరిగేది అప్పుడే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ 22, 23వ స్నాతకోత్సవాలు జనవరి 6న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీహెచ్డీలు, మెడల్స్, బహుమతులు అందిస్తున్నట్టు చెప్పారు. మెడల్స్, బహుమతులకు ఎంపికైన వారి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఈ నెల 8న జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. టెన్త్ విద్యార్థులకు ‘సర్టిఫికెట్’ ఇవ్వాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: పదో తరగతి పూర్తయిన తర్వాత వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని.. వారి కోసం మార్కుల మెమోతో పాటు కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు రాష్ట్ర పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంటర్లో లాంగ్వేజెస్తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు గ్రూప్లో ఉంటున్నందున.. పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు పాస్ అయిన వారికి ఇంటర్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. దీని వల్ల డ్రాపౌట్లు తగ్గే అవకాశముందన్నారు. -
Pro Kabaddi League 2021: కబడ్డీ కూతకు వేళాయె...
Pro Kabaddi 2021 Schedule And Venue: కూత పెట్టేందుకు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ముస్తాబైంది. నేటి నుంచి ఎనిమిదో సీజన్ జరగనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ మ్యాచ్లన్నీ బెంగళూరు వేదికపైనే జరుగనున్నాయి. కోవిడ్ మహమ్మారి వల్ల గతేడాది టోర్నీ రద్దు కావడంతో ఈ సీజన్ను పకడ్బందీగా బయో బబుల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 12 జట్లు ఇది వరకే బయో బబుల్లో ఉన్నాయి. మాజీ చాంపియన్లు యు ముంబా, బెంగళూరు బుల్స్ల మధ్య బుధవారం జరిగే తొలి మ్యాచ్తో పీకేఎల్–8 మొదలవుతుంది. ఈ మ్యాచ్ ముగియగానే తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. అనంతరం మూడో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్తో యూపీ యోధ తలపడుతుంది. ఈ సీజన్లో తొలి నాలుగు రోజులు మూడు మ్యాచ్ల చొప్పున నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం కూడా మూడేసి మ్యాచ్లుంటాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక టాప్–6లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత పొందుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఫైనల్తో ఎనిమిదో సీజన్ ముగుస్తుంది. తొలి రెండు మ్యాచ్లు వరుసగా రాత్రి గం. 7:30 నుంచి... గం. 8:30 నుంచి మొదలవుతాయి. మూడో మ్యాచ్లను రాత్రి గం. 9:30 నుంచి నిర్వహిస్తారు. మ్యాచ్లన్నీ స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో ప్రసారమవుతాయి. పీకేఎల్లో మ్యాచ్ గెలిచిన జట్టుకు ఐదు పాయింట్లు లభిస్తాయి. ‘టై’ అయితే రెండు జట్ల ఖాతాలో మూడు పాయింట్లు చొప్పున చేరుతాయి. ఏడు లేదా అంతకంటే తక్కువ పాయింట్ల తేడాతో ఓడిన జట్టుకు ఒక పాయింట్ ఇస్తారు. ఏడు పాయింట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిన జట్టుకు పాయింట్లేమీ రావు. పీకేఎల్ బరిలో ఉన్న జట్లు బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్, యూపీ యోధ. -
Hyderabad: 18 నుంచి 27 వరకు బుక్ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: పుస్తకం రెక్కలల్లార్చుకొని చదువరి చెంతకు తిరిగి వచ్చేస్తోంది. లక్షలాది మంది సాహితీ ప్రియుల మదిని దోచుకోనుంది. ఈ నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 34వ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈసారి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ సన్నాహాలు చేపట్టింది. ఏటా సుమారు 330 నుంచి 350 స్టాళ్లతో జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఈ ఏడాది వీటి సంఖ్యను తగ్గించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు అనుగుణంగా 250 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బహుభాషల్లో.. ► అన్ని రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ హైదరాబాద్ ఏటేటా పుస్తకానికి బ్రహ్మరథం పడుతూనే ఉంది. ► విభిన్న జీవన రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయి. కథ, కవి త్వం, నవల, చరిత్ర వంటి సాహిత్యమే కాకుండా బాలల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వెలుడిన విశ్లేషణ గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్ పాఠ్యపుస్తకాలు వంటి వాటికీ పాఠకాదరణ లభిస్తోంది. (చదవండి: కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!) ప్రదర్శన వేళలు ఇలా.. ► మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు. ► శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు. జాగ్రత్తలు పాటించాలి ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలి. కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి మాత్రమే ప్రదర్శనకు రావాలి. భౌతిక దూరం పాటించాలి. – కోయ చంద్రమోహన్, బుక్ఫెయిర్ కమిటీ -
డెల్టా దాడి.. ఈసారి టీ 20 ప్రపంచ కప్ విదేశాల్లో..?
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనవిధానాల్లో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి. ఈ వైరస్ కారణంగా అవే మార్పులు క్రికెట్ వేదికలపై కూడా పడతోంది. ముందస్తు నిర్ణయాల ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్లో జరగాల్సి ఉంది. కానీ భారత్లో కోవిడ్ డెల్టా వేరియంట్ విజృంభణ కారణంగా ప్రపంచకప్ ఇక్కడ జరిగే అవకాశం దాదాపు లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీని సజావుగా నిర్వహించడం కోసం ఐసీసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గడువు కూడా కోరింది. కానీ ప్రస్తుత వైరస్ వ్యాప్తి, ఆటగాళ్ల రక్షణ దృష్ట్యా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ను యూఏఈలో జరిపేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి సమాచారం కూడా ఇచ్చిందని తెలుస్తోంది. ఈ అంశంపై బీసీసీఐ కార్యదర్శి జే షా మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా కారణంగా భారత్లో పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ఇక టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ఆరోగ్యం, రక్షణే ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ను భారత్ లేదా యూఏఈలో నిర్వహించాలా అనే విషయంపై త్వరలోనే బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ప్రపంచకప్ టోర్నీని నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు, ఫైనల్ మ్యాచ్ను నవంబర్ 14వ తేదీన నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. Due to the COVID situation in the country, we may shift the T20 World Cup scheduled in India to UAE. We are monitoring the situation closely. Health and safety of players are paramount for us. We will take the final call soon: BCCI Secretary, Jay Shah to ANI (File pic) pic.twitter.com/Sqz77E5BkC — ANI (@ANI) June 26, 2021 చదవండి: ధోని మెసేజ్పై అభిమానుల ఆగ్రహం.. ట్వీట్ వైరల్ -
వైరల్ : మోడ్రన్ పెళ్లికూతురు
భోపాల్ : ఉత్తరాది పెళ్లి వేడకల్లో సాధారణంగా పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకుంటాడు. అది అక్కడి సాంప్రదాయం కూడానూ. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం ఇందుకు భిన్నంగా పెళ్లి కుమార్తె స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ మండపానికి వచ్చింది. అది కూడా పెళ్లిదుస్తుల్లో కాకుండా మోడ్రన్ దుస్తుల్లో వచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే యువతి వలేచా ఫ్యామిలీలోనే ఏకైక కూతురు. దీంతో చిన్పప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ఆమె తల్లిదండ్రులు గుర్రంపై స్వారీ చేయాలన్న తమ కూతురి కోరికను కూడా సంతోషంగా నెరవేర్చారు. (ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. వరుడి రియాక్షన్: వైరల్) అంతేకాకుండా సమాజంలో ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, అబ్బాయిలకు సరిసమానంగా అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కూతురిపై అపారమైన ప్రేమతో పాటు ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన వలేచా పేరెంట్స్ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక పెళ్లిరోజు గుర్రపు స్వారీ చేసుకుంటూ రావాలన్న తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని వధువు దీపా వలేచా పేర్కొంది. కుటుంబసభ్యుల వల్లే తన కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. (మాధురీ దీక్షిత్ను ఫిదా చేసిన యువతి ) -
హ్యుందాయ్ ‘వెన్యూ’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ‘వెన్యూ’ ఎస్యూవీ వాహనాన్ని బుధవారం ఆవిష్కరించింది. వచ్చే నెల 21న దీన్ని మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మోడల్ 1 లీటరు టర్బో, 1 లీటర్ పెట్రోల్ పవర్ట్రెయిన్తో పాటు 1.4 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభ్యంకానుంది. ధర, ఇతర విషయాల పరంగా క్రెటాకు సరిసమానంగా ఉండనుందని కంపెనీ తెలిపింది. -
'అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చోద్దు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రైవేటు స్థలాల్లో నిర్వహిస్తామని చెప్పడం ద్వారా అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సమావేశాలను హాయ్ల్యాండ్లో, ప్రైవేటు యూనివర్సిటీల్లో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం దారుణమన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని కోరిన ఆయన ప్రైవేటు స్థలాల్లో అసెంబ్లీ నిర్వహిస్తే భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్, సచివాలయాన్ని ఆధునీకరించి చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆరోగ్యమిత్ర కార్యకర్తలను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాట్లాడుతూ.. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. -
నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష
-
ఐపీఎల్-7 వేదికలపై వీడని అనిశ్చితి
ముంబై: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2014 పోటీల వేదికలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఐపీఎల్ ఏడో అంచెను పూర్తిగా భారత్లోనే నిర్వహిస్తారా లేక వేదికల్ని దక్షిణాఫ్రికాకు తరలిస్తారా అన్న విషయంపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత ఐపీఎల్ వేదికపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ చెప్పారు. శుక్రవారం జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో లీగ్ వేదికలు, నిర్వహణ గురించి చర్చించారు. ఐపీఎల్ పోటీలు ఏప్రిల్ 9-జూన్ 3 మధ్య జరగనున్నాయి. అదే సమయంలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్కు భద్రత కల్పించడం సాధ్యంకాదని కేంద్ర హోం మంత్రత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. 2009లోనూ లీగ్కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగిన దృష్ట్యా ఐపీఎల్ వేదికను దక్షిణాప్రికాకు తరలించారు. తాజా పోటీలను కూడా దక్షిణాప్రికాలో నిర్వహించి ప్లే ఆఫ్ మ్యాచ్లను భారత్లో జరపాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో కొన్ని కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఐపీఎల్కు అనుమతిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు బోర్డు వర్గాల సమాచారం. లీగ్ను విదేశాల్లో నిర్వహించడం వల్ల ఆదాయానికి భారీగా గండి పడే అవకాశముంది.