breaking news
Supreme Leader of Iran
-
ఇరాన్ సుప్రీం నేత ఖరారు?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఆయన వారసుని ఎంపిక పూర్తయినట్లు వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పేరును ఇప్పుడే బహిర్గతం చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త సుప్రీం నేతకు కూడా ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ‘కొత్త నేతను ఎన్నుకున్నాం’ అని కమిటీ సభ్యుడు అయతొల్లా మొహమ్మద్ మెహ్దీ మిర్బాఖేరీ చెప్పారు. ‘‘అయితే ఇంకొన్ని అవరోధాలున్నాయి. వాటిని పరిష్కరించాకే ఆయన పేరు వెల్లడిస్తాం’’ అన్నారు.సుప్రీంనేత ఎంపిక కోసం జరిపే సమావేశంపై సభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దాడుల వేళ భద్రతా కారణాల రీత్యా సమావేశం అక్కర్లేదని, ఎవరికి మద్దతు పలికేదీ సూచిస్తే చాలని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డట్టు అయతొల్లా మొహ్సీన్ హైదరీ అలేకాసిర్ చెప్పారు. మరికొందరేమో ఏదేమైనా కమిటీ భేటీ కావాల్సిందేనని పట్టుబట్టారు. ‘‘సుప్రీంనేత ఎంపిక పూర్తయింది. పేరును అసెంబ్లీ సెక్రటరీ అయతొల్లా హషీం హొస్సేనీ బుషేరీ వెల్లడిస్తారు’’ అని మరో సభ్యుడు అహ్మద్ అలామొల్హొదా చెప్పారు. దివంగత ఖమేనీ కుమారుడు 56 ఏళ్ల ముజ్తాబా ఖమేనీనే సుప్రీం నేతగా ఎన్నుకుని ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముజ్తాబా గాయపడ్డారా? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోవడం తెల్సిందే. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంత∙సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
ఇరాన్ కొత్త నాయకుడి ప్రకటనపై అందుకే జాప్యం..
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని.. కొత్త నాయకుడిని ఎన్నుకున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాయకుడిని అసెంబ్లీ సెక్రటేరియట్ అధిపతి ప్రకటించనున్నారు. అధికారికంగా పేరుబయట పెట్టకపోయినప్పటికీ ఖమేనీ కుమారుడు మజ్తబానే కొత్తనాయకుడంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది.వారసత్వ నాయకత్వంపై అసెంబ్లీలో కొంతమంది సభ్యుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే కొత్త నాయకుడి ప్రకటన జాప్యం అవుతుందని సమాచారం. కొత్త నాయకుడిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నందున.. కొత్త నాయకుడి పేరు ప్రకటించే లోపు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరు? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. -
ఖమేనీ బంకర్ ధ్వంసం చేశాం ఇక మిగిలింది..!
-
ఖమేనీ కుమారులు క్షేమం?.. తాజా ఫొటోలు వైరల్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఖమేనీ కుమారులలో ఒకరు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలలో ఖమేనీ నలుగురు కుమారులు క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.అయతొల్లా అలీ ఖమేనీకి నలుగురు కుమారులు.. ముస్తాఫా ఖమేనీ, మొజ్తబా ఖమేనీ, మసూద్ ఖమేనీ, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో వారు క్షేమంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టే వారసుడి కోసం అన్వేషణ ప్రారంభమైన తరుణంలో, ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా పేరొందిన ఖమేనీ తన వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచేవారు. ఆయన భార్య గానీ, పిల్లలు గానీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు.ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే 1947లో ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం లాంటి క్లిష్ట సమయాల్లోనూ ఆమె ఖమేనీకి అండగా నిలిచారు. ఖమేనీ పిల్లలు అటు రాజకీయాలకు, ఇటు ప్రజా బాహుళ్యానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. కాగా ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందనే దానిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఖమేనీ వారసులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, వారి భద్రతను ఇరాన్ సైన్యం కట్టుదిట్టం చేసింది. ఇది కూడా చదవండి: సౌదీ రక్షణ మంత్రితో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక భేటీ -
అంతరిక్షపుటంచు నుంచి...
నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్రమత్తంగా ఉండే ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యం అత్యంత కచి్చతత్వంతో కూడిన దాడికి పాల్పడి హత్య చేసింది. 37 ఏళ్లపాటు ఇరాన్ను ఒంటిచేత్తో ఏలిన ఖమేనీ కథ చివరకు విషాదంగా ముగిసింది. గత 28న రాజధాని టెహ్రాన్లో నడి»ొడ్డున అత్యున్నత స్థాయి సమావేశంలో ఉండగా జరిగిన దాడిలో మరణించారు. అసలీ దాడి ఎలా జరిగింది, ఖమేనీ అంతం చూసేందుకు ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధం ఏమిటనేవి చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి లక్ష్యం సాధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మిసైల్ను ‘రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్’ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అత్యంత ప్రాణాంతక ఆయుధమని చెప్పుకోవచ్చు. ఒక్కసారి లక్ష్యం వైపు దూసుకెళ్లిందంటే దాన్ని మధ్యలో అడ్డుకోవడమే అసాధ్యమే. గురి తప్పే ప్రసక్తే లేదు. శత్రువు నేల కూలాల్సిందే! అసలేమిటి నీలి పిచ్చుక? మూడు బాలిస్టిక్ టార్గెట్ క్షిపుణుల కుటుంబంలో బ్లూ స్పారో కూడా ఒకటి. ఇందులో బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో కూడా ఉన్నాయి. మరో ఖండంలో సుదూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి బాలిస్టిక్ క్షిపణులను ఫైటర్ జెట్ లేదా రాకెట్కు అమర్చి ప్రయోగిస్తారు. గాల్లోకి లేచిన క్షిపణి తర్వాత ఫైటర్ జెట్ నుంచి విడిపోయి భూ వాతావరణపు అంచుల దాకా వెళ్తుంది. తర్వాత గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి పేలిపోతుంది. ఇది ఒక బంతిని గాల్లోకి విసరడం లాంటిదే. పైకి వెళ్లిన బంతి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మళ్లీ భూమిని తాకుతుంది. అందుకే దీన్ని ‘అంతరిక్ష క్షిపణి’గా కూడా పిలుస్తుంటారు. నిజానికి బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో క్షిపణులను ఇజ్రాయెల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్లో భాగంగా ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేశారు. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను ముందే గుర్తించి, నేలమట్టం చేయడం ఈ డిఫెన్స్ సిస్టమ్ విధి. ఇక్కడ శత్రుదేశాల క్షిపణుల స్థానంలో స్పారో మిస్సైళ్లను డమ్మీగా ఉపయోగించి, ప్రాక్టీస్ చేస్తుంటారు. యుద్ధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు. బరువు 1,900 కిలోలు. సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ప్రొపెల్లెంట్ రాకెట్ ఉంటుంది. జీపీఎస్తోపాటు ఐఎన్ఎస్ నావిగేషన్ సిస్టమ్తో ముందుకెళ్తుంది. బయటి నుంచి అందే సిగ్నల్తో పనిలేకుండా తన కదలికలు నిర్దేశించుకోగలదు. బ్లూ స్పారో మిస్సైల్ లండన్ బస్సు పరిమాణంలో ఉంటుంది. బ్లూ స్పారో స్ఫూర్తితో ‘రాక్స్’ ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులకు దీటుగా బ్లూ స్పారోను డిజైన్ చేశారు. భూవాతావరణాన్ని దాటి ముందుకెళ్లి, మళ్లీ భూవాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని తాకడం ఈ నీలి పిచ్చుక ప్రత్యేకత. ఫైటర్ జెట్కు అమర్చిన బ్లూ స్పారో ఆకాశంలో భూవాతావరణం పరిధి వరకూ వెళ్లి విడిపోతుంది. అలాగే పైకి దూసుకెళ్లి భూవాతావరణం అంచును దాటేస్తుంది. పేలుడు పదార్థాలు కూర్చిన క్షిపణి ముందుభాగం వెనుక భాగం నుంచి విడిపోయి భూమి దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. అలా కిందికి వచ్చే భాగాన్ని రీ–ఎంట్రీ వెహికల్ అంటారు. ఇందులో వార్హెడ్తోపాటు చిన్నపాటి థ్రస్టర్లు ఉంటాయి. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని రీతిలో నిట్టనిలువుగా కిందికి వచ్చి అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్లో ఖమేనీ నివాసాన్ని బ్లూ స్పారో ఇదే తరహాలో ధ్వంసం చేసింది. ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేసిన ఒక మిస్సైల్ ఇరాన్ సుప్రీంలీడర్ను బలి తీసుకుంది. రఫేల్ సంస్థ బ్లూ స్పారో డెవలప్మెంట్తోనే ఆగిపోలేదు. సరిగ్గా ఇదే టెక్నాలజీతో ‘రాక్స్’ను అభివృద్ధి చేసింది. ప్రతికూల వాతావరణంలో సైతం అసాధారణమైన కచి్చతత్వంతో లక్ష్యాలను ఛేదించడం రాక్స్ క్షిపణుల ప్రత్యేకత. శత్రుదేశాలు జీపీఎస్ సిగ్నల్స్ను జామ్ చేసినా సరే ఈ క్షిపణులు సరిగ్గా పనిచేస్తాయి. భూఉపరితలంతోపాటు అంతర్భాగంలోని లక్ష్యాన్ని తాకుతాయి. 500 కిలోల వార్హెడ్ను మోసుకెళ్లగలదు. బ్లూ స్పారో ఒక స్కెచ్(చిత్తుప్రతి) అనుకుంటే రాక్స్ అనేది పూర్తిగా సిద్ధమైన ఆయుధం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్లూ స్పేరోతో ఖమేనీపై దాడి ఇజ్రాయెల్ కీలక ప్రకటన..
-
కొత్త సుప్రీం లీడర్ ను ఖతం చేస్తాం- ఇజ్రాయెల్ వార్నింగ్
-
ఇరాన్ నూతన సారథి మొజ్తబా!
దుబాయ్: ఇరాన్ నూతన సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీ నియుక్తులైనట్టు తెలుస్తోంది. 88 మంది మతపెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్) మంగళవారం ఆయనను ఎన్నుకున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ బుధవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే. 56 ఏళ్ల మొజ్తబా ఆయన రెండో కుమారుడు. ఆయనకు పాలనానుభవమేదీ లేదు. ఇప్పటిదాకా తెర వెనకే తండ్రి తరఫున వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. వారసత్వ రాజకీయాలకు ప్రస్తుత ఇరాన్ పాలక వర్గం పూర్తిగా వ్యతిరేకమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో మొజ్తబా ఎన్నికపై కమిటీలో పలువురు అభ్యంతరం వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్లో సర్వశక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్ర ఒత్తిడితో చివరికి ఆయన నియామకానికి పచ్చజెండా ఊపినట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఐఆర్జీసీపై మొజ్తబాకు పూర్తిస్థాయిలో పట్టుంది. దాని వ్యవహారాలను చాలా ఏళ్లుగా పూర్తిగా ఆయనే చూసుకుంటున్నట్టు చెబుతారు. వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ రాచరికాన్ని కూలదోసిన 1979 నాటి ఇస్లామిక విప్లవంలో ఖమేనీ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వారసత్వంగా పాలన పగ్గాలు చేపట్టడాన్ని ఇరాన్ ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారన్నది చూడాలి. ఇరాన్లో అధ్యక్షునిగా ఎవరున్నా సర్వం సహా అధికారాలు మాత్రం సుప్రీం నేత చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైన్యంతో పాటు అత్యంత శక్తిమంతమైన ఐఆర్జీసీ కూడా పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తుంది. శనివారం నాటి దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు మొజ్తబా భార్య జహ్రా హదద్ ఆదెల్, ఆయన చిన్న కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మొజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కని్పంచలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలో ఉంటూ ఇరాన్ ప్రతి దాడులను పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. తెర వెనక ‘సుప్రీం’మొజ్తబా. అయతొల్లా ఖమేనీ రెండో కుమారునిగానే తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని పేరు. అయితే తెర వెనక మాత్రం దశాబ్దాలుగా ఆయన పూర్తిస్థాయి అధికారాలు చలాయిస్తూ వస్తున్నట్టు చెబుతారు. ఒకరకంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవహారాలన్నింటినీ శాసించారంటారు. ఆ క్రమంలో ఖమేనీ వారసునిగా చాలా ఏళ్లుగా మొజ్తబా పేరే వినిపిస్తోంది. ఆయన్ను సుప్రీం నేతగా నియమిస్తున్నట్టు ఏడాది క్రితమే వార్తలొచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇరాన్ రాజకీయ వ్యవహారాల్లో మొజ్తబా ‘అదృశ్య శక్తి’గానే ఉంటూ వస్తున్నారు. ఆయన 1969లో మషాద్ నగరంలో జని్మంచారు. నాటి పాలకుడు మహమ్మద్ రెజా పహ్లావీ పాలనపై తన తండ్రి ఖమేనీ తిరుగుబాటును చూస్తూ పెరిగారు. కోమ్ నగరంలో షియా మత విద్య అభ్యసించినా క్లెరికల్ హోదాతో సరిపెట్టుకున్నారు. కీలకమైన ఆయతుల్లా హోదాకు చేరలేకపోయారు. పహ్లవీ పాలన అంతమయ్యాక తన తండ్రి ఖమేనీ ఇరాన్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే మొజ్తబా సైన్యంలో చేరారు. ఇరాక్పై పోరులో ఐఆర్జీసీ విభాగమైన హబీబ్ ఇబ్న్ మజాహిర్ బెటాలియన్కు సారథ్యం వహించారు. అక్కణ్నుంచీ ఐఆర్జీసీతో ఆయన బంధం బలంగా పెనవేసుకుంటూ వచ్చింది. 1989లో ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాక మొజ్తబా ప్రాధాన్యం విస్తరిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇరాన్ వ్యాపార వ్యవహారాలను పూర్తిగా ఆయనే నియంత్రిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఇంటా బయటా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆస్తులు కూడబెట్టారంటారు. 2000 నాటి వికీలీక్స్ కూడా మొజ్తబానే ఇరాన్లో నిజమైన అధికార శక్తిగా పేర్కొంది. 2019లో ట్రంప్ తొలి హయాంలో మొజ్తబాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. 2005లో తనకు అనుకూలుడైన మతవాది అహ్మదీ నెజాద్ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేలా మొజ్తబా పావులు కదిపినట్టు చెబుతారు.సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా అంతం చేసేస్తాం: ఇజ్రాయెల్ జెరూసలేం: ఇరాన్ సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా తక్షణమే అంతం చేసేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు సైన్యానికి ఇప్పటికే పూర్తిస్థాయి ఆదేశాలిచ్చినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం తెలిపారు. తమ అంతమే లక్ష్యంగా పని చేసే అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే ఉండబోదని పేర్కొన్నారు. -
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. కుటుంబ సభ్యులతోపాటు ఆర్మీ చీఫ్ ముసావీ కూడా మృతి... క్షిపణి దాడుల్లో హత్య చేసిన ఇజ్రాయెల్
-
ఓ శకం ముగిసింది
సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్లో ఓ శకం ముగిసింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ను మతరాజ్యంగా రూపాంతరం చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధించారు. ఇరాన్ పరిపాలన, సాయుధ వ్యవస్థలకు మూడున్నర దశాబ్దాలకుపైగా ఖమేనీ మాటే శాసనం. పశ్చిమాసియాలో మత కేంద్రంగా ఇరాన్ను సమున్నత స్థాయికి చేర్చాలనే పట్టుదలతో సంస్కరణవాదులను అణచివేస్తూ దేశాన్ని ఏకఛత్రంగా ఏలుతూ అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆయన కొరకరాని కొయ్యలా మారారు. దశాబ్దాలుగా ఇరాన్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అహరి్నశలు శ్రమిస్తున్న అమెరికాను ఎన్నోసార్లు దీటుగా ఎదుర్కొన్నారు. ఇస్లామిక్ విప్లవంలో చురుకైన విప్లవకారుడి నుంచి తిరుగులేని పాలకుని దాకా సాగిన ప్రస్థానం ఖమేనీది... పహ్లావీ శకం ముగిశాక... ఖమేనీ నగరం నుంచి వచ్చి మష్హాద్ సిటీలో స్థిరపడిన అజర్బైజాన్ టర్క్ వర్గానికి చెందిన దంపతులకు 1939 ఏప్రిల్ 19వ తేదీన ఖమేనీ జని్మంచారు. ఎనిమిది మంది సంతానంలో రెండోవాడు. నాలుగో షియా ఇమామ్ అలీ అల్ సజ్జాద్కు ఖమేనీలు వారసులు. పాఠశాల విద్యకాలంలోనే ఆయన ఖురాన్ను లోతుగా చదివారు. యుక్తవయసులోనే పర్షియన్లో కవితలు రాసేవారు. కచి్చతమైన సమయానికి ప్రార్థనలు చేయాల్సిందేననే పట్టుదలతో ఓసారి వెళ్తున్న రైలు నుంచి దూకేసి మరీ మసీదుకు పరుగెత్తారట! మొహమ్మద్ రెజా పహ్లావీ రాజరిక పాలనలో విప్లవకారునిగా మారారు. ఆరుసార్లు అరెస్టయ్యారు. మూడేళ్లు దేశ బహిష్కరణను ఎదుర్కొన్నారు. నాటి ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్ సంజామీకి కుడిభుజంగా మారారు. 1980లో టెహ్రాన్ శుక్రవారంప్రార్థనల ఇమామ్గా ఎంపికయ్యారు. 1981లో ఖమేనీని టేక్ రికార్డర్ బాంబుతో చంపేందుకు ముజాహిదీన్–ఇ–ఖల్ప్ వర్గం విఫలయత్నం చేసింది. ఆ పేలుడులో కుడి భుజం దెబ్బ తిని కుడిచేయి చచ్చుబడిపోయింది. స్వరపేటిక తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1981లో ఎన్నికల్లోఘనవిజయంతో ఖమేనీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఉక్కుపాదంతో అణచివేసి కీలక నేతగా ఎదిగారు. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన అయతొల్లా రుహొల్లాæ ఖొమేనీకి కుడిభుజంగా మారారు. ఆయన 1989లో చనిపోయాక ఖమేనీ ‘గ్రాండ్ అయతొల్లా’ హోదా పొందారు. 1989 జూన్ 4న ఇరాన్ సుప్రీం లీడర్గా అవతరించారు. ఇరాక్తో యుద్ధం తర్వాత ప్రభుత్వంపై పట్టుసాధించారు. 36 ఏళ్లుగా ఇరాన్లో ఆయనే మాటే శాసనంగా సాగుతోంది. ఇరాన్ సాయుధ బలగాలకు కూడా ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. గార్డియన్ కౌన్సిల్ను ఏర్పాటు చేసి, అది సూచించేవారే పార్లమెంట్ అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనలు తెచ్చారు. షిమా మతబోధకులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారు. చీఫ్ జస్టిస్ సహా దేశంలోన్ని అన్ని వ్యవస్థలపైనా పట్టు నిలుపుకున్నారు. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే రెవల్యూషనరీ గార్డ్ విభాగం సైతం ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. రెవల్యూషనరీ గార్డ్ విభాగానికి సొంతంగా వ్యాపారం చేసుకునే అధికారం సైతం కట్టబెట్టారు. అలా అది అత్యంత శక్తివంతమైన సాయుధ వ్యవçస్థగా ఎదిగింది. పరోక్ష దళాల సృష్టికర్త పశ్చిమాసియాలో ఇస్లాం మత ప్రభావాన్ని పెంచేందుకు పొరుగు దేశాల్లో పరోక్ష దళాలను ఖమేనీ ఏర్పాటు చేశారు. లెబనాన్లో హెజ్»ొల్లా ఉగ్రసంస్థ ఆవిర్భావానికి కృషి చేశారు. 2000లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుతిరిగేలా చేశారు. 2006లో జరిగిన యుద్ధంలోనూ పాక్షిక విజయం సాధించారు. యెమెన్లో హూతీ రెబల్స్కు సాయపడ్డారు. పాలస్తీనాలో హమాస్కు ఖమేనీ అండదండలు దండిగా ఉండేవి.తిరుగుబాట్లతో తలనొప్పులు దమనకాండకు వ్యతిరేకంగా 2022లో ఇరాన్లో తలెత్తిన దేశవ్యాప్తంగా ఉద్యమం ఖమేనీ పాలనకు పెను సవాల్ విసిరింది. దాన్ని ఉక్కుపాదంతో అణచి మానహక్కులను కాలరాశారన్న అపవాదును ఖమేనీ మూటగట్టుకున్నారు. తాజాగా 2025 డిసెంబర్లో ఖమేనీని వ్యతిరేకంగా ఇరాన్లో వెల్లువెత్తిన ఆందోళనలు కూడా ప్రపంచమంతటా చర్చనీయంగా మారాయి. అణ్వ్రస్తాలను సామూహిక మానవహననాలుగా ఛీత్కరించే ఖమేనీ, లోలోపల మాత్రం అణుబాంబుపై మక్కువ పెంచుకున్నారని అమెరికా దశాబ్దాలుగా ఆరోపిస్తోంది. రహస్య ప్రాజెక్టుతో యురేనియం నిల్వలను పెంచుకుంటున్నారనే ఆగ్రహంతో ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్లు కత్తులు నూరాయి. చివరికి అదే ఖమేనీ అంతానికి దారితీసింది. ఖమేనీకి అన్ని రకాలా సాయపడే సైనిక జనరల్స్, ముఖ్య నేతలను అంతమొందిస్తూ అమెరికా చివరకు ఆయనను ఏకాకిని చేసింది. గత జూన్లో ఇజ్రాయెల్ ‘12 రోజుల యుద్ధం’ సందర్భంగా ఇరాన్ అణు స్థావరాలను అమెరికా బాంబు దాడులతో తుత్తునియలు చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల నడుమ పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నా ఇప్పటిదాకా పెద్దగా ఫలితం ఆలోపే ఇజ్రాయెల్, అమెరికా మెరుపు దాడులతో శనివారం ఖేమేనీతో పాటు పలువురు సైనిక, పౌర అగ్ర నేతలను అంతం చేశాయి.ఖమేనీ మూలాలు భారత్లో! ఖమేనీ మూలాలు భారత్లోనే ఉన్నట్టు ఇరాన్ చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. షియా వర్గానికి చెందిన ఖమేనీ వంశస్తుడు సయ్యద్ అహ్మద్ మూసావీ 18వ శతాబ్ధాంలో ఇరాన్ నుంచి భారత్ వలస వచ్చారు. యూపీలో షియా జనాభా అత్యధికంగా ఉండే బారాబంకీ జిల్లాలోని కింటూర్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. అక్కడ షియా మత బోధకుడిగా పేరుపొందాడు. తన పేరు చివర హిందీ అని కూడా తగిలించుకున్నారు. నేటికి ఇరాన్ చరిత్రకారుల గ్రంథాలు ఆయన పేరును సయ్యద్ అహ్మద్ మూసావీ హిందీ అనే పేర్కొంటారు. 1830లో ఆయన ఇరాన్లోని నజబ్ నగరానికి వెళ్లిపోయారు. తరవాత ఖమేనీ పట్టణంలో స్థిరపడ్డారు. ఖమేనీ తాతముత్తాతల బంధువుల ప్రభావంతోనే దక్షిణ భారతంలో, ముఖ్యంగా హైదరాబాద్, దక్కన్లో ఇరాన్ సంస్కృతి, సంప్రదాయాలు వర్ధిల్లినట్టు చెబుతారు. నాటి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇరానీ కుటుంబాలు నేటికీ వందలాదిగా ఉన్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖమేనీ అంతానికి... ఎందుకంత పంతం?
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీతో అమెరికా వైరం దశాబ్దాల నాటిది. దీని మూలాలు ఇరాన్లో అపార చమురు నిక్షేపాల్లో దాగున్నాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాదేగ్ను బ్రిటన్, అమెరికాలు ‘ఆపరేషన్ బూట్’ పేరుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో గద్దె దించాయి. అంతకుముందు వరకు దశాబ్దాలు పరిపాలించిన రాజు మొహమ్మద్ రెజా పహ్లావీని మళ్లీ గద్దెనెక్కించాయి. కానీ అనూహ్యంగా కొంతకాలానికే రుహొల్లా ముసావీ ఖొమేనీ సారథ్యంలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. అనంతరం ఆయన మరణంతో అధికార పగ్గాలు ఖమేనీ చేతికొచ్చాయి. నాటినుంచీ అమెరికాకు ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారు.పశ్చిమాసియాపై పెత్తనం చేయడానికి అమెరికా చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఖమేనీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాను అమెరికాకు వ్యతిరేక శక్తిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. అమెరికా కుయుక్తులను తన రాజకీయ చాణిక్యంతో తుత్తునియలు చేశారు. ఇరాన్కు తోడుగా పాలస్తీనా భూభాగంలో హమాస్ను, యెమెన్లో హూతీలను, లెబనాన్లో హెజ్»ొల్లా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ తన ఆధిపత్యాన్ని బలపర్చుకున్నారు. దాంతో ఖమేనీ ఆధిపత్యానికి గండికొట్టేందుకు అమెరికా శతథా ప్రయతి్నంచింది. ఇరాన్లో నిఘాను పెంచి సైబర్ దాడులు చేయించి, సున్నీలను రెచ్చగొట్టి తిరుగుబాటు లేవదీసి... ఇలా పలు రకాలుగా ప్రయతి్నంచి విఫలమైంది. ఖమేనీ పాలనకు చరమగీతం పాడేందుకు అమెరికా ఎన్నోసార్లు కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేసింది. వాటికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రతిసారీ తనకేం సంబంధం లేదని బుకాయించింది. ఇస్లామిక్ విప్లవం వేళ 1979లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై విప్లవకారులు దాడిచేసి పలువురు దౌత్యవేత్తలు, సిబ్బందిని బంధించారు. వాళ్లను విడిపించేందుకు అమెరికా విశ్వప్రయత్నంచేసింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్లో ఏర్పడిన మత రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా స్థానిక తిరుగుబాటుదారులకు సాయపడింది. ముజాహిదీన్–ఇ–ఖల్ఫ్ (ఎంఈకే)కు ఆర్థికసాయం చేసింది. సున్నీ ఉగ్రవాద సంస్థ జూన్దుల్హాకు అండదండలు అందించింది. ఇరాన్ ప్రభుత్వ నేతలు, కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పింది. మతపాలకుల పరువు పోగొట్టేందుకు పుకార్లను షికార్లు చేయించేది. అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించేది. ఇరాన్లో సైబర్, నిఘా ఆపరేషన్లనూ విస్తృతపరిచింది. అణు పరిశోధనలు కొనసాగకుండా తరచూ ఆటంకపరిచేది. ఈ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సైతం తనవంతు సాయం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిప్పుల వర్షం.. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్
టెహ్రాన్/దుబాయ్/జెరూసలేం: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకుతోడు తమ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య పట్ల ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్తోపాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం కురిపిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్తో పాటు పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. డ్రోన్ దాడిలో హోటల్లో స్వల్పంగా మంటలు చెలరేగాయని, వెంటనే ఆర్పేశామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. జెబెల్ అలీ ఓడరేవులోని ఓ బెర్త్లో మంటలు వ్యాపించినట్లు తెలిపింది. ఇరాన్ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడినట్లు వెల్లడించింది. వారికి తక్షణమే వైద్య చికిత్స అందించామని పేర్కొంది. యూఏఈలో శనివారం రాత్రంతా సైరన్ల మోత వినిపించింది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో జనం రాత్రి మేల్కొనే ఉన్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. అయితే, ఈ దాడిని అబుదాబీ ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు. దోహాలో డజనుకు పైగా పేలుళ్లు సంభవించాయి. అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే నౌకపైనా ఇరాన్ దాడి చేసింది. శనివారం బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో మృతుల సంఖ 185కు పెరిగినట్టు ఇరాన్ తెలిపింది.ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ధ్వంసం మరోవైపు యూఏఈ సైన్యం ఎదురు దాడికి దిగుతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను నేలమట్టం చేస్తోంది. 165 బాలిస్టిక్ క్షిపణులు, 541 డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ ప్రకటించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తున్నట్లు వెల్లడించింది. దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయం కూడా బాంబు దాడుల్లో దెబ్బ తిన్నాయి. అబుదాబీలో పాఠశాలలను మంగళవారం దాకా మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా అంతటా విమానాల రాకపోకలకు తీవర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ఎయిర్పోర్టుల్లో జనం పడిగాపులు కాస్తున్నారు. ఇరాన్ దాడుల్లో ఇప్పటిదాకా ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని, 58 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. కువైట్పై ఇరాన్ ఇప్పటివరకు 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించింది. ముగ్గురు కువైట్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్కు చెందిన 49 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా నిరీ్వర్యం చేసినట్లు బహ్రెయిన్, ఖతార్ సైతం తెలియజేశాయి. ప్రార్థనా మందిరంపై ఇరాన్ దాడి ఇజ్రాయెల్పై ఇరాన్ వైమానిక దాడులు ఆదివారం సైతం కొనసాగాయి. ముఖ్యంగా సెంట్రల్ ఇజ్రాయెల్, అక్కడి రక్షణ రంగ సంస్థలు తదితరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. డజన్ల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్లో బెయిత్ షెమేశ్లోని ఓ ప్రార్థనా మందిరంపై ఇరాన్ సైన్యం క్షిపణిని ప్రయోగించడంతో కనీసం ఎనిమిది మరణించారు. నాలుగేళ్ల బాలుడు సహా 28 మందికి పైగా గాయపడ్డారు. జెరూసలేంకు 35 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. దీంతో ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో మరణాల సంఖ్య 10కి చేరుకుంది. క్షతగాత్రుల సంఖ్య 120కి చేరింది. అలాగే ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో పదుల సంఖ్యలో నివాస గృహాలు దెబ్బతిన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ఆగడం లేదు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్ తదితర దేశాల్లోని 27 సైనిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైన్యానికి ప్రాణనష్టం వాటిల్లుతోంది. ముగ్గురు జవాన్లు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అమెరికా మిలటరీ ప్రకటించింది. మరోవైపు కల్లోలిత పశ్చిమాసియాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించడానికి ఇతర దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతీకారం తప్పదు: ఇరాన్ ఖమేనీని పొట్టనపెట్టుకున్న శత్రువులను ప్రాణాలతో విడిచిపెట్టబోమని ఇరాన్ తేలి్చచెప్పింది. శత్రువులు రెడ్ లైన్ దాటేశారని, అందుకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ పార్లమెంటరీ అధికార ప్రతినిధి మొహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ ఆదివారం స్పష్టంచేశారు. ఈసారి కోలుకోలేని విధంగా గట్టిగా దెబ్బకొడతామని, ఖమేనీ మృతికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్లను హెచ్చరించారు. 9 యుద్ధ నౌకల్నిముంచేశాం:ట్రంప్ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ చేసిన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. తమపై ఎదురుదాడి ఆలోచన వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ప్రతిదాడులకు దిగితే గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో బుద్ధి చెప్తామన్నారు. అమెరికా వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆదివారం 9 ఇరాన్ యుద్ధ నౌకల్ని ముంచేసినట్టు అ«ధ్యక్షుడు వెల్లడించారు. నేవీ ప్రధాన కార్యాలయాన్నీ తీవ్రంగా దెబ్బ తీశామని చెప్పారు.టెహ్రాన్లో పేలుళ్ల మోత అమెరికా–ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్పై దాడులు ఉధృతం చేశాయి. ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. రాజధాని టెహ్రాన్లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నగరంలో ఎక్కడ చూసినా బాంబుల మోతలే విని్పంచాయి. పేలుళ్ల నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగలు సుదూరాల దాకా వ్యాపిస్తున్నాయి. ఇరాన్ గుండెకాయపై దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్పై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ తేలి్చచెప్పారు. ఇరాన్లోని పలు ఇతర నగరాలపై కూడా దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. పలు నగరాల్లో భవన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. -
ఇరాన్: ఖమేనీ మృతి.. మద్దతుదారుల కన్నీరుమున్నీరు (ఫొటోలు)
-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కొడుకు
-
ఖమేనీ మరణంపై ఇరాన్ కేబినెట్ కీలక ప్రకటన
-
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఖతం: ట్రంప్
-
మదురోగా ఖమేనీ?.. ఏ క్షణమైనా..
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్లో నాయకత్వ మార్పుదిశగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఖమేనీ పరిస్థితిపై స్పష్టత లేదు. ఆయన రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ రైట్ హ్యాండ్ జనరల్ అలీ ఖంబాని హతం కాగా, ఇరాన్కు చెందిన పలువురు సినియర్ కమాండర్లు మృతిచెందినట్లు సమాచారం.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు, దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతొల్లా ఆలీ ఖమేని చనిపోయాడంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తుండగా.. తమ సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని ఇరాన్ ఆర్థిక మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు ఇజ్రాయెల్తో కలిసి అమెరికా జల్లెడ పడుతోంది. 1979లో రిపబ్లిక్గా మారినప్పటి నుంచి ఇరాన్లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ట్రంప్ టెహ్రాన్పై దాడికి దిగారు. ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అంచనా వేసినట్లుగానే జరుగుతున్నాయి.మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది.ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా ఇజ్రాయెల్తో కలిసి అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వాదనలు ఉన్నాయి.వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు.ఆ ఏడాది జనవరి 3న ఇరాక్లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు నేపథ్యంలో ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్లోనే ఉన్నాడా? లేక వేరే దేశంలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. -
అమెరికా దాడి చేస్తే.. రణరంగమే
దుబాయ్: అగ్ర రాజ్యం అమెరికా తమపై దాడి చేసిన పక్షంలో పశ్చిమాసియా యుద్ధ రంగంగా మారుతుందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ(86) తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజల నిరసనలను హింసాత్మక అణచివేయాలని చూస్తే తీవ్ర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం తెల్సిందే. విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్, ఇతర యుద్ధ నౌకలు అరేబియా జలాల్లోకి ప్రవేశించిన వేళ ఖమేనీ అమెరికానుద్దేశిస్తూ సూటిగా చేసిన హెచ్చరికలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా ముదిరే ప్రమాదముందని భావిస్తున్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను తిరుగుబాటుగా ఖమేనీ అభివర్ణించారు. తమపై దాడులకు దిగితే అది ఈసారి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. ‘మేం రెచ్చగొట్టే వాళ్లం కాము. మేం ఎవరిపైనా యుద్ధానికి వెళ్లాలనుకోవడం లేదు. మమ్మల్ని వేధించాలని చూసినా, దాడులకు పాల్పడినా తీవ్రస్థాయిలో ప్రతిచర్యలు తప్పవు’అని ప్రకటించారు. అదేవిధంగా, గతంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు నిరసనలకు పాల్పడుతున్నారంటూ గతంలో వ్యాఖ్యానించిన ఖమేనీ ఈసారి ఆందోళనకారులపై స్వరం పెంచారు. ‘ఇటీవల జరుగుతున్న నిరసనలు తిరుగుబాటుతో సమానమైనవి. అందుకే ఆ తిరుగుబాటును అణచివేశాం. దేశాన్ని నడిపించే కీలక వ్యవస్థలను ధ్వంసం చేయడమే నిరసనకారుల లక్ష్యం. అందుకే వారు పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, రివల్యూషనరీ గార్డుల కేంద్రాలు, బ్యాంకులు, మసీదులపై దాడులకు పాల్పడ్డారు. ఖురాన్ ప్రతులను దహనం చేశారు’అని ఆరోపించారు.ఈయూ సైనికులూ ఉగ్రవాదులేనిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న రివల్యూషనరీ గార్డ్స్ విభాగం బలగాలను యూరోపియన్ యూనియన్(ఈయూ)ఉగ్రవాదులుగా పక్రటించడంపై ఇరాన్ మండిపడింది. ఈయూ సభ్యదేశాల మిలటరీని కూడా ఉగ్ర గ్రూపులుగా ప్రకటించే విషయం పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం 2019లోనే రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించింది. బదులుగా ఇతర దేశాల మిలటరీని ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించే విషయం తామూ పరిశీలిస్తామని అప్పట్లోనే ఇరాన్ తెలిపింది. రివల్యూషనరీ గార్డు విభాగం సుప్రీం నేత ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అయితే, యూరప్లోకి ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా కట్టడి చేస్తున్న రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ద్వారా యూరప్ తనకంటిని తానే పొడుచుకుందని గార్డుల మాజీ కమాండర్ మహ్మద్ బఘెర్ వ్యాఖ్యానించారు. అమెరికా మాట విని ఈయూ గుడ్డిగా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. మరో పరిణామంలో...వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆది, సోమవారాల్లో లైవ్ ఫైర్ మిలటరీ డ్రిల్ చేపడుతోంది. ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో ఐదో వంతు పర్షియన్ గల్ఫ్లోని ఈ జలసంధి ద్వారానే సాగుతోంది. తమ యుద్ధ నౌకలు, విమానాలకు నష్టం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. -
మాపై దాడి చేస్తే అంతే.. ట్రంప్కు ఖమేనీ తీవ్ర హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ట్రంప్ ఆ దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అణుఒప్పందం విషయంలో ఇరాన్ తగ్గకపోతే వెనిజువెలా సీన్ను మించి రిపీట్ అవుతుందని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ సుప్రీం ఖమేనీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. అమెరికా తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ట్రంప్ను హెచ్చరించారు.ఇటీవల ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా స్పందిచారు. ప్రస్తుతం ఇరాన్ వైపు అమెరికా నావిక దళం వెళుతుందని అది ఇంతకు ముందు వెనిజువెలా వెళ్లన దాని కంటే పెద్దదన్నారు. సమయం మించిపోతుందని అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దిగిరాకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. దానికి ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించింది. కాగా తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ట్రంప్ను తీవ్రంగా హెచ్చరించారు.ఆదివారం ఇరాన్ శాసనసభలో ఆదేశ సుప్రీం లీడర్ ఖమేనీ మాట్లాడారు. " టంప్ వాక్చతుర్యానికి ఇరానీయులు భయపడవద్దు.మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ మాపై దాడి చేస్తే గట్టిగా బదులిస్తాం. ఒకవేళ మాపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోండి" అని అన్నారు. అంతేకాకుంగా ఇరాన్లో జరిగిన నిరసనలను అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సాహంతోనే జరిగాయని ఖమేని అభివర్ణించారు.అల్లర్లు జరిపిన వారు ప్రభుత్వ కార్యాలయాలపై, మసీదులపై, బ్యాంకులపై దాడిచేశారని అది ఇరాన్పై జరిగిన తిరుగుబాటన్నారు. దానిని భద్రతా బలగాలు విజయవంతంగా అణిచివేశాయని తెలిపారు ఇరాన్లో జరిగిన నిరసనల్లో మూడు వేల మంది పౌరులు మరణించినట్లు ఆ దేశం అంగీకరించింది. ఇటు ట్రంప్ హెచ్చరికలు.. అటు ఖమేనీ తగ్గేదేలే అనడంతో ప్రస్తుతం ఏం జరగనుందా అని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. -
ఖమేనీని సాగనంపాల్సిందే
వాషింగ్టన్: ఇరాన్లో సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ శకం పరిసమాప్తి కావాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. పొలిటికో వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ అంశంపై మాట్లాడారు. ‘‘ఇరాన్లో నూతన నాయకత్వం తెరమీదకు రావల్సిన తరుణం ఆసన్నమైంది. ఖమేనీని సాగనంపాల్సిందే’’అని అన్నారు. తమ దేశంలో హింసకు ట్రంపే కారణమని ఖమేనీ పలుమార్లు ఆరోపణలు గుప్పించిన వేళ ఇరాన్లో నాయకత్వ మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలుచేయడం ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘దేశంలో అత్యున్నత పరిపాలనా హోదాలో కొనసాగుతూ కూడా దేశం సర్వనాశనమవుతుంటే ఆయన(ఖమేనీ) పట్టించుకోలేదు. పైగా పోలీసు చర్యతో ఉద్యమాలను అణచివేస్తూ హింసను ప్రోత్సహించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హింసాత్మక ఘటనలకు కారకుడయ్యారు. నాయకులు నాలా దేశాన్ని సవ్యంగా పరిపాలించడంపై దృష్టి సారించాలి. అధికారంలో కొనసాగేందుకు ఆయనలాగా నేను వేలాది మందిని చంపలేదు. అసమర్థ ఖమేనీకి పరిపాలించే అర్హత లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
నిరసనలను కఠినంగా అణచివేస్తాం
దుబాయ్: ఇరాన్లో ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో జనం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం నేత అలీ ఖమేనీ(86) గద్దె దిగాలంటూ పది రోజులుగా నిరసనలు కొనసాగుతుండటం తెల్సిందే. సుప్రీం నేత అలీ ఖమేనీ శుక్రవారం తన నివాసం వెలుపల చేరిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన శాంతియుతంగా నిరసనలు దిగిన ప్రజలపై హింసాత్మక చర్యలకు దిగితే వారికి మద్దతుగా నిలబడతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బెదిరింపుపై మండిపడ్డారు. ఇరానియన్ల రక్తంతో చేతులు తడుపుకున్నారంటూ ట్రంప్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసమే కొందరు వీధుల్లోకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించడానికి బదులుగా ట్రంప్ తన దేశం గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు. ఇరాన్ యువరాజు పిలుపుగురు, శుక్రవారాల్లో వీధుల్లోకి వచ్చి ఖమేనీ పాలనపై నిరసన వ్యక్తం చేయాలని ఇరాన్ మాజీ రాజకుటుంబ వారసుడు, చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రజలకు పిలుపు ఇచ్చారు. దీంతో, రాజధాని టెహ్రాన్ వాసులు గురువారం రాత్రి పనికిరాని వస్తువులతో వీధుల్లో మంటలు వేశారు. ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రెజా పహ్లావి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. జనం పెద్ద సంఖ్యల్లో వీధుల్లోకి తరలివచ్చి ర్యాలీలు చేపట్టిన వీడియోలు, ఫొటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో ప్రభుత్వం ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ ఫోన్కాల్స్పై నిషేధం విధించింది. దీంతో, ఆందోళనల తీవ్రత బయటి ప్రపంచానికి తెలియడం లేదు. అయితే, ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో కనీసం 62 మంది చనిపోయారని, మరో 2,500 మందిని అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. -
రెడ్ లైన్ దాటితే ఏం చేయాలో మాకు తెలుసు!
ఇరాన్లో కరెన్సీ విలువ పతనంతో మొదలైన ఆర్థిక సంక్షోభం.. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఆందోళనలు హింసాత్మక మలుపు తీసుకున్నాయి. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగి ఇప్పటిదాకా 8 మంది మరణించారు. అయితే ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇవ్వగా.. ఆ దేశం కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే ప్రతిస్పందన మరోలా ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు మరిన్ని నగరాలకు విస్తరించాయని కథనాలు వెలువడుతున్నాయి. పలు చోట్ల భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది ఆ కథనాల సారాంశం. అయితే శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిపై కాల్పులు జరిపితే మేం జోక్యం చేసుకుంటామంటూ ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది.ట్రంప్ హెచ్చరికలను తిప్పి కొట్టింది ఇరాన్. తమ దేశ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది ఘర్షణలకు దారి తీస్తుందని.. ఇరాన్ జాతీయ భద్రత రెడ్లైన్ లాంటిదని.. దానిని దాటే ప్రయత్నం చేస్తే ఎక్కడ గురిపెట్టాలో తమకు తెలుసని.. కాబట్టి అమెరికా అలా చేయకపోవడం ఉత్తమం’’ అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఒక ప్రకటనలో తెలిపారు.మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది ఇరాన్. ఐరాసలో ఆ దేశ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. ట్రంప్ బెదిరింపులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించిన ఇర్వానీ.. అవసరమైతే తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. ఇరాన్ మరో సీనియర్ నేత అలి లారిజానీ సంచలన ఆరోపణలకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలో నిరసనలను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఇరాన్లో విదేశీ జోక్యం జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని సొంత ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారాయన.ఇరాన్లో నిరసనలు ఏడో రోజుకి చేరాయి. 2022లో మోరల్ పోలీసింగ్ ఘటనతో మరణించిన మహ్సా అమినికి సంఘీభావంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరాన్లో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. -
నిత్యం డ్రగ్స్.. రోజంతా మత్తులోనే
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ సంబంధ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్ సుప్రీం నేత అయెతొల్లా ఖమేనీ గురించి తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఖమేనీ పాలనకు తగిన వ్యక్తి కారని, డ్రగ్స్కు బానిసై ఎప్పుడూ మత్తులోనే జోగుతుంటారని ఆరోపించింది. పర్షియన్ భాషలోని ఈ అకౌంట్ను @Mossad Spokesman గా గుర్తించారు. ఇది ‘మొస్సాద్ ఫార్సి’గా కూడా పేరుతెచ్చుకుంది. అచ్చు మొస్సాద్ అధికార చానెల్ అకౌంట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇరాన్ లక్ష్యంగా ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇరాన్కు ఇబ్బంది కలిగించేలా ఆ దేశ ప్రభుత్వ రహస్య సమాచారం వంటివి ఇందులో కనిపిస్తుంటాయి. అంతేకాదు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల గురించిన రహస్య క్విజ్ పోటీలను సైతం ఈ అకౌంట్ నిర్వహిస్తుంటుంది. శుక్రవారం @MossadSpokesman ఎక్స్ అకౌంట్లో..‘రోజులో సగం నిద్రకు, మరో సగం డ్రగ్స్కు బానిసై గడిపే వ్యక్తి దేశాన్ని ఎలా నడపగలరు?..నీళ్లు, కరెంటు, జీవితం’అంటూ పేర్కొంది. అయితే, ఇందులో ఖమేనీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇరాన్లో కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, విద్యుత్ కొరతలతోపాటు నిత్యం కనిపించే ప్రజాందోళనలను పరోక్షంగా పేర్కొంది. ఈ పోస్టుకు 48 గంటల్లోనే 1.80 లక్షల మంది స్పందించారు. గత నెలలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య 12 రోజులపాటు కొనసాగిన సంక్షోభం సమయంలో ఈ అకౌంట్లో ఇరాన్ నూతన సైనిక కమాండర్ ఎవరో చెప్పాలంటూ సవాల్ విసరగా ఒక వ్యక్తి కచ్చితమైన పేరును వెల్లడించడం విశేషం. ఈ అకౌంట్లో గతంలోనూ ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులే ఉండేవి. డ్రగ్స్ వాడే వారు నాయకత్వం వహించగలరా అంటూ ప్రశ్నించింది. ఇందులో ప్రత్యేకంగా అయెతొల్లా ఖమేనీ పేరును ప్రస్తావించనప్పటికీ ఆ తీవ్రత, కంటెంట్ను బట్టి ఇరాన్ సుప్రీం లీడరే టార్గెట్ అన్న విషయం తేలిగ్గా ఎవరికైనా అర్థమవుతుంది. పర్షియా భాషలో ఉన్న ఈ పోస్టులను ఆటో–ట్రాన్స్లేషన్తో అందరూ చదవొచ్చు. ఈ అకౌంట్ తమదేనంటూ ఇజ్రాయెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఇరాన్ ప్రజలే లక్ష్యంగా మొస్సాద్ నిర్వహించే మెసేజింగ్ చానెల్గానే చెబుతుంటారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ వేళ... గత నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన వేళ ఈ అకౌంట్ వచ్చిన ఒక పోస్టు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇజ్రాయెల్ చేసిన మొట్టమొదటి దాడిలో ఇరాన్కు చెందిన ఘొలాం అలీ రషీద్ అనే మిలటరీ కమాండర్ చనిపోయారు. ఆ వెంటనే అలీ షాద్మానీ అనే ఆయన వారసుడు సైతం మృతి చెందారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన కమాండర్ పేరును ఇరాన్ రహస్యంగా ఉంచింది. ఈ అంశంపై @Mossad Spokesman రెచ్చగొట్టే రీతిలో స్పందించింది. ఆ కమాండర్ ఎవరో తనకు తెలుసునంటూ, కొత్తగా నియమితులైన కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లకు క్విజ్ పెట్టింది. ‘ఇరాన్ ప్రభుత్వం ఖతమ్ అల్ అన్బియాకు కొత్త కమాండర్ను నియమించింది. భద్రత కోసం ఆయన పేరును వెల్లడించలేదు. మాకు అతడెవరో తెలుసు, అతడితో ఉండే వారి పేర్లూ తెలుసు. దురదృష్టవశాత్తూ ఇటువంటి విషయాలను ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. ఆ కొత్త కమాండర్ పేరు తెలిస్తే దయచేసి చెప్పండి’అని కోరింది. దీనికి 2,300 మంది స్పందించారు. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తదితర పేర్లను కొందరు ఊహించి చెప్పగా మరికొందరు మాత్రం తిట్టిపోశారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సోషల్ మీడియా యూజర్ బెహ్నమ్ గొలిపౌర్ మాత్రం కొత్త కమాండర్ పేరు అలీ అబ్దొల్లాహి అలియాబాది అంటూ కరెక్ట్గా గెస్ చేశారు. అతడి పేరును ప్రకటించిన మొస్సాద్ అకౌంట్..వ్యక్తిగతంగా తమను కలిసి, బహుమతి అందుకోవాలని కోరింది. -
చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్లోని ఓ కాంపౌండ్లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయతొల్లా ఖమేనీ (ఇరాన్ సుప్రీం) రాయని డైరీ
అహంకారం మంచి విషయం. కానీ, ఎవరు అహంకరిస్తున్నారు అనే దానిని బట్టి అది మంచి విషయం అవునా కాదా అనేది ఉంటుంది! అహంకారం, జాతి రక్షకుడికి దేవుని అనుజ్ఞ. అదే అహంకారం, జాతులను తుడిచి పెట్టేందుకు సైతాను ఆజ్ఞ. ‘‘ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. అతడిని కాపాడటం కూడా మా చేతుల్లోనే ఉంది...’’ అంటోంది అమెరికా! ఎంత అహంకారం?! ఎవర్ని ఎవరు కాపాడతారన్నది యుద్ధం చేతుల్లో ఉంటుందా? సర్వశక్తి సంపన్నుడైన అల్లాహ్ తలంపులో ఉంటుందా? ఎవరి దారిన వాళ్లుండేవాళ్లను నొప్పించే పనులే జరిగాయి ఈ లోకంలో ఇంతవరకు! ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముస్లిం ప్రపంచం ప్రతి దేశంలోనూ గాయపడి ఉంది. ముస్లిములను షియాలుగా, సున్నీలుగా; ముస్లింలను అరబ్బులుగా, అరబ్బులు కానివారిగా వేరు చేసి, ఐక్యతను చెడగొట్టి యావత్ ముస్లిం జాతినే తుడిచిపెట్టేందుకు అగ్రరాజ్య సైతాన్, జెరూసలేంలో తిష్ఠవేసుకుని ఉన్న ‘జియోనిస్టు పిల్ల సైతాను’తో కలిసి ముస్లిం దేశాల మీదమీదకు వస్తోంది.పాలస్తీనా, లెబనాన్, యెమెన్, సిరియాలలో ఇరాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందనీ, ఆ ఉగ్రవాదుల నుంచి ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను తన మీద వేసుకున్నాననీ అమెరికా చెబుతోంది! అసలు ఎవరి నుండి రక్షించుకోవడానికి ఇరాన్ ఈ ‘ఉగ్రవాద’ కవచాలను ఏర్పరచు కోవలసి వచ్చిందో, ముందు అది చెప్పాలి అమెరికా. అంతకన్నా ముందు, ‘ఉగ్రవాదులు’ అనటం మాని ‘ధర్మయుద్ధ సైనికులు’ అనటం అమెరికా నేర్చుకోవాలి.ఖమేనీ ఆధునిక హిట్లర్ అంటోంది జియోనిస్ట్ పిల్ల సైతాన్ ! తన పెదనాన్న పెద్ద సైతాన్ ను మించిన హిట్లర్ ఎవరున్నారు? గ్వాంటనామో, అబుగ్రై»Œ జైళ్లలో అమెరికా చేసిన నేరాలెన్ని! అక్కడి ఖైదీలకు చూపిన నరకాలెన్ని? స్వతంత్రంగా ఉన్న ఏ దేశాన్ని చూసినా బుసకొట్టకుండా ఉందా ఈ పెద్ద సైతాన్ ?! సిరియా అంతర్యుద్ధం మొదలైందీ, అంతం కాకుండా ఉన్నదీ ఎవరి వల్ల? ఈ రెండు సైతాన్ల వల్లనే కదా!‘‘తగాదా తీర్చటానికి తాను సిద్ధంగా ఉన్నాను’’ అని రష్యా అంటోంది! మిత్రులైన వాళ్లు కూడా సర్దుబాటు చేయటానికే చూస్తారేమిటి?! రష్యా పూర్తిగా ఇరాన్ వైపు ఉండలేదా, బహిరంగంగా. అయినా, దేవుడితో సైతాను తగాదా పడుతున్నప్పుడు అది దేవుడికి, సైతానుకు మధ్య తగాదా ఎలా అవుతుంది? సైతానును కదా రష్యా హెచ్చరించాలి, ‘‘నువ్వు నోరు తెరవకు. దేవుడితో ఘర్షణ పడితే నెత్తిపై ఒక్కటి పడుతుంది...’’ అని!పిల్ల సైతాను తల పైన కర్రతో కొట్టకుండా ఇరాన్ కు నచ్చచెబుతాననీ, ఆత్మరక్షణకు తప్ప మరి దేనికీ కర్రలను దగ్గర పెట్టుకోకుండా ఇరాన్ ను ఒప్పిస్తాననీ రష్యా అనటం మధ్యవర్తిత్వం అవుతుంది కానీ, స్నేహం అవుతుందా? చైనా రహస్యంగా కొన్ని ఆయుధాలు పంపింది. ఒకరికి సహాయం చేస్తే తెలియకూడదని అంటారు. స్నేహం కూడా ఎవరికీ తెలియకుండా చేయాలా? ఏమైనా, ఇరాన్ ఒంటరి పోరాటమే చేయాలి. వికారమైన ఆ పిల్ల సైతాన్ ని ఈ భూమి మీద లేకుండా చేసేంతవరకు అన్ని ఇస్లాం దేశాల తరపున, అల్లాహ్ పేరిట ఇరాన్ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆఖరి ఆయుధం వరకు, ఆఖరి ఆయుధం తర్వాత కూడా!బంకర్కు దగ్గర్లో భూమి బద్దలైనట్లుగా పెద్ద చప్పుడు! అమెరికా తన దుర్మార్గమైన యుద్ధాన్ని మొదలు పెట్టినట్లే ఉంది! సర్వజ్ఞుడైన అల్లాహ్కు సత్యమేమిటో తెలుసు. నా ప్రియమైన ఇరాన్కు అల్లాహ్ రక్షణ తప్పక ఉంటుంది.ఆయన ఇరాన్ చేయి విడువడు. నా ఆత్మ ఇరాన్ ను వీడదు. -
మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్ సుప్రీం
టెహ్రాన్: ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య ఘర్షణలు ఉధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన పాత వివాదాస్పద పోస్టులు మరోమారు వైరల్గా మారాయి. మహిళల గురించి, ఉదారవాదంపై ఆయన చేసిన చేసిన పోస్టులు తిరిగి ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్ట్లలో ఖమేనీ మహిళల హక్కులపై స్పందించడమే కాకుండా, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. Man has a responsibility to understand #woman’s needs and feelings and must not be neglectful toward her #emotional state— Khamenei.ir (@khamenei_ir) September 15, 2013ఈ పోస్టులలో కొన్ని దశాబ్దకాలం క్రితం నాటివి. ఇవి ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయి. సోషల్ మీడియా యూజర్స్ ఈ పోస్ట్లను చూసి కంగుతింటున్నారు. మహిళలను ఉద్దేశించిన ఆయన చేసిన పోస్ట్లలో కొన్ని లైంగిక వాంఛల పరమైనవి ఉన్నాయి. మరికొన్ని ప్రేమను పెంపొందించే సలహాలతో కూడినవై ఉన్నాయి.‘పురుషుడు.. స్త్రీ అవసరాలను, భావాలను అర్థం చేసుకునే బాధ్యతను కలిగి ఉండాలి. ఆమె భావోద్వేగ స్థితి విషయంలో పురుషుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు’ అని ఖమేనీ ఒక పోస్టులో పేర్కొన్నారు.Women are stronger than men. Women can completely control and influence men with their wisdom and delicacy. May 11, 2013— Khamenei.ir (@khamenei_ir) March 7, 20182013 నాటి ఒక పోస్ట్లో ఖమేనీ తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. ‘నేను మొదటి రోజున ప్రత్యేకమైన దుస్తులతో పాఠశాలకు వెళ్లాను. అయితే వాటిని ఇతర పిల్లల ముందు ధరించడం అసౌకర్యంగా అనిపించింది. కానీ సరదాగా ఉండటం ద్వారా ఆ పరిస్థితిని అధిగమించాను’ అని ఆయన రాశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకం తాను చదవడంపై కూడా ఖమేనీ వ్యాఖ్యానించారు. నెహ్రూ రాసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ని అధ్యయనం చేయముందు నాకు భారతదేశం గురించి తెలియదు.ఈ వలసరాజ్యం పలు ఎత్తుపల్లాలను చూసింది’ అని రాశారు.I went 2school w/a cloak since1st days;it was uncomfortable 2wear it in front f other kids,but I tried 2make up 4it by being naughty&playful— Khamenei.ir (@khamenei_ir) September 24, 2013ఖమేనీ ఈ తరహా వ్యాఖ్యలపై సోషల్ మీడియా యూజర్స్ స్పందించారు. ఒక యూజర్..‘క్షమించండి, అయతుల్లా ఖమేనీ.. మీ గేమ్ల గురించి నాకు తెలియదు’ అని అన్నారు. మరొక యూజర్ ‘ప్రేమికునిగా పుట్టి, సుప్రీం నేతగా ఉండవలసి వచ్చింది’ అని అన్నారు. Before studying "Glimpses of World History" by Mr. #Nehru I didn't know #India before colonization had undergone so many important #advances— Khamenei.ir (@khamenei_ir) August 6, 2013 ఇంకొకరు ‘పాత ట్వీట్లు మళ్లీ తెరపైకి వచ్చినా, వాటిని తొలగించని మొదటి వ్యక్తి అయతుల్లా ఖమేనీ’ అని అన్నారు. ఇజ్రాయెల్, యూఎస్లు ఒత్తిడిని పెంచుతున్నప్పటికీ, తాను లొంగిపోయేది లేదని ఖమేనీ స్పష్టం చేసిన తరుణంలో ఈ పోస్టులు వైరల్గా మారాయి.ఇది కూడా చదవండి: ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు -
ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు
జరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు. ఖమేనీని హత్య చేసేందుకు వేసిన ప్లాన్ను ట్రంప్ వ్యతిరేకించారంటూ అమెరికా అధికారులు ధ్రువీకరించిన అనంతరం నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలూ క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం విరుచుకుపడుతున్నాయి. ప్రపంచం ఈ ఘర్షణలను నిశితంగా గమనిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నాల్గవ రోజుకు చేరుకుంది. పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరికలు జారీ చేశాయి.కాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఒక రహస్య బంకర్కు తరలించారని సమాచారం. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ)ఆయనకు భద్రత కల్పిస్తున్నది. అయతుల్లా సురక్షితంగా ఉన్నారని, దేశపు రక్షణ చర్యలను అనుక్షణం పరిశీలిస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్ను ట్రంప్ వ్యతిరేకించారంటూ రాయిటర్స్ పేర్కొంది.ఇది కూడా చదవండి: బైక్పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానా -
ప్చ్.. ఖమేనీ వారసుడికి పగ్గాలు కష్టమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగున్న వేళ.. మరోవైపు ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కోమాలోకి కూడా వెళ్లారని, ఆయన వారసుడు మోజ్తాబా ఖమేనీ తదుపరి సుప్రీంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం తీవ్రతరమైంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ట్విస్ట్ చోటు చేసుకుంది.తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సంకేతాలిస్తూ.. ఖమేనీ తాజాగా ఓ ఫొటో రిలీజ్ చేశారు. లెబనాన్ ఉన్న ఇరాన్ రాయబారి ముజ్తబా అమనిని కలుసుకున్నట్లు తన ఎక్స్ ఖాతాలో ఖమేనీ పోస్ట్ చేశారు. ఇటీవల లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన పేజర్ దాడుల్లో ముజ్తబా అమని కూడా గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఖమేనీ ఆరా తీసినట్లు సమాచారం.ఇక.. ఖమేనీ ఆరోగ్యం విషమించిందని, కోమాలోకి వెళ్లారని, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని.. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం వెలువడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 20వ తేదీన 60 మంది ఇరాన్ అసెంబ్లీ నిపుణులతో ఒక తీర్మానం కూడా ఖమేనీ చేయించాడన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఆ తీర్మానాన్ని.. ఓటింగ్ను చాలామంది వ్యతిరేకించారని కూడా అదే కథనం పేర్కొంది. ఈ కథనం ఆధారంగా రకరకాల కథనాలు వండి వార్చాయి మిగతా మీడియా సంస్థలు. కానీ, ఖమేనీ తాజా పోస్టుతో మోజ్తాబాకు ఇరాన్ సుప్రీం పగ్గాలు ఇప్పట్లో పగ్గాలు అప్పజెప్పకపోవచ్చనే స్పష్టత వచ్చింది. ఇదే కాదు.. మెజ్తాబాకు ఆటంకాలు కూడా ఉన్నాయి. అయతొల్లా అలీకి ఆరుగరు సంతానం. మోజ్తాబా.. రెండో కొడుకు. 1969లో మషాబాద్లో పుట్టాడు. తన తండ్రి బాటలో నడుస్తూ.. మత పెద్దగా మారాడు. అలాగే 2005, 2009 ఇరాన్ ఎన్నికల్లో మహమూద్ అహ్మదీనెజాద్కు మద్దతు ఇచ్చి.. అతని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఇరాన్ రిచ్చెస్ట్ మ్యాన్గానూ మోజ్తాబాకు పేరుంది.ఇరాన్ జీడీపీ 388 బిలియన్ డాలర్లు కాగా, ఖమేనీ కుటుంబం ఆస్తుల విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో 90 బిలియన్ డాలర్లు మోజ్తాబా పేరిటే ఉందని అమెరికా నివేదికలు వెల్లడించాయి. అయితే.. ఇరాన్ రాజకీయాల్లో జోక్యం ద్వారా అలీపై విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. 2009లో అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. చెలరేగిన నిరసనల అణచివేత మోజ్తాబా ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే తర్వాతి కాలంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ ఖజానా సొమ్మును దుర్వినియోగం చేశాడంటూ మోజ్తాబాపై అహ్మదీనెజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఇరాన్ అసెంబ్లీ నిపుణులు మెజ్తాబాకు ఇరాన్ సుప్రీం బాధ్యతలు వెళ్లనివ్వకుండా అడ్డుకునే అవకాశం లేకపోలేదు. అయతొల్లా వారసుడిగా సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్నప్పటికీ.. సుప్రీం కుర్చీ మాత్రం మెజ్తాబాకు చాలా దూరంగానే ఉందన్నది పలువురి వాదన.


