breaking news
scrub typhusin
-
జ్వరాలు ‘వైరల్’
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాలు ఎటుచూసినా అపరిశుభ్ర వాతావరణం..! ప్రజలపై దోమల దండయాత్ర..! ఫలితంగా వ్యాధుల స్వైర విహారం..! ఒకరికి జ్వరం వస్తే కుటుంబంలోని అందరినీ చుట్టేస్తోంది..! ఏ ఇంట్లో చూసినా జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య బాధితులే..! దావానలం తరహాలో వ్యాధులు వ్యాపిస్తుంటే నియంత్రణ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది..! బాధితులకు వైద్య భరోసా లేకుండా పోయింది..! అసలే పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండగా ఇటీవల భారీ వర్షాలు, వరుస తుపానులతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీనికితోడు ప్రభుత్వ వైద్యం పడకేసింది. 24 గంటలు సేవలందించాల్సిన పీహెచ్సీలకు తాళాలు పడుతున్నాయి. ప్రజలు ఆర్ఎంపీలు, ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. సత్యసాయి నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో ఆందోళన కలిగించిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల పలువురు జ్వర బాధితుల నమూనాలను గుంటూరు వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. పిల్లల్లో సైతం బాధితులున్నట్లు వెల్లడైంది. వీటికిపాటు అడినోవైరస్, ఇన్ఫ్లుయెంజా ఎ, బి, డెంగీ కేసులు అధికంగానే ఉంటున్నాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు బాధితులను తీవ్రంగా వేధిస్తున్నాయి. మాట్లాడలేనంతగా గొంతు ఇన్ఫెక్షన్..పిల్లలు, పెద్దలను గొంతు ఇన్ఫెక్షన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు మాట్లాడేందుకు కూడా తీవ్ర అవస్థ పడుతున్నారు. తొలుత గొంతు నొప్పితో మొదలై జ్వరం, జలుబు చుట్టుముడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులు బాధితుల్లో 101 నుంచి 104 డిగ్రీల జ్వరం ఉంటోంది. జ్వరం, జలుబు తగ్గాక వారం రోజులు, ఆపైన దగ్గు వెంటాడుతోంది. » ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలను మలేరియా, విష జ్వరాలు పీడిస్తున్నాయి. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో మలేరియా తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలతో పాటు, రాష్ట్రం మొత్తం గత ఏడాదితో పోలిస్తే కేసులు పెరిగాయి. » స్క్రబ్టైఫస్ విజృంభణ కూడా అధికంగానే ఉంటోంది. ఇçప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,801 పాజిటివ్లు నమోదవగా, దీనిబారిన పడి 15 మంది చనిపోయారు.నియంత్రణ చర్యలు శూన్యంపెద్దఎత్తున వ్యాధులు వ్యాపిస్తున్నా, నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మొక్కుబడిగా ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వార్డు స్థాయిల్లో పక్కాగా పారిశుధ్య నిర్వహణ, ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా సరై్వలెన్స్, ఇతర కార్యక్రమాలు చేపట్టడమే లేదు. అసలు సరై్వలెన్స్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నీరుగారి్చంది. స్క్రబ్టైఫస్ బాధితుల మరణాలపై మీడియాలో కథనాలు వచ్చాకే వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం పరిస్థితి ఎంత నిర్లక్ష్యంగా ఉందో చాటుతోంది.» గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జనవరి–సెప్టెంబర్ మధ్య వరుసగా మరణాలు సంభవించినా ప్రభుత్వానికి కనీస సమాచారం లేదు. ఈ ఉదాహరణలన్నీ రాష్ట్రంలో వ్యాధులపై సరై్వలెన్స్ లేదనేందుకు పెద్ద నిదర్శనమని చెప్పవచ్చు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పకడ్బందీగా ముందు జాగ్రత్త చర్యలుకరోనాతో పాటు, ఇతర సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రాథమిక దశలోనే పీడితులను గుర్తించడం, వారి కాంటాక్ట్లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ముందుజాగ్రత్త చర్యలన్నీ చేపట్టారు. ఫీవర్ సర్వే నిర్వహించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి... జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు ఇతర లక్షణాలున్నవారిని గుర్తించే వారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును అధ్యయనం చేసి, ప్రజలకు జాగ్రత్తలను సూచించేవారు. వైఎస్సార్సీపీ హయాంలో ఫీవర్ సర్వేలో అవసరం మేర కిట్ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు. పరిస్థితిని బట్టి ఆస్పత్రులకు రెఫర్ చేసి, వైద్యం అందేలా సమన్వయంతో వ్యవహరించేవారు. తద్వారా ప్రాథమిక దశలోనే మలేరియా, డెంగీ వంటి వ్యాధులు బయటపడేవి. బాధితులు ఆస్పత్రుల పాలవకుండా మందులతోనే కోలుకునే వీలు కలిగేది. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే నిర్వీర్యం చేశారు. ఫీవర్ సర్వే ఊసే లేకుండా పోయింది. వ్యా«ధి ముదిరిన అనంతరం బాధితులు ఆస్పత్రులకు వెళ్తున్నారు. రోగ నిరోధక శక్తి క్షీణించినవారు, అసలు రోగ నిరోధకత లేనివారు మృత్యువాత పడుతున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదు.బాబూ... ఏదీ నియంత్రణ?‘‘డయేరియా, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్, పంచాయతీ, వైద్యశాఖ అధికారులతో సమన్వయ కమిటీ వేస్తున్నాం, కేసులు సున్నాకు కట్టడి చేస్తాం, దోమలపై డ్రోన్లతో దండయాత్రలు చేస్తా’’ అని నిరుడు గద్దెనెక్కిన వెంటనే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. పేరుకు సమన్వయ కమిటీలు వేశారుగానీ క్షేత్ర స్థాయిలో నియంత్రణ చర్యలు కొరవడ్డాయి. దోమలపై డ్రోన్లను ఎక్కుపెడతామన్న బాబు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో సక్రమంగా ఫాగింగ్ కూడా చేయడం లేదు. మా ‘లావు’ దోమలురాష్ట్రంలో దోమల స్వైర విహారం ఎలా ఉందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. ‘‘ప్రజలారా మీ సమస్యలు చెబితే నేను పార్లమెంట్లో చర్చిస్తా’’ అంటూ ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘దోమలు నివారించండి’ అంటూ పలువురు కామెంట్లు పోస్ట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లోనే కాదు. విశాఖ, విజయనగరం, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో సైతం ప్రజలను దోమలు కుట్టి కుట్టి వేధిస్తున్నాయి. డోర్లు, కిటికీలకు మెష్ వేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. -
Scrub Typhus Cases: వణికిస్తున్న పురుగు పెరుగుతున్న కేసులు
-
వామ్మో.. స్క్రబ్ టైఫస్!
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికి 289 నమూనాలను సేకరించగా 39 మందికి పాజిటివ్ రావడంతో జిల్లా ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. రెండు రోజుల కిందట సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థి, కేవీ పల్లె మండల పరిధిలో మరో వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కావడంతో తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికశాతం మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదు. అధికారులు దీనిపై విస్తృతంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణ జ్వరం లాంటిదైనప్పటికీ ఆలస్యం చేస్తే శరీరంలో అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మండల పరిధిలో ల్యాబ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. . ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ..... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే అదనుగా భారీగా సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా సమయంలో ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. సాధారణ జ్వరాన్ని స్క్రబ్ టైఫస్ అని భయాందోళనకు గురిచేస్తూ పేదల నుంచి డబ్బు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన ల్యాబ్, మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు ఇవి.. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఇది చిగ్గర్స్ అనే చిన్న కీటకాల లాంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరంపై కనిపిస్తుంది. ఈ చిగ్గర్స్ కీటకాలు పొదలు, గడ్డి, వ్యవసాయ భూముల్లో నివసిస్తాయి. ఇవి కుట్టినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన తర్వాత 5–15 రోజుల్లోపు తీవ్రమైన జ్వరం, చలి, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, బలహీనత, మెడ, చంకల్లో వాపు గడ్డలు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. అలాగే పురుగు కుట్టిన చోట ముదురు రంగుతో కూడిన పుండు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షణాలుంటే స్క్రబ్ టైఫస్గా భావించాలని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయించకపోతే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో పాటు అవయవాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని, సకాలంలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే నాలుగైదు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు తెలిపారు. నివారణ మార్గాలు ఏంటంటే.. స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలంటే చేతులు, కాళ్లను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డి, పొదలు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగడంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.8 శరీరంలోకి నేరుగా ప్రవేశించదు స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రభావం జిల్లాలో చాలా తక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 39 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. స్క్రబ్ టైఫస్ బ్యాక్టిరియా శరీరంలోకి నేరుగా ప్రవేశించలేదు. బ్యాక్టిరియాను మోసుకెళ్లే ఈగలు, పేలు, నల్లులు కుట్టడం ద్వారా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టినచోట కొందరికి నల్లని మచ్చ ఏర్పడుతోంది. కొందరిలో మచ్చ కనిపించదు. నొప్పి ఉండదు. ఇవి కుట్టినచోట బ్యాక్టిరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. ఆరు లేదా ఏడు రోజులకు పూర్తి లక్షణాలు బయటపడతాయి. మొదట్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి వంటి లక్షమాలు కనిపిస్తాయి. మలేరియా, టైపాయిడ్ అనే భ్రమలో ఉన్నవారు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయించుకోవాలి. – లక్ష్మీ నరసయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్
-
స్క్రబ్ టైఫస్తో 9 మంది మృతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఈ ఏడాది 1,566 నమోదయ్యాయని.. ఇందులో తొమ్మిది మంది బాధితులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. అయితే, ఈ మరణాలన్నీ స్క్రబ్ టైఫస్వల్లే జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్క్రబ్ టైఫస్ బాధితులు ఎందువల్ల మరణించారనే దానిపై పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఇందుకు కనీసం రెండు నెలల నుంచి మూడునెలల సమయం పట్టే అవకాశముందని తెలిపారు.బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ స్వీకెన్సీ (గుంటూరు, తిరుపతి) ద్వారా పరీక్ష చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. బోధనాసుపత్రుల్లో ఉండే ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్ఆర్)లు అధిక కేసులు/అసాధారణ మరణాలు నమోదైన ప్రాంతాల్లో పరిశోధన చేస్తాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆర్ఆర్ టీంలు ఉన్నాయన్నారు. ఎలీశా పరీక్ష చేయించి, స్క్రబ్ టైఫస్పై అవగాహనకు వస్తామన్నారు. గుంటూరు జీజీహెచ్లో గడిచిన 38 రోజుల్లో 26 స్క్రబ్ టైఫస్ కేసులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన్యంలో స్క్రబ్ టైఫస్ కేసుచింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ గిరిజనుడికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు. చింతూరు మండలం కొత్తపల్లికి చెందిన మడివి లక్ష్మయ్య ఈనెల 4న అధికజ్వరం, ఒళ్లునొప్పులతో సీహెచ్సీకి రాగా, వైద్యులు అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతనికి స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా పాజిటివ్గా తేలింది. లక్ష్మయ్యకు చికిత్సకు అందిస్తున్నామని అతని పరిస్థితి స్థిరంగా ఉందని కోటిరెడ్డి తెలిపారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్లు, మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. -
చిత్తూరు జిల్లాలో 3 స్క్రబ్ టైఫస్ కేసులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో కొత్తగా మూడు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు నగరంలోని గూలింగ్స్పేట, పాలసముద్రం మండలం ఆముదాల, జీడీ నెల్లూరు మండలం, చిన్నమిట్టపల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది.పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ వ్యాధి విజృంభిస్తోందని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో స్క్రబ్ టైఫస్ తో ఒకరి మృతి
-
కృష్ణా జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం..
ముదునూరు: కృష్ణాజిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల శివ శంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృత్యువాత పడ్డాడు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శివశంకర్ వద్ద శాంపిల్స్ తీసుకుంది వైద్య బృందం. అయితే 4వ తారీఖున శివశంకర్ మృతి చెందగా, ఈరోజు(శనివారం, డిసెంబర్ 6వ తేదీ) స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు రిపోర్ట్లో తేలింది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో గ్రామంలో వైద్య బృందం సర్వే చేపట్టింది. ఇదీ చదవండి: స్క్రబ్ టైఫస్.. ఈ వ్యాధి లక్షణాలు ఇవే.. -
తెలంగాణలో స్క్రబ్ టైఫస్ టెన్షన్
-
మరో వ్యాధి కలకలం, లక్షణాలివే
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్క్రబ్ టైఫస్ (Scrub typhus )విజృంభిస్తోంది. అతి సులభ చికిత్స గల వ్యాధి గనుక భయాందోళనలు లేవు గానీ వ్యాప్తి మాత్రం ఎక్కువగానే ఉందని అర్థమవుతున్నది. ఈ వ్యాధికారక బ్యాక్టీరియాను వైద్యశాస్త్ర పరిభాషలో ‘ఓరియంటా సుట్స్ గమిషి’ అంటారు. ఈ వ్యాధి ఇప్పుడు ఆసియా ఖండం మొత్తం వ్యాపించి ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో వ్యాధిగ్రస్థులు బయటపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి.ఈ స్క్రబ్ టైఫస్ కారక బ్యాక్టీరియా ప్రత్యక్షంగా మన శరీరంలోకి ప్రవే శించలేదు. బ్యాక్టీరియాను కలిగి వాహకాలుగా పేర్కొనే ఈగలు, పేలు, నల్లులు, చిగ్గర్లు కుట్టడం ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని రోజులలోనే ఎండిపోతుంది. దీనినే ‘ఎస్కార్’గా పేర్కొంటారు. కుట్టిన ప్రదేశం నుండే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. ఆరు లేదా ఏడు రోజుల తర్వాత వ్యాధి లక్ష ణాలు బయట పడటం మొదలవు తుంది. తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, చలితో లక్షణాలు మొదలవుతాయి. కండ రాల నొప్పులు ఉంటాయి. లింఫు గ్రంథుల వాపు ఉంటుంది. 50%మందిలో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. కొందరిలో కళ్ళు ఎర్రబడవచ్చు. దగ్గు ఉండవచ్చు. నీరసం ఉంటుంది. పిల్లలలో, 60 సంవత్సరాలు దాటిన వృద్ధు లలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఏ వయసు వారిలోనైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్యస్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్ మచ్చలు, రక్త పరీక్షలలో ఎలీసా, ఇమినో ఫ్లోరోసెంట్ ఎస్సే(ఐ.ఎఫ్.ఎ.), పి.సి.ఆర్. వంటి మాలిక్యులర్పరీక్షలు ఉపయోగపడతాయి. వ్యాధిని పూర్తిగా నయం చేసే మందు లున్నాయి. తొలి దశలో అయితే అతి సులువుగా చికిత్స చేయవచ్చు. చికిత్స ప్రారంభించిన 24 నుండి 48 గంటలలోనే లక్షణాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు కనుక భయపడవలసిన అవసరం లేదు. కానీ వ్యాప్తిని నియంత్రించి వ్యక్తుల ఆరోగ్య, ఆర్థిక నష్టాలను అరికట్ట వలసిన అవసరం ఎంతైనా ఉంది.– డా.టి. సేవకుమార్ , వైద్య నిపుణులు, గుంటూరు -
రోగులతో చెలగాటం!
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో ఉన్న వీఆర్డీఎల్ (వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీ)లో దారుణం జరుగుతోంది. ఎక్స్పైరీ అయిపోయిన రసాయనాల (రియేజంట్ల)తో స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేసి, కొందరికి అసలు చేయకుండానే నకిలీ రిపోర్టులు ఇచ్చి ప్రజల్ని, అధికారుల్ని పచ్చిమోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలలుగా ఈ తంతు కొనసాగుతుండడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లుగా వచ్చిన నివేదికలన్నీ కేవలం సృష్టించినవేనన్న వాస్తవం కళ్లుబైర్లు కమ్మేలా చేస్తోంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ దారుణం వివరాలివీ.. కాకినాడ జీజీహెచ్లో ఉన్న వీఆర్డీఎల్ ల్యాబ్కు రాష్ట్రస్థాయి గుర్తింపు ఉంది. రీసెర్చ్ సైంటిస్ట్ హోదాలో పనిచేసే ఓ ఉద్యోగి కాసులకు కక్కుర్తిపడి స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేసేందుకు రక్త నమూనాలు సేకరించి నకిలీ రిపోర్టులు ఇస్తున్నారు. వ్యాధి నిర్ధారణకు ఐజీఎం ఎలీసా (ఇమ్యునో గ్లోబలిన్ ఎం–ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే) టెస్ట్ చేస్తారు. ఇందుకు కాలంచెల్లిన రియేజంట్లు వినియోగించి రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. రెండు నెలలుగా ఇదే తంతు.. సాధారణంగా రక్త నమూనా ఇచ్చిన తర్వాత రక్తం నుంచి సీరంను వేరుచేసి ఎలీస్ ప్లేట్లో ఉన్న రంధ్రాల్లో వేస్తారు. అరగంట ఇంక్యుబేషన్ వ్యవధి చొప్పున కాంజ్యుగేట్, సబ్్రస్టేట్ రియేజంట్లు వేస్తారు. ఇవే వ్యాధిని నిర్ధారిస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న రియేజంట్లను కాలం చెల్లినవి వాడి రెండు నెలలుగా తోచిన రిపోర్టును రాసి పంపిస్తున్నారు. అంతేకాక.. స్టేట్ పోర్టల్లోనూ ఈ కాకిలెక్కలే అప్డేట్ చేస్తుండడంతో యావత్ రాష్ట్రం ఈ గణాంకాలనే నిజమని నమ్ముతోంది. రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలకు బురిడీ.. ఈ తప్పుడు నివేదికల ఆధారంగానే వైద్యం అందించడం, అందించకపోవడం జరుగుతోంది. రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విభాగాలను ఈ వీఆర్డీఎల్ ఉద్యోగి బురిడీ కొట్టించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రోగి వయసు, ప్రాంతం ఆధారంగా వ్యాధి సోకే అవకాశం ఉందా లేదా అన్న విషయాలపై ఓ అంచనాకు వచ్చేసి, నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇన్నాళ్లూ ఇచ్చిన పాజిటివ్, నెగటివ్ నివేదికలు కల్పితాలేనన్న విషయం బట్టబయలవడంతో వైద్యులే నిర్ఘాంతపోతున్నారు. ఎక్స్పైరీ రియేజంట్లు ఎందుకంటే.. కాలంచెల్లిన కిట్ల వినియోగం వెనుక రీసెర్చ్ సైంటిస్ట్దే కీలకపాత్ర. నెలన్నరకు పైగా జీజీహెచ్ స్టోర్స్ నుంచి రియేజంట్లు తీసుకోకుండా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఇచ్చిన అవకా«శాన్ని అడ్డుపెట్టుకుని బయటి నుంచే కొంటున్నట్లు ఆయన చూపిస్తున్నారు. అవీ కాలం చెల్లినవి తెస్తున్నారు. పొరుగు ప్రాంతాల వారు పనికిరాక పక్కన పడేసిన కిట్లు ఉచితంగా లభిస్తుండడంతో అవి తెచ్చి నాణ్యమైనవి కొంటున్నట్లు బిల్లులు డ్రా చేస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా.. ఒక్కో కిట్టు ధర కనీసం రూ.25 వేలు ఉంటుండగా రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ ఒక్క కిట్టుకీ లెక్కాపత్రం లేదు.. వైరాలజీ ల్యాబ్లో వినియోగిస్తున్న ఏ ఒక్క కిట్టుకీ తగిన లెక్కాపత్రం లేదు. ఈ తంతుపై పర్యవేక్షణ లోపించడంతో అక్కడ పనిచేస్తున్న రీసెర్చ్ సైంటిస్టుది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. కిట్లు కాలం చెల్లినవి కావడంవల్ల కోల్డ్ చెయిన్ను మెయింటైన్ (నిర్దిష్ట శీతల ప్రక్రియ) చేయకుండానే జీజీహెచ్లోని ల్యాబ్కు చేరుతున్నాయి. ఇలా అందుకుంటున్న వాటికి ఎటువంటి బిల్లులుగానీ సరఫరా రశీదులుగానీ ఉండడంలేదు.కోవిడ్, హెపటైటిస్ రియేజంట్లు కూడా..ఇక కోవిడ్, హెపటైటిస్ సహా పలు ప్రాణాంతక రోగాలను నిర్ధారించే రియేజంట్లు కూడా కాలం చెల్లినవే వినియోగిస్తున్నారు. మరణించిన వ్యక్తికి కోవిడ్ పరీక్ష చేయాల్సి వస్తే పరీక్ష చేయకుండా లేదా కాలంచెల్లిన కిట్లతో చేసి, రిపోర్టు ఇస్తున్నారు. పోస్ట్మార్టం చేస్తున్న ఫోరెన్సిక్ వైద్యులు, మృతుడి కుటుంబీకుల ప్రాణాలకూ ముప్పుతెస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎక్స్పైర్ అయిన హెపటైటిస్ కిట్లను డిసెంబరు 1న తీసుకొచ్చి, హెపటైటిస్ పరీక్షలు చేస్తున్నారు. ఎక్స్పైరీ రియేజంట్లను తేదీ ముద్రించి ఉన్న ట్యూబ్ల నుంచి స్టిక్కర్ లేని ఖాళీ ట్యూబ్ల్లోకి నింపి శ్వాసకోశ సంబంధిత ప్రాణాంతక కోవిడ్ సహా ఫ్లూ–ఏ, ఫ్లూ–బి, ఇన్ఫ్లూయెంజా, స్వైన్ ఫ్లూ, ఆర్ఎస్వీ–ఏ, ఆర్ఎస్వీ–బి, హ్యూమన్ రినోవైరస్ వంటి ముఖ్యమైన పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు.. రోగులు కూడా జీజీహెచ్ నివేదికలకు, బయట ప్రైవేటు ల్యాబ్ల నివేదికలకు తేడాలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఆ కేసులు నిజమా.. కాకిలెక్కలా?జిల్లా వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. వీఆర్డీఎల్ ల్యాబ్ గణాంకాల ఆధారంగానే ఈ వ్యాప్తిని నిర్ధారిస్తున్నారు. రీసెర్చ్ సైంటిస్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం 151 మందికి స్క్రబ్ టైఫస్ సోకిందని.. నవంబరు, డిసెంబరులో 45 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. అసలు ఈ లెక్కల సంగతి ఏంటని జీజీహెచ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవి నిజం లెక్కలా లేక కాకి లెక్కలా తెలీక గందరగోళంలో పడ్డారు. -
చూడ్డానికి చిన్నది.. కుట్టిందో ..!
-
బాబోయ్ పురుగు.. ఆంధ్రాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
-
మూడు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ అధికం
సాక్షి, అమరావతి: నల్లిని పోలిన స్క్రబ్ టైఫస్ కీటకం కుట్టడం ద్వారా సోకే జ్వరాలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది కాకినాడ, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 380కుపైగా కేసులు వెలుగు చూశాయి. విశాఖ, కాకినాడ జిల్లాల్లో 270కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల స్క్రబ్ టైఫస్ జ్వరంతో విజయనగరంలో ఒక మహిళ మృతిచెందింది. ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రంలో 736 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ నిర్ధారించింది.ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యశాఖ మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది. 2023లో 579 కేసులు, 2024లో 803 కేసులు బయటపడినట్టు వెల్లడించింది. డెంగీ, మలేరియా తరహాలో ఇది కూడా ఓ సాధారణ జ్వరం లాంటిదేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. శరీరంపై చిన్న నల్లమచ్చ కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైఫస్గా అనుమానించవచ్చన్నారు. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చని తెలిపారు. -
పొరుగునే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్! మన దగ్గరా అప్రమత్తత అవసరం!!
ఆంధ్రప్రదేశ్కు ΄పొరుగునే ఉన్న ఒడిశాలో కొంతకాలంగా ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్వైరవిహారం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్కడ కనిపిస్తున్న ఈ కేసులు గత రెండు మూడు వారాలుగా ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల ఒక్క సుందర్ఘర్ జిల్లాలోనే దాదాపుగా 200కు పైగా కేసులు రావడంతో పాటు, కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలూ అప్రమత్తం కావాల్సిన అవసరమున్న ఈ తరుణంలో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను ‘బుష్ టైఫస్’ అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియమ్ పేరు ‘ఓరియెంటియా సుసుగాముషి’. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ‘ఓరియెంటియా సుసుగాముషి’ అనే బ్యాక్టీరియమ్ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి చిగ్గర్ కుట్టాక... బ్యాక్టీరియమ్ బాధితుల రక్తంలోకి చేరితే... దాదాపు పది రోజుల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. చాలావరకు లక్షణాలు నిర΄ాయకరంగా ఉండవచ్చు. కానీ మొదటివారంలో దీన్ని గుర్తించకపోవడం లేదా సరైన చికిత్స ఇవ్వకపోవడం జరిగితే రెండోవారం నుంచి కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, కొన్ని సందర్భాల్లో మెదడు కూడా ప్రభావితమై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు దారితీయవచ్చు. నిర్ధారణ ఈ వ్యాధి నిర్ధారణకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు వెయిల్ ఫెలిక్స్ పరీక్ష, ఇన్డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ యాంటీబాడీ (ఐఎఫ్ఏ) పరీక్ష, ఇన్డైరెక్ట్ ఇమ్యూనో పెరాక్సైడేజ్ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ), పీసీఆర్ పరీక్షల ద్వారా దీన్ని నివారణ చేయవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కూడా దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో తగిన మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని నార్మల్ చేయవచ్చు. అందుకే అన్నన్ని ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ఉదాహరణకు మలేరియాలో ప్రోటోజోవన్ పారసైట్ రకాన్ని బట్టి కొన్ని రోజుల వ్యవధిలో జ్వరం మాటిమాటికీ వస్తుంటుంది. అదే వైరల్ జ్వరాలు చాలా తీవ్రంగా, ఎక్కువ ఉష్ణోగ్రతతో వస్తుంటాయి. ఈ లక్షణాలను బట్టి ఆయా జ్వరాలను గుర్తుబట్టి చికిత్స అందిస్తారు. దీనికి జ్వరం వచ్చిన తొలిదశలోనే సింపుల్గా ఇచ్చే యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తే చాలు. ఒకవేళ చికిత్స అందించకపోతే కొన్నిసార్లు ఇది లంగ్స్, గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థతోపాటు కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. నివారణ దీనికి టీకా ఏదీ అందుబాటులో లేదు. చిగ్గర్ కీటకాల కాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇవి పొలాల్లో, మట్టిలో నివసిస్తూ, అక్కడే గుడ్లు పెడతాయి. కాబట్టి చేలూ, పొలాల్లో నడిచే సమయాల్లో చెప్పులు వాడటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఫుల్ స్లీవ్ దుస్తులు, కాళ్లు పూర్తిగా కప్పేలాంటి దుస్తులు ధరించడం మేలు. ట్రెకింగ్ వంటి సాహసక్రీడల్లో పాల్గొనేవారు చిగ్గర్స్ ఉండే ప్రాంతాల్లోనే నడిచే అవకాశాలు ఎక్కువ. అందుకే... ట్రెక్కింగ్ చేసేవారు ఇప్పుడీ వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాలకు కొన్నాళ్లు ట్రెక్కింగ్కు వెళ్లకవడమే మంచిది. చికిత్స కొన్ని అరుదైన సందర్భాల్లో (అంటే కాంప్లికేషన్ వచ్చిన కేసుల్లో) మినహా... టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులతోనే ఇది అదుపులోకి వస్తుంది. కీమోప్రోఫిలాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే... అది కొంతవరకు దీని నివారణకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రాల నుంచి ఒడిశా వెళ్లాల్సినవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కిమో ప్రోఫిలాక్టిక్ తీసుకోవడం కొంత మేలు చేస్తుందని చెప్పవచ్చు. డా.. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
ఒడిశాలో 180 మందికి స్క్రబ్ టైఫస్
భువనేశ్వర్: కేరళలో నిఫా వైరస్ మాదిరిగానే ఒడిశాలో స్క్రబ్ టైఫస్ ప్రజలను వణికిస్తోంది. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య ఆదివారానికి 180కి చేరుకుంది. ఇప్పటివరకు సేకరించి పంపిన 59 శాంపిళ్లలో 11 స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా వెల్లడైనట్లు ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారన్నారు. సుందర్గఢ్, బర్గఢ్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని అన్నారు. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడం వల్ల ఇది సోకుతుంది. పొలాలు, అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని వారు తొందరగా ఈ వ్యాధికి గురవుతారు. జ్వరం, పురుగు కుట్టిన చోట చర్మంపై ఎశ్చర్ అనే నల్ల మచ్చ ఏర్పడటం దీని లక్షణాలు. -
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
భువనేశ్వర్: ఓ వైపు కేరళలో నిఫా వైరస్ భీతికొల్పుతుండగా.. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలవరపెడుతోంది. రోజురోజుకు స్క్రబ్ టైఫస్ కేసులు ఆ రాష్ట్రంలో పెరుగుతుండటం ప్రజలను ఆందోళన గురిచేస్తోంది. తాజాగా సుందర్గఢ్ జిల్లాలో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్క్రబ్ టైఫస్ బారిన పడినవారి సంఖ్య 180కి చేరింది. ప్రధానంగా సందర్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేసులతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 180కి చేరిందని జిల్లా వైద్య అధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ సోకినవారు ప్రధానంగా సుందర్గఢ్, బాలిశంకర ప్రాంతాలకు చెందినవారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుమానిత 50 షాంపిల్స్ను టెస్టుకు పంపించగా.. అందులో 11 కేసులు పాజిటివ్గా తేలినట్లు స్పష్టం చేశారు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్ను అరికట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు వైద్య బృందాలను పంపించారు. కావాల్సినన్ని మందులు, వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు తిరుగుతూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన -
స్క్రబ్ టైఫస్...టెర్రర్
స్క్రబ్ టైఫస్ వ్యాధి పేరు ఉంటేనే టెర్రర్ పుడుతోంది. మూడేళ్లుగా జిల్లాలో ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది. మలేరియా, డెంగీ వంటి దోమకాటు జ్వరాలతో పాటు తాజాతా టైఫస్ జ్వరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిజేస్తున్నాయి. ఈ తరహా జ్వరాల బారిన పడిన రోగులు జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి సైతం నగరానికి వచ్చి పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వర లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో జ్వరాలు విజృంభించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, పలువురికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించాయి. ఈ ఏడాది కూడా ఈ తరహా జ్వరంతో కొందరు పలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారని సమాచారం. అంతటి ప్రమాదకరమైన వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సైతం పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. జిల్లాలో సోకుతున్న ఈ వ్యాధిపై ప్రభుత్వ వైద్యులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్ టైఫస్ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాలు సైతం కోల్పోతారని అంటున్నారు. తొలుత అకస్మిక జ్వరంతో ప్రారంభమై క్రమేణా లివర్, కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు, రక్తనాళాలు దెబ్బతినడం, తెల్లరక్తకణాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. వ్యాధి ఎలా సోకుతుందంటే... దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కువుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. చెట్లు, పొలాల్లో ఉండే ‘త్సుట్సుగామూషి ’ అనే కీటకం కుట్టడం ద్వారా జ్వరం వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొందరికి వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుందని, మరికొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారు. త్సుట్సుగామూషి కీటకం కుట్టిన వారిలో జ్వరం అకస్మాత్తుగా రావడం, తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. కళ్లు తిరగడం, మగత, వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి వారి శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. ఈ వ్యాధిని నిర్దారించేందుకు ఎలిసా పరీక్షలు సైతం నగరంలో అందుబాటులో ఉన్నాయి. వ్యాధి ప్రభావం.... స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో అధిక జ్వరంతో పాటు, న్యూమోనైటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. అంతేకాకుండా కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం , తెల్లరక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందడం ద్వారా ఎలాంటి ప్రభావం చూపకుండా బయటపడొచ్చు. ఎవరికి ప్రమాదకరం.... స్క్రబ్ టైఫస్ వ్యాధి, మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా హెచ్ఐవీ రోగులకు సోకితే ప్రాణాంతకమే. చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రమాదకరంగా మారుతుంది. స్క్రబ్ టైఫస్ కేసులు వస్తున్నాయి స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన వారు మూడేళ్లుగా తమ ఆస్పత్రికి వస్తున్నారు. గత ఏడాది కూడా ఇద్దరు చిన్నారులకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. వ్యాధిని నిర్ధారించేందుకు ఎలీసా పరీక్ష„ý అందుబాటులో ఉంది. స్క్రబ్ టైఫస్ వచ్చిన వారికి కచ్చితమైన యాంటిబయోటిక్ ఇవ్వడం ద్వారా నివారించవచ్చు. వ్యాధిని ఆశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాది వచ్చిన వారి శరీరంపై నల్లటి మచ్చలు ఉండటాన్ని గుర్తించవచ్చు.డాక్టర్ పాతూరి వెంకట రామారావు,పీడియాట్రిక్ చీఫ్, ఆంధ్రా హాస్పిటల్స్ -
‘ప్రకాశం’లో కొత్తరకం జ్వరం, మహిళ మృతి
స్కబ్టైఫస్తో మహిళ మృతి కందుకూరు, న్యూస్లైన్ : ప్రకాశం జిల్లా సింగరాయకొండలో స్క్రబ్ టైఫస్ అనే కొత్తరకం జ్వరంతో మహిళ మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సింగరాయకొండకు చెందిన ఒక మహిళ అస్వస్థతకు గురై గత శనివారం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. ఆమెకు స్క్రబ్టైఫస్ (రికెట్సియల్) అనే కొత్తరకం జ్వరం సోకినట్లు నిర్ధారించి ఒంగోలు వెళ్లాలని డాక్టర్ ఖాదర్బాషా సూచించారు. ఒంగోలులో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. తమిళనాడు, కేరళ, జమ్మూకాశ్మీర్, ిహ మాచల్ప్రదేశ్, అసోం, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ జ్వరం అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. పేడపురుగును పోలి ఉండే టిక్స్మైట్ అనే పురుగు కుట్టడంవల్ల ఈ జ్వరం వస్తుందని తెలిపారు. ఆ పురుగు కుట్టిన ప్రాంతంలో ఎర్రగా కమిలి మధ్యలో నల్లగా కనిపిస్తుందని చెప్పారు. ఈ జ్వరం డెంగీకన్నా ప్రమాదకరమన్నారు. లక్షణాలు.. : ముందుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం ఉంటాయి. వ్యాధి ముదిరితే కామెర్లు, ఫిట్స్, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


