-
నాన్న ముందే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను: హీరోయిన్
సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రీసెంట్గా సైంధవ్ చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ తన నటనతో మెప్పించింది. ఆమె జీవితంలో రాసలీలలు, ప్రేమలో పడడం, మోసపోవడం వంటి సంఘటనలు మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే. తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ఎప్పుడూ అభిమానులకు టచ్లో ఉంటుంది. ఆమె నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా.. సింగర్గా కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2005లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ 'యుగానికి ఒక్కడు' సినిమాతో బాగా పాపులర్ అయింది ఆండ్రియా. ఆ తర్వాత తడాఖా, విజయ్తో మాస్టర్, కలహాసన్తో విశ్వరూపం, వెట్రిమారన్ దర్శకత్వం వహించిన వడచెన్నై వంటి చిత్రాల్లో ఆమె మెప్పించింది. నటిగానే కాకుండా గాయనిగా కూడా మెరిసిన ఆండ్రియా... వివాదాలకు కొదవలేదు. ఆమె అనిరుధ్తో ప్రేమ వ్యవహారం, సీనియర్ నటుడితో సన్నిహిత సంబంధం వంటి అనేక వివాదాల్లో చిక్కుకుంది. తాజగా ఒక ఇంటర్వ్యూలో చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది. 'అప్పట్లో నా వయస్సు 11 సంవత్సరాలు. నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను. ఆ సమయంలో నేను జీన్స్, టీ-షర్ట్ మాత్రమే ధరించాను. మా నాన్న కూర్చున్న సీటుకు కొంచెం దగ్గర్లోనే నేనూ కూర్చున్నాను. అప్పుడు ఎవరో లోపల చేయి వేసినట్లు అనిపించింది. నా షర్ట్లో ఎవరో చేయి పెట్టారన్న ఊహనే తట్టుకోలేకపోయాను. ఇక వెంటనే భయపడిపోయాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను.ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడానికి కారణం ఏమిటో అర్ధంకాక అప్పుడే ఏడుపు మొదలెట్టాను.' అని ఆండ్రియా చెప్పుకొచ్చంది. తన జీవితంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని ఆండ్రియా పంచుకున్న తర్వాత, అభిమానులు ఆమెను ఓదార్చారు. ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. -
ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు నిర్మాత కుమారుడు
డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్లు కూడా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్తో పాటు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు అంటించారు. బెంగళూరులో ఉన్న రఘు చరణ్ అట్లూరి గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హజరయ్యారు. ఆయనను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా, లిషీ సోదరి నటి కుషిత గచ్చిబౌలి స్టేషన్కు వచ్చి తన సోదరి లిషీ ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషీకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం. సందీప్, శ్వేతల ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని, ఇప్పటి వరకు వారు అందుబాటులోకి రాలేదని పోలీసులు పేర్కొంటున్నారు. విదేశాలకు నీల్! ఇదిలా ఉండగా సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్ బోయినపల్లి కుమారుడు నీల్ (ఏ9) విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆయనను కొకైన్ తీసుకున్నట్లు అనుమానితుల జాబితాలో చేర్చడంతో దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు చెపుతున్నారు. మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో మరో పెడ్లర్, పాతబస్తీకి చెందిన మీర్జా వాహెద్ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్ను కూడా అరెస్ట్ చేశారు. దీంతో డ్రగ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. -
ఓటీటీలో సంక్రాంతి సినిమా హవా.. ఒక్క రోజులోనే టాప్లో ట్రెండింగ్!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతికి థియేటర్ల వద్ద పోటీ నెలకొనడంతో జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్లోనూ ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ముందు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండో రోజే టాప్లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీని వెనక్కి నెట్టిన కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ ప్లేస్కు దూసుకెళ్లింది. మొదటిస్థానంలో కెప్టెన్ మిల్లర్ ట్రెండ్ అవుతుండగా.. రెండోస్థానంలో సైంధవ్, మూడో ప్లేస్లో సల్మాన్ ఖాన్ టైగర్-3 కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించారు. భారీ పీరియాడికల్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 9 సినిమాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారంలో చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. తెలుగులో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బిగ్బాస్ సోహైల్ సినిమా 'బూట్ కట్ బాలరాజు' సందడి చేయనున్నాయి. వీటితో పాటు అభినవ్ గోమటం నటించిన కిస్మత్, యశ్ పూరి చిత్రం హ్యాపీ ఎండిగ్, మరో చిత్రం గేమ్ ఆన్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో ఈ వారంలో చిన్న సినిమాల హడావుడి ఉండనుంది. దీంతో ఈ వీకెండ్లో ఓటీటీ వైపు సినీ ప్రియులు చూసేస్తున్నారు. ఈ వచ్చే మూడు రోజుల్లో ఏయే సినిమాలు వస్తున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఓటీటీ సినిమాలు కూడా సిద్ధమైపోయాయి. వీటిలో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మిస్ ఫర్ఫెక్స్ వెబ్ సిరీస్, మరో సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎల్ఎస్డీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అయితే వెంకటేశ్ నటించిన సైంధవ్ కూడా స్ట్రీమింగ్కు వస్తుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరో ఈ వీకెండ్ ఓ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే నెట్ఫ్లిక్స్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 01 లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 02 ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02 అమెజాన్ ప్రైమ్ డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 02 మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 02 సైంధవ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 02 (రూమర్ డేట్) హాట్స్టార్ మిస్ ఫెర్ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 02 సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02 మనోరమ మ్యాక్స్ ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 02 ఎమ్ఎక్స్ ప్లేయర్ ఎల్ఎస్డీ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి-2 -
అఫీషియల్: మూడు వారాల్లోనే ఓటీటీకి సైంధవ్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది సంక్రాంతి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు సందడి చేశాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మిగిలిన మూడు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలు నెల రోజుల తర్వాతే ఓటీటీ వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. (ఇది చదవండి: సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?) శైలేశ్ కొలను డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రకటించింది. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement