-
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్! వీడియో వైరల్
ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మను రిటర్న్ క్యాచ్తో ఛేజ్ పెవిలియన్కు పంపాడు. తన క్యాచ్తో మ్యాచ్ స్వరూపాన్నే ఛేజ్ మార్చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అదిలోనే ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన జోషఫ్ బౌలింగ్లో తిలక్ వర్మ.. ఏకంగా 19 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో తిలక్ను అడ్డుకునేందుకు విండీస్ కెప్టెన్ స్పిన్నర్ ఛేజ్ను తీసుకువచ్చాడు. అస్సలు ఊహించలేదు.. అయితే రోవ్మన్ పావెల్ నమ్మకాన్ని ఛేజ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లోనే సంచలన ఫామ్లో ఉన్న తిలక్ను పెవిలియన్కు పంపాడు. 7 ఓవర్ వేసిన ఛేజ్ బౌలింగ్లో ఐదో బంతిని వర్మ లాంగ్ఆఫ్ దిశగా ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో ఛేజ్ అద్భుతంగా డైవ్చేస్తూ రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. అయితే అది బంప్బాల్ అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్కు తాకి నేరుగా ఛేజ్ చేతికి వెళ్లి నట్లు తేలింది. దీంతో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ నిరాశతో మైదానాన్ని వీడాడాడు. ఛేజ్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సిరీస్ను 3-2 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Roston Chase that was an absolutely fantastic catch! pic.twitter.com/tfa7X55Ttm — Q Sports Sport Reporter🇹🇹 (@yannickatnite) August 13, 2023 -
సెంచరీ కొట్టకపోతే వేస్ట్!
సౌతాంప్టాన్: త్వరలో ఇంగ్లండ్తో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్లో కనీసం సెంచరీ కొట్టాల్సిందేనని వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోస్టన్ ఛేజ్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో బ్యాటింగ్పై సీరియస్గా దృష్టిపెట్టిన ఛేజ్.. ఆ జట్టుపై వారి దేశంలో సెంచరీ చేయాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు. ఇప్పటివరకూ 32 టెస్టులు ఆడి ఐదు సెంచరీ సాయంతో 1,695 పరుగులు సాధించిన ఛేజ్.. ఒక ఉన్నతస్థాయి బ్యాట్స్మన్గా ఎదగడానికి ఇంగ్లండ్తో సిరీస్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ‘ ఇంగ్లండ్లో సెంచరీ చేయడమంటే అది కచ్చితంగా ప్రత్యేకంగానే నిలుస్తుంది. దాంతో కనీసం సెంచరీ కొట్టడంపై దృష్టి పెట్టా. ఒకవేళ సెంచరీ చేయకపోతే మాత్రం అది నాలో నిరాశనే మిగులుస్తుంది. ఇంగ్లండ్లో ఒక్క సెంచరీ చేస్తే చాలు. ఇక్కడ శతకం సాధిస్తే ఆల్ రౌండర్గా నాకు మరింత ప్రూవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు బ్యాట్స్మన్గా రేటింగ్ కూడా పెరుగుతుంది. (‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!) మా మధ్య ఒక మంచి సిరీస్ జరుగుతుందని, అందులో నేను బ్యాట్తో మెరవాలని కోరుకుంటున్నా. సాధ్యమైనన్ని పరుగులు సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం మా టాపార్డర్ అంత బాలేదు. మా జట్టులోని సభ్యులు 30, అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడటంతో వారి అనుభవం పనికొస్తుంది. మేము ఎప్పుడూ మెరుగు పడటంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈ సిరీస్లో కరీబియన్కు చెందిన జోఫ్రా ఆర్చర్తో పోటీ పడాలని విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నా’ అని ఛేజ్ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్తో సిరీస్కు గురించి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెనాల్ గాబ్రియెల్ మాట్లాడాడు. ప్రధానంగా గతేడాది కరీబియన్ దీవుల్లో జోరూట్ను ‘ నీకు అబ్బాయిలు ఇష్టమా’ అని స్లెడ్జింగ్ చేసి నిషేధానికి గురైన అంశాన్ని ప్రస్తావించాడు. అది ఒక ముగిసిన అధ్యాయమని, ఆ తరహా కామెంట్లు ఇక చేయదలుచుకోలేదన్నాడు. వ్యక్తిగత పరిహాసంలో భాగంగానే రూట్ను ఆ రకంగా స్లెడ్జ్ చేసినట్లు తెలిపాడు. ఇంగ్లండ్తో సిరీస్పై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఒకవేళ తనకు తుది జట్టులో చోటు దక్కితే ఓవరాల్గా ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానన్నాడు. జూలై8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టుకు సౌతాంప్టాన్ వేదిక కానుంది. -
ఛేజ్కు 8 వికెట్లు: విండీస్ జయభేరి
బ్రిడ్జ్టౌన్: వెస్టిండీస్ ఆఫ్స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ (8/60) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ను తిప్పేశాడు. విండీస్కు తొలి టెస్టులో భారీ విజయాన్నందించాడు. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 381 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 628 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 56/0తో నాలుగోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 246 పరుగుల వద్ద ఆలౌటైంది. 85 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన ఇంగ్లండ్ 161 పరుగుల వ్యవధిలో మిగతా 9 వికెట్లను కోల్పోయింది. రోరి బర్న్స్ (84; 15 ఫోర్లు) అర్ధసెంచరీ తర్వాత మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. స్టోక్స్ (34), బెయిర్స్టో (30), బట్లర్ (26), కెప్టెన్ రూట్ (22) రెండంకెల స్కోరు చేశారు. జట్టు స్కోరు 200 దాటాక... ఛేజ్ స్పిన్కు మోకరిల్లిన ఇంగ్లండ్ వడివడిగా వికెట్లను కోల్పోయింది. 217/6 స్కోరు వద్ద టీ విరామానికెళ్లిన ఇంగ్లండ్ తర్వాత 10 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయింది. గాబ్రియెల్, జోసెఫ్ చెరో వికెట్ తీశారు. వీరోచిత ద్విశతకం చేసిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్లో విండీస్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు ఈ నెల 31 నుంచి నార్త్సౌండ్లో జరుగుతుంది. -
రెండో టెస్ట్: పుంజుకున్న వెస్టిండీస్ జట్టు
-
తొలిరోజు విండీస్దే
సాక్షి, హైదరాబాద్: తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత పర్యాటక వెస్టిండీస్ జట్టు పుంజుకుంది. శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్మెన్ తొలుత తడబడినా.. చివరికి నిలబడి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. టీమిండియాతో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోస్టన్ ఛేజ్ (98 బ్యాటింగ్), కెప్టెన్ హోల్డర్(52) రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి కరీబియన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్లు చెరో మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక్క వికెట్ సాధించాడు. రాణించిన కుల్దీప్, ఉమేశ్ టాస్ గెలిచిన విండీస్ సారథి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అరంగేట్ర టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ పది బంతులేసిన అనంతరం గాయపడటంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను సారథి విరాట్ కోహ్లి రంగంలోకి దింపాడు. అశ్విన్ వచ్చీ రాగనే ఓపెనర్ పావెల్(22)ను వెనక్కి పంపించారు. మరో వైపు ఆచితూచి ఆడుతున్న బ్రాత్వైట్(14)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కుల్దీప్ దెబ్బకి విండీస్ మిడిలార్డర్ మరోసారి విఫలమవ్వడంతో 113 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు పేసర్ ఉమేశ్ యాదవ్ వీలు చిక్నిప్పుడల్లా వికెట్లు తీస్తూ కరీబియన్ జట్టుపై ఒత్తిడి పెంచాడు. చేజ్, హోల్డర్ల పోరాటం అదుర్స్ విండీస్ తొలి రోజు నిలబడిందంటే క్రెడిట్ మొత్తం రోస్టన్ చేజ్దే. ఓ వైపు వికెట్లు పడుతున్న పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. వికెట్ కీపర్ డౌరిచ్(30)తో కలిసి ఆరో వికెట్కు 69 పరుగులు జోడించాడు. డౌరిచ్ ఔటైన అనతంరం క్రీజులోకి వచ్చిన సారథి జాసన్ హోల్డర్(52) చేజ్కు జతకలిశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ ఇరువురూ అర్థశతకాలు సాధించారు. ప్రమాదకరంగా మారుతున్న హోల్డర్ను ఉమేశ్ ఔట్ చేశాడు. దీంతో ఏడో వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆటముగిసే సమయానికి ఛేజ్కు తోడుగా దేవేంద్ర బిషూ(2 బ్యాటింగ్)క్రీజ్లో ఉన్నాడు. చదవండి: హైదరాబాద్ టెస్ట్: శార్ధుల్ ఠాకుర్ అరంగేట్రం అరంగేట్రం అంతలోనే గాయం!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
అవినీతిలో ‘ఆది’పత్యం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement