breaking news
Roston Chase
-
బాబర్ ఆజమ్ డకౌట్.. పాక్ను చిత్తు చేసిన విండీస్
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ 31, హసన్ నవాజ్ 36 (నాటౌట్), సైమ్ అయూబ్ 23, అబ్దుల్లా షఫీక్ 26, మొహమ్మద్ రిజ్వాన్ 16, సల్మాన్ అఘా 9, మొహమ్మద్ నవాజ్ 5, షాహీన్ అఫ్రిది 11 (నాటౌట్) పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ డకౌటయ్యాడు.విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. జెదియా బ్లేడ్స్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (45), రోస్టన్ ఛేజ్ (49 నాటౌట్), షాయ్ హోప్ (32), జస్టిన్ గ్రీవ్స్ (26 నాటౌట్) విండీస్ గెలుపులో తలో చేయి వేశారు. బ్రాండన్ కింగ్ (1), ఎవిన్ లూయిస్ (7), కీసీ కార్టీ (16) నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్ తలో 2 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. ఈ సిరీస్లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనుంది. -
వెస్టిండీస్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్ కైవసం
వెస్టిండీస్తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా (WI vs AUS 2nd Test) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 133 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కంగారూ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా వెస్టిండీస్కు వెళ్లింది. రెండో టెస్టులోనూఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టెస్టు సిరీస్ ఆరంభం కాగా.. బార్బడోస్లో మొదటి టెస్టు జరిగింది. ఇందులో ఆరంభంలో అదరగొట్టిన విండీస్.. ఆ తర్వాత చెత్త ప్రదర్శనతో 159 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా గ్రెనెడా వేదికగా రెండో టెస్టులోనూ వెస్టిండీస్కు భంగపాటే ఎదురైంది.సెయింట్ జార్జెస్ మైదానంలో మరోసారి బ్యాటర్ల వైఫల్యం కారణంగా విండీస్... ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం నాటి ఆట సందర్భంగా.. ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది వెస్టిండీస్.143 పరుగులకు ఆలౌటైఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్వైట్ (7), జాన్ కాంప్బెల్ (0)తో పాటు వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (10) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ (14)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ షాయీ హోప్ (17), జస్టిన్ గ్రీవ్స్ (2) చేతులెత్తేశారు.ఇక కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (34) విండీస్ రెండో ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్ 13, షమార్ జోసెఫ్ 24, జేడన్ సీల్స్ 8 పరుగులు చేశారు. ఆండర్సన్ ఫిలిప్ 11 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లో 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైన విండీస్.. 133 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ (Nathon Lyon) మూడేసి వికెట్లు పడగొట్టగా... జోష్ హాజిల్వుడ్ (Josh Hazlewood) రెండు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బ్యూ వెబ్స్టర్ చెరో వికెట్ కూల్చారు. ఇక అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 221/7తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 71.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (71; 7 ఫోర్లు, 1 సిక్స్), కామెరాన్ గ్రీన్ (52; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఈ సిరీస్లో చివరిదైన మూడో టెస్టు ఈనెల 13 నుంచి కింగ్స్టన్లో జరుగుతుంది. వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు👉వేదిక: సెయింట్ జార్జెస్, గ్రెనెడా👉టాస్: ఆస్ట్రేలియా- తొలుత బ్యాటింగ్👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 286👉విండీస్ తొలి ఇన్నింగ్స్: 253👉ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 243👉విండీస్ రెండో ఇన్నింగ్స్: 143👉ఫలితం: 133 పరుగుల తేడాతో విండీస్పై ఆసీస్ గెలుపు.. సిరీస్ 2-0తో కైవసం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలెక్స్ క్యారీ (63, 30 రన్స్).చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్ -
WI vs AUS: చెత్త అంపైరింగ్!.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
వెస్టిండీస్- ఆస్ట్రేలియా (West Indies vs Australia, 1st Test) మధ్య బార్బడోస్ వేదికగా తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. అద్భుత బౌలింగ్తో కంగారూల పని పట్టిన విండీస్.. తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌట్ చేసింది. కరేబియన్ పేసర్లలో జేడన్ సీల్స్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. షమార్ జోసెఫ్ నాలుగు వికెట్లు కూల్చాడు. ఇక జస్టిన్ గ్రీవ్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. 190 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించి పది పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ షాయీ హోప్ (48) మాత్రమే మెరుగ్గా రాణించారు.అయితే, వీరిద్దరు అవుటైన తీరు వివాదానికి దారి తీసింది. క్రీజులో పాతుకుపోయిన రోస్టన్, హోప్లు థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే..రోస్టన్ 44 పరుగుల వద్ద ఉండగా.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ (లెగ్ బిఫోర్ వికెట్) అయినట్లు ఫీల్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, రోస్టన్ వెంటనే రివ్యూకు వెళ్లాడు. ఇందులో బ్యాట్ ముందుగా బ్యాట్ను తాకినట్లు తేలింది. అల్ట్రాఎడ్జ్ స్పైక్ కూడా వచ్చింది. కానీ థర్డ్ అంపైర్, సౌతాఫ్రికాకు చెందిన ఆడ్రియాన్ హోల్డర్స్టాక్ మాత్రం రోస్టన్ను అవుట్గా తేల్చాడు.Bat first or pad first? 🤔Roston Chase given OUT… but UltraEdge had a spike.Should that have been given out?#WIvsAUS pic.twitter.com/DaitLZhXPm— FanCode (@FanCode) June 26, 2025 అనంతరం.. షాయీ హోప్ విషయంలోనూ థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. హోప్ ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అందుకున్నట్లు కనిపించగా.. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, దీనిపై విండీస్ రివ్యూకు వెళ్లింది. రీప్లేలో చూడగా.. బంతి క్యారీ చేతుల్లోంచి జారీ నేలను తాకినట్లు కనిపించింది. అయితే, అతడు అంతలోనే దానిని మళ్లీ చేతిలోకి తీసుకున్నట్లు కనిపించింది. అయినప్పటికీ అది ఫెయిర్ క్యాచ్ అని తేలుస్తూ థర్డ్ అంపైర్ హోప్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో విండీస్ శిబిరంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కోచ్ డారెన్ సామీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోస్టన్ ఛేజ్, షాయీ హోప్ అవుటైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ‘‘చెత్త అంపైరింగ్!.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’’అంటూ థర్డ్ అంపైర్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. Caught or did the ball touch the ground? 🫣Windies are furious with that decision. What's your call? ☝️ or ❌#WIvAUS pic.twitter.com/6evBQGk7vq— FanCode (@FanCode) June 26, 2025ఇక విండీస్ ఆలౌట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 33 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. తద్వారా 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రవిస్ హెడ్ 13, బ్యూ వెబ్స్టర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
ఆసీస్కు చుక్కలు చూపిస్తున్న విండీస్.. ఓటమి తప్పదా?
బ్రిడ్జ్టౌన్ వేదికగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. రెండో రోజులో ఆటలో కూడా బార్బడోస్ పిచ్పై బౌలర్లు పండగ చేసుకున్నారు. 57/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 190 పరుగులకే కుప్పకూలింది. దీంతో కేవలం 10 పరుగుల ఆధిక్యం మాత్రమే విండీస్కు లభించింది.విండీస్ బ్యా టర్లలో షై హోప్ (91 బంతుల్లో 48; 5 ఫోర్లు), కెప్టెన్ చేజ్ (108 బంతుల్లో 44; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. బ్రాత్వైట్ (4), క్యాంప్బెల్ (7), కార్టీ (20), వారికన్ (0), బ్రాండన్ కింగ్ (26) విఫలమయ్యారు. ఆఖర్లో అల్జారీ జోసెఫ్ (20 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు చేశాడు. . ఆ్రస్టేలియా బౌలర్లలో స్టార్క్ 3, హాజల్వుడ్, కమిన్స్, వెబ్స్టర్ తలా 2 వికెట్లు పడగొట్టారు.ఆసీస్ మళ్లీ అదే తీరు..తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విఫలమైన కంగారులు.. రెండో ఇన్నింగ్స్లో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. 10 పరుగుల వెనకంజతో సెకెండ్ ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆసీస్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.క్రీజులో ట్రావిస్ హెడ్(13), వెబ్స్టెర్(19) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు ఆటలో ఆసీస్కు తొలి సెషన్ చాలా కీలకం. ఈ సెషన్లో కమ్మిన్స్ సేన వికెట్లు కోల్పోతే స్వల్ప ఆధిక్యానికే పరిమితమవుతోంది.ఇక విండీస్ బౌలర్లలో ఇప్పటివరకు జైడన్ సీల్స్, జోషఫ్, అల్జారీ జోషఫ్, గ్రీవ్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌటైంది. మొత్తంగా రెండో రోజు ఆటలో 10 వికెట్లు నేలకూలాయి.చదవండి: భారత్-ఇంగ్లండ్ వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు తదితర వివరాలు ఇవే -
వెస్టిండీస్కు ‘భారీ’ షాకిచ్చిన ఐర్లాండ్.. చిత్తు చిత్తుగా ఓడించి..
వెస్టిండీస్కు ఐర్లాండ్ క్రికెట్ జట్టు భారీ షాకిచ్చింది. విండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ (ODI Series)ను ఘనంగా ఆరంభించింది. డబ్లిన్ వేదికగా బుధవారం జరిగిన తొలి పోరులో ఐర్లాండ్ వెస్టిండీస్ను ఏకంగా 124 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడే నిమిత్తం వెస్టిండీస్ ఐర్లాండ్లో పర్యటిస్తోంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం తొలి వన్డే జరిగింది. ‘ది విలేజ్’ మైదానంలో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 303 పరుగులు చేసింది.ఓపెనర్లలో ఆండీ బాల్బిర్నీ (138 బంతుల్లో 112; 9 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (54; 6 ఫోర్లు, 2 సిక్స్లు).. నాలుగో నంబర్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ (56; 6 ఫోర్లు) అర్ధశతకాలు బాదారు. ఇక విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 34.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. రోస్టన్ చేజ్ (55; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్కార్తీ 4 వికెట్లు తీశాడు. సెంచరీ హీరో బాల్బిర్నీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో వన్డే జరగనుంది. కాగా ఓవరాల్గా వెస్టిండీస్పై ఐర్లాండ్కిది నాలుగో విజయం కావడం విశేషం. ఇదీ చదవండి: విండీస్తో సిరీస్కు ముందు ఇంగ్లండ్కు షాక్లండన్: ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 29న ఎడ్జ్బాస్టన్లో జరిగే తొలి వన్డేతో మూడు మ్యాచ్ల సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన ఆర్చర్కు కుడిచేతి బొటనవేలికి గాయమైంది. లీగ్ వారం వాయిదా పడగానే స్వదేశానికి చేరుకున్న అతను తిరిగి ఐపీఎల్ పునఃప్రారంభమైనప్పటికీ గాయం కారణంగానే భారత్కు రాలేకపోయాడు.గాయపడిన అతని పరిస్థితిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, రెండు వారాల తర్వాత మరోసారి గాయం తీవ్రతను సమీక్షిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే ఆర్చర్కు గాయమవడం... జట్టుకు దూరమవడం ఇదేం కొత్త కాదు. సుదీర్ఘకాలంగా అతను మోచేతి గాయంతో సతమతమయ్యాడు. పలుమార్లు సర్జరీలు కూడా జరిగాయి.తర్వాత వెన్నెముక గాయంతో చాన్నాళ్ల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అమెరికా, కరీబియన్లు ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్తో పునరాగమనం చేశాడు. ఈ ఏడాది పాక్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అతని స్థానంలో లాంకషైర్కు చెందిన లెఫ్టార్మ్ సీమర్ ల్యూక్ వుడ్ను జట్టులోకి తీసుకున్నారు. ఇదివరకే టీ20 జట్టుకు ఎంపికైన వుడ్కు ఇప్పుడు వన్డే జట్టులోనూ స్థానం దక్కింది. 2022–23 సీజన్లో రెండు వన్డేలాడిన ల్యూక్ వుడ్ ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. చదవండి: IPL 2025: ‘ప్లే ఆఫ్స్’కు ముంబై█▓▒▒░░░Score update░░░▒▒▓█What a hundred from Balbo 👏👏👏▪️Ireland 256-3 (44 overs)👀 WATCH: TNT Sport 2 (411)📝 SCORECARD: https://t.co/9cwPX120LU#BackingGreen #TokenFi @solar_failte☘️🏏 pic.twitter.com/Sgvq0EOBDp— Cricket Ireland (@cricketireland) May 21, 2025 -
వెస్టిండీస్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్?
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ రోస్టన్ చేజ్ ఎంపికానున్నట్లు తెలుస్తోంది. విండీస్ టెస్టు కెప్టెన్గా వైదొలిగిన క్రెయిగ్ బ్రాత్వైట్ స్ధానాన్ని చేజ్ భర్తీ చేయనున్నాడు. ఈ ఏడాది జూన్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ నుంచి కెప్టెన్గా తన ప్రయాణాన్ని చేజ్ ప్రారంభించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. చేజ్ నియమాకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.2016లో విండీస్ తరపున అరంగేట్రం చేసిన చేజ్.. తన కెరీర్లో ఇప్పటివరకు 49 టెస్టులు ఆడాడు. అందులో 26.33 సగటుతో 2,000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 85 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.రోస్టన్ చేజ్ ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో కలిసి ఐర్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం చేజ్ సిద్దమవుతున్నాడు. ఆ తర్వాత ఈ నెల ఆఖరిలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో విండీస్ తలపడనుంది.అనంతరం జూన్ మధ్యలో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియాతో కరేబియన్లు ఢీకొట్టనున్నారు. ఈ సిరీస్ డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భాగంగా జరగనుంది. కాగా విండీస్ టెస్టు కెప్టెన్సీ బ్రాత్వైట్ ఈ ఏడాది మార్చిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.చదవండి: వారి త్యాగాల వల్లే ఇలా ఉన్నా.. అరుదైన గౌరవం.. రోహిత్ శర్మ భావోద్వేగం🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨Roston Chase has been named the new West Indies Test captain, taking over from Kraigg Brathwaite, who stepped down from the role in March this year. 🏏🌴 #TestCricket #WestIndies #Sportskeeda pic.twitter.com/O74YrAb7EB— Sportskeeda (@Sportskeeda) May 16, 2025 -
దంచికొట్టిన రోస్టన్, జోన్స్.. కింగ్స్దే సీపీఎల్ టైటిల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024 చాంపియన్గా సెయింట్ లూసియా కింగ్స్ జట్టు అవతరించింది. గయానా అమెజాన్ వారియర్స్తో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. లూసియా కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ రోస్టన్ ఛేజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఆకట్టుకోలేకపోయిన బ్యాటర్లుగయానా వేదికగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున సెయింట్ లూసియా కింగ్స్- గయానా అమెజాన్ వారియర్స్ మధ్య సీపీఎల్ టైటిల్ పోరు జరిగింది. టాస్ గెలిచిన కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.దెబ్బ కొట్టిన నూర్ అహ్మద్వారియర్స్ బ్యాటర్లలో టెయిలెండర్ ప్రిటోరియస్ 25 పరుగులతో టాప్ స్కోర్గా నిలవడం గమనార్హం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ షాయీ హోప్ 22 పరుగులు సాధించాడు. ఇక కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ నూర్ అహ్మద్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు.ఓపెనర్ మొయిన్ అలీ(14), హిట్టర్ షిమ్రన్ హెట్మెయిర్(11) రూపంలో కీలక వికెట్లు తీసి.. వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. కింగ్స్ జట్టులోని మిగిలిన బౌలర్లలో ఖారీ పియరీ, మాథ్యూ ఫోర్డ్, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వీస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.దంచికొట్టిన రోస్టన్, జోన్స్ఇక వారియర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింఘ్స్ 18.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ దంచికొట్టడంతో విజయం సాధ్యమైంది. ఓపెనర్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(21) ఫర్వాలేదనిపించగా.. జాన్సన్ చార్ల్స్(7) నిరాశపరిచాడు. వన్డౌన్ బ్యాటర్ టిమ్ సిఫార్ట్ 10 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేశాడు.ఇలాంటి దశలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రోస్టన్ ఛేజ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 39 పరుగులతో దుమ్ములేపాడు. ఐదో స్థానంలో వచ్చిన ఆరోన్ జోన్స్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు బాది 48 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి అజేయంగా నిలిచి.. లూసియా కింగ్స్ను విజయతీరాలకు చేర్చారు. PC: SLK Xవిజేతల జాబితా ఇదేకాగా సీపీఎల్లో లూసియా కింగ్స్కు ఇదే మొట్టమొదటి టైటిల్. ఇక 2013లో వెస్టిండీస్ వేదికగా మొదలైన ఈ టీ20 టోర్నీలో జమైకా తలైవాస్ అరంగేట్ర విజేతగా నిలిచింది. తర్వాత వరుసగా బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్స్టీల్, జమైకా తలైవాస్, ట్రింబాగో నైట్ రైడర్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, సెయింట కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తలైవాస్, గయానా అమెజాన్ వారియర్స్.. తాజాగా సెయింట్ లూసియా కింగ్స్ ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ The wait is over 🙌 The Saint Lucia Kings are CPL Champions 🇱🇨🏆#CPL24 #CPLFinals #SLKvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/nqVbnilsAH— CPL T20 (@CPL) October 7, 2024 -
T20 WC: విండీస్ ఓపెనర్ విధ్వంసం.. అమెరికా చిత్తు
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది. సొంతగడ్డపై జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లలో.. గ్రూప్-2లో భాగమైన వెస్టిండీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్ జట్టు.. అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్.. అమెరికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.చెలరేగిన బౌలర్లుఅయితే, విండీస్ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లలో స్టీవెన్ టేలర్(2) పూర్తిగా నిరాశపరచగా.. ఆండ్రీస్ గౌస్ 29 పరుగులతో రాణించాడు. వన్డౌన్ బ్యాటర్ ఎన్ఆర్ కుమార్ 20 రన్స్తో ఫర్వాలేదనిపించాడు.మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు ఆండ్రీ రసెల్ మూడు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ చేజ్(3/19) పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా.. గుడకేశ్ మోటికి ఒక వికెట్ దక్కింది.ఆకాశమే హద్దుగా ఇక లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫక్షర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 15, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. షాయీ హోప్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.విండీస్ సెమీస్ ఆశలు సజీవంషాయీ హోప్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ నెట్ రన్రేటు(+1.814)ను భారీగా పెంచుకుంది. గ్రూప్-2 టాపర్ సౌతాఫ్రికా(4 పాయింట్లు, నెట్ రన్టేరు +0.625), ఇంగ్లండ్(2 పాయింట్లు, నెట్ రన్రేటు +0.412)ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు.. అమెరికా ఆడిన రెండింట ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... View this post on Instagram A post shared by ICC (@icc) -
సూపర్ క్యాచ్.. జడేజాను గుర్తు చేసిన విండీస్ ఆటగాడు! వీడియో
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్సైడ్ ఆఫ్దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్లో ఎన్నో మెరుపు క్యాచ్లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు అదుకున్నారు.వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్! వీడియో వైరల్
ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మను రిటర్న్ క్యాచ్తో ఛేజ్ పెవిలియన్కు పంపాడు. తన క్యాచ్తో మ్యాచ్ స్వరూపాన్నే ఛేజ్ మార్చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అదిలోనే ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన జోషఫ్ బౌలింగ్లో తిలక్ వర్మ.. ఏకంగా 19 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో తిలక్ను అడ్డుకునేందుకు విండీస్ కెప్టెన్ స్పిన్నర్ ఛేజ్ను తీసుకువచ్చాడు. అస్సలు ఊహించలేదు.. అయితే రోవ్మన్ పావెల్ నమ్మకాన్ని ఛేజ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లోనే సంచలన ఫామ్లో ఉన్న తిలక్ను పెవిలియన్కు పంపాడు. 7 ఓవర్ వేసిన ఛేజ్ బౌలింగ్లో ఐదో బంతిని వర్మ లాంగ్ఆఫ్ దిశగా ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో ఛేజ్ అద్భుతంగా డైవ్చేస్తూ రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. అయితే అది బంప్బాల్ అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్కు తాకి నేరుగా ఛేజ్ చేతికి వెళ్లి నట్లు తేలింది. దీంతో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ నిరాశతో మైదానాన్ని వీడాడాడు. ఛేజ్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సిరీస్ను 3-2 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Roston Chase that was an absolutely fantastic catch! pic.twitter.com/tfa7X55Ttm — Q Sports Sport Reporter🇹🇹 (@yannickatnite) August 13, 2023 -
సెంచరీ కొట్టకపోతే వేస్ట్!
సౌతాంప్టాన్: త్వరలో ఇంగ్లండ్తో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్లో కనీసం సెంచరీ కొట్టాల్సిందేనని వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోస్టన్ ఛేజ్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో బ్యాటింగ్పై సీరియస్గా దృష్టిపెట్టిన ఛేజ్.. ఆ జట్టుపై వారి దేశంలో సెంచరీ చేయాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు. ఇప్పటివరకూ 32 టెస్టులు ఆడి ఐదు సెంచరీ సాయంతో 1,695 పరుగులు సాధించిన ఛేజ్.. ఒక ఉన్నతస్థాయి బ్యాట్స్మన్గా ఎదగడానికి ఇంగ్లండ్తో సిరీస్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ‘ ఇంగ్లండ్లో సెంచరీ చేయడమంటే అది కచ్చితంగా ప్రత్యేకంగానే నిలుస్తుంది. దాంతో కనీసం సెంచరీ కొట్టడంపై దృష్టి పెట్టా. ఒకవేళ సెంచరీ చేయకపోతే మాత్రం అది నాలో నిరాశనే మిగులుస్తుంది. ఇంగ్లండ్లో ఒక్క సెంచరీ చేస్తే చాలు. ఇక్కడ శతకం సాధిస్తే ఆల్ రౌండర్గా నాకు మరింత ప్రూవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు బ్యాట్స్మన్గా రేటింగ్ కూడా పెరుగుతుంది. (‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!) మా మధ్య ఒక మంచి సిరీస్ జరుగుతుందని, అందులో నేను బ్యాట్తో మెరవాలని కోరుకుంటున్నా. సాధ్యమైనన్ని పరుగులు సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం మా టాపార్డర్ అంత బాలేదు. మా జట్టులోని సభ్యులు 30, అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడటంతో వారి అనుభవం పనికొస్తుంది. మేము ఎప్పుడూ మెరుగు పడటంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈ సిరీస్లో కరీబియన్కు చెందిన జోఫ్రా ఆర్చర్తో పోటీ పడాలని విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నా’ అని ఛేజ్ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్తో సిరీస్కు గురించి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెనాల్ గాబ్రియెల్ మాట్లాడాడు. ప్రధానంగా గతేడాది కరీబియన్ దీవుల్లో జోరూట్ను ‘ నీకు అబ్బాయిలు ఇష్టమా’ అని స్లెడ్జింగ్ చేసి నిషేధానికి గురైన అంశాన్ని ప్రస్తావించాడు. అది ఒక ముగిసిన అధ్యాయమని, ఆ తరహా కామెంట్లు ఇక చేయదలుచుకోలేదన్నాడు. వ్యక్తిగత పరిహాసంలో భాగంగానే రూట్ను ఆ రకంగా స్లెడ్జ్ చేసినట్లు తెలిపాడు. ఇంగ్లండ్తో సిరీస్పై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఒకవేళ తనకు తుది జట్టులో చోటు దక్కితే ఓవరాల్గా ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానన్నాడు. జూలై8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టుకు సౌతాంప్టాన్ వేదిక కానుంది. -
ఛేజ్కు 8 వికెట్లు: విండీస్ జయభేరి
బ్రిడ్జ్టౌన్: వెస్టిండీస్ ఆఫ్స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ (8/60) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ను తిప్పేశాడు. విండీస్కు తొలి టెస్టులో భారీ విజయాన్నందించాడు. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 381 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 628 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 56/0తో నాలుగోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 246 పరుగుల వద్ద ఆలౌటైంది. 85 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన ఇంగ్లండ్ 161 పరుగుల వ్యవధిలో మిగతా 9 వికెట్లను కోల్పోయింది. రోరి బర్న్స్ (84; 15 ఫోర్లు) అర్ధసెంచరీ తర్వాత మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. స్టోక్స్ (34), బెయిర్స్టో (30), బట్లర్ (26), కెప్టెన్ రూట్ (22) రెండంకెల స్కోరు చేశారు. జట్టు స్కోరు 200 దాటాక... ఛేజ్ స్పిన్కు మోకరిల్లిన ఇంగ్లండ్ వడివడిగా వికెట్లను కోల్పోయింది. 217/6 స్కోరు వద్ద టీ విరామానికెళ్లిన ఇంగ్లండ్ తర్వాత 10 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయింది. గాబ్రియెల్, జోసెఫ్ చెరో వికెట్ తీశారు. వీరోచిత ద్విశతకం చేసిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్లో విండీస్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు ఈ నెల 31 నుంచి నార్త్సౌండ్లో జరుగుతుంది. -
రెండో టెస్ట్: పుంజుకున్న వెస్టిండీస్ జట్టు
-
తొలిరోజు విండీస్దే
సాక్షి, హైదరాబాద్: తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత పర్యాటక వెస్టిండీస్ జట్టు పుంజుకుంది. శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్మెన్ తొలుత తడబడినా.. చివరికి నిలబడి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. టీమిండియాతో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోస్టన్ ఛేజ్ (98 బ్యాటింగ్), కెప్టెన్ హోల్డర్(52) రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి కరీబియన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్లు చెరో మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక్క వికెట్ సాధించాడు. రాణించిన కుల్దీప్, ఉమేశ్ టాస్ గెలిచిన విండీస్ సారథి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అరంగేట్ర టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ పది బంతులేసిన అనంతరం గాయపడటంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను సారథి విరాట్ కోహ్లి రంగంలోకి దింపాడు. అశ్విన్ వచ్చీ రాగనే ఓపెనర్ పావెల్(22)ను వెనక్కి పంపించారు. మరో వైపు ఆచితూచి ఆడుతున్న బ్రాత్వైట్(14)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కుల్దీప్ దెబ్బకి విండీస్ మిడిలార్డర్ మరోసారి విఫలమవ్వడంతో 113 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు పేసర్ ఉమేశ్ యాదవ్ వీలు చిక్నిప్పుడల్లా వికెట్లు తీస్తూ కరీబియన్ జట్టుపై ఒత్తిడి పెంచాడు. చేజ్, హోల్డర్ల పోరాటం అదుర్స్ విండీస్ తొలి రోజు నిలబడిందంటే క్రెడిట్ మొత్తం రోస్టన్ చేజ్దే. ఓ వైపు వికెట్లు పడుతున్న పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. వికెట్ కీపర్ డౌరిచ్(30)తో కలిసి ఆరో వికెట్కు 69 పరుగులు జోడించాడు. డౌరిచ్ ఔటైన అనతంరం క్రీజులోకి వచ్చిన సారథి జాసన్ హోల్డర్(52) చేజ్కు జతకలిశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ ఇరువురూ అర్థశతకాలు సాధించారు. ప్రమాదకరంగా మారుతున్న హోల్డర్ను ఉమేశ్ ఔట్ చేశాడు. దీంతో ఏడో వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆటముగిసే సమయానికి ఛేజ్కు తోడుగా దేవేంద్ర బిషూ(2 బ్యాటింగ్)క్రీజ్లో ఉన్నాడు. చదవండి: హైదరాబాద్ టెస్ట్: శార్ధుల్ ఠాకుర్ అరంగేట్రం అరంగేట్రం అంతలోనే గాయం! -
'ఇదే ఫామ్ను కొనసాగించు'
కింగ్ స్టన్(జమైకా): నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్తో జరిగిన రెండో టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్పై కెప్టెన్ జాసన్ హోల్డర్ ప్రశంసలు కురిపించాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఛేజ్ నమోదు చేయడం వల్లే తాము మ్యాచ్ను కాపాడుకున్నామని హోల్డర్ అభినందించాడు. ఈ తరహా ఇన్నింగ్స్ను ఒక మ్యాచ్కే పరిమితం చేయకుండా మిగతా మ్యాచ్ల్లో కూడా కొనసాగించాలన్నాడు. ప్రత్యేకంగా రెండో టెస్టును నిలబెట్టింది మాత్రం ఛేజ్ అని, ఇదే ఫామ్ను మిగిలి ఉన్న రెండు టెస్టుల్లో కొనసాగిస్తాడని హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో పాటు బ్లాక్ వుడ్, డోవ్రిచ్లను హోల్డర్ అభినందించాడు. ప్రత్యేకంగా తమ ఇన్నింగ్స్లో మూడు కీలక భాగస్వామ్యాలు నమోదు కావడంతో టెస్టు మ్యాచ్ పై పట్టు సాధించమన్నాడు. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో ఛేజ్తో కలిసి బ్లాక్ వుడ్, డోవ్రిచ్లు జత చేసిన పరుగులు చాలా విలువైనవిగా హోల్డర్ తెలిపాడు. ఈ మ్యాచ్లో బౌలర్లపై బ్లాక్ వుడ్ విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉందన్నాడు. అతను బ్యాటింగ్ కు వెళ్లే ముందు సహజ సిద్ధమైన ఆటను ఆడమని తాను చెప్పినట్లు హోల్డర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. -
విండీస్ బ్యాట్స్మన్ సూపర్ : కుంబ్లే
కింగ్స్టన్: భారత్తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ అద్భుత సెంచరీ(137 నాటౌట్) ఇన్నింగ్స్ ను టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. ఛేజ్ ఇన్నింగ్స్ కారణంగా రెండో టెస్టు బుధవారం డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. టెస్టులో 100 ఓవర్లకు పైగా కోల్పోవడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 2-0 ఆధిక్యంలో నిలుస్తామని భావించినా.. విండీస్ మిడిల్, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు డౌరిచ్, జాసన్ హోల్డర్ హాఫ్ సెంచరీలు చేసి ఛేజ్ తో కలిసి స్కోరు బోర్డుకు పరుగులు జతచేయడంతో మ్యాచ్ ఫలితం మారిపోయిందన్నాడు. 'మా జట్టు 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. అప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విండీస్ కేవలం 50 పరుగుల లోపే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అయినా విండీస్ ఆటగాళ్లు సమయోచితంగా రాణించారు. వారి ఆటతీరును నిజంగానే మెచ్చుకుని తీరాల్సిందే. కచ్చితంగా గెలుస్తామన్న మ్యాచ్ను డ్రాగా ముగించారంటే ఈ క్రెడిట్ విండీస్ బ్యాట్స్మన్కే చెందుతోంది. ఆంటిగ్వా టెస్టుతో పోల్చితే రన్ రేట్ ఇక్కడ చాలా తక్కువగా నమోదైంది' అని భారత కోచ్ కుంబ్లే వివరించాడు. -
ఆ విండీస్ ప్లేయర్ అసాధ్యుడు..!!
భారత్ విజయాన్ని అడ్డుకున్న రోస్టన్ ఛేజ్ కింగ్స్టన్: భారత్తో జరిగిన రెండో టెస్టులో రాణించిన వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ చెప్పినమాట నిరూపించుకున్నాడు. రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవానికి తాను బౌలర్ను కాదని, ప్రధానంగా తన బలం బ్యాటింగ్ అని తెలిపాడు. బౌలర్ను కాదంటూనే తొలి ఇన్నింగ్స్ లో (5/121) తో ఆకట్టుకున్న ఛేజ్.. బ్యాటింగ్ లోనూ రాణించి విండీస్ ను ఓటమి గండం నుంచి గట్టెక్కించాడు. రెండో టెస్టులో విండీస్ కు కలిసొచ్చిన అంశం ఏంటంటే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాలలో ఛేజ్ రాణించడం. 304 పరుగులు వెనుకంజలో ఉన్న దశలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ టాపార్డర్ చేతులెత్తిసినా తన కెరీర్ లో తొలి సెంచరీ (269 బంతుల్లో 137; 15ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్గా నిలిచి భారత బౌలర్లను ఆశ్చర్యపరిచాడు. ఐదు వికెట్లు తీయడంతో పాటు అజేయ సెంచరీ సాధించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా విండీస్ మాత్రం అంత సులువుగా వికెట్లు సమర్పించుకోలేదు. దాంతో తొలిటెస్టు ఫలితం పునరావృతం కాలేదు. 48/4 దశలో క్రీజులోకి వచ్చిన ఛేజ్, బ్లాక్వుడ్ తో కలిసి ఐదో వికెట్కు 17.4 ఓవర్లలోనే 93 పరుగులు జోడించాడు. బ్లాక్వుడ్ను అవుటయ్యాక షేన్ డౌరిచ్ (114 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1సిక్స్)తో కలిసి ఆరో వికెట్కు 144 పరుగులు జోడించి భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ క్రమంలో తన తొలి సెంచరీ నమోదు చేసుకోవడంతో పాటు చివరగా కెప్టెన్ జాసన్ హోల్డర్(99 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1సిక్స్) తో కలిసి అజేయంగా క్రీజులో నిలిచి జట్టును మరో ఒటమి నుంచి తప్పించాడు. -
'నిజానికి నేను బౌలర్ను కాదు'
కింగ్స్టన్: భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో రాణించిన వెస్టిండీస్ ఏకైక బౌలర్ రోస్టన్ ఛేజ్. విండీస్ స్పిన్నర్ ఛేజ్ 5 వికెట్ల ఇన్నింగ్స్ (5/121) తో ఆకట్టుకున్నాడు. మూడోరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ఛేజ్ మీడియాతో మాట్లాడాడు. భారత్ లాంటి జట్టుపై ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది తనకు మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నాడు. తాను పార్ట్ టైం బౌలర్ గా జట్టులోకి వచ్చానని, అయితే తాను ప్రధానంగా బ్యాట్స్ మన్ అని తెలిపాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచులలో పెద్దగా బౌలింగ్ చేసేవాడిని కాదని, అయితే జట్టు అవసరాల మేరకు అక్కడ తన చేతికి బంతిని అందించారని వెల్లడించాడు. ఆంటిగ్వా టెస్టుతోనే జాతీయ జట్టులో కెరీర్ ప్రారంభించానని, అయితే టెస్టుల్లో రాణించడం అంత సులువుకాదని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో తాను లైన్ అండ్ లెంగ్త్ పట్టించుకోకుండా కాస్త వేగంగా బంతులు విసిరాను... ఈ టెస్టులో ఆ లోపాలను సవరించుకుని వికెట్లు పడగొట్టానన్నాడు. బంతి వేగాన్ని తగ్గించడంతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపాడు. 304 పరుగులు వెనుకబడి ఉన్న తమ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సమిష్టిగా రాణిస్తేనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడం సాధ్యమవుతుందని స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ అభిప్రాయపడ్డాడు.