-
కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
మన్సూరాబాద్/హయత్నగర్: మద్యం తాగి కుటుంబ పరువు తీస్తున్నాడని కలత చెందాడో..ఆస్తి తగాదాలు ఉన్నాయో తెలియలేదు కానీ..ఓ తండ్రి కన్న కొడుకును కడతేర్చాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కలగోని శ్రీనివాస్గౌడ్ గత కొంత కాలంగా మునగనూరులోని రామాంజనేయకాలనీ రోడ్నెంబర్–7 స్వంత ఇంటిలో నివాసం ఉంటూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాస్గౌడ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వినయ్ (28) ఐదు సంవత్సరాల క్రితం ప్రవల్లికను ప్రేమించి పెళ్లి చేసుకుని సమీపంలోని ఓ ఇంట్లో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి రెండేళ్ల పాప రక్షిత ఉంది. ఇటీవల కొద్ది కాలంగా వినయ్ తరచుగా మద్యం తాగి తండ్రి శ్రీనివాస్గౌడ్ నివాసానికి వచ్చి వ్యాపారం చేసుకుంటా డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి గొడవ పడ్డాడు. వ్యాపారం చేసుకుంటా..ఆస్తిలో తన భాగం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అలాగే మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. చేసేది లేక శ్రీనివాస్గౌడ్ రూ.500 మద్యానికి ఇచ్చాడు. అనంతరం వినయ్ మద్యం తెచ్చుకుని తాగి మరింతగా ఇంట్లో గొడవకు దిగాడు. దీంతో ఆవేశానికి లోనైన శ్రీనివాస్గౌడ్ అక్కడే ఉన్న ఇనుప పారతో వినయ్ తలపై గట్టిగా బాదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై వినయ్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని కూడా తెలుస్తోంది. హయత్నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. శ్రీనివాస్గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. -
కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ నేపథ్యంలో... ‘రియల్’ జోష్!
నిన్నటివరకు స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కదలిక వచ్చింది. సీఎం కేసీఆర్ కామారెడ్డినుంచి పోటీ చేస్తారన్న ప్రకటన వ్యాపారుల్లో ఒక్కసారిగా జోష్ తెచ్చింది. సీఎం పోటీచేస్తే అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు వస్తాయని ఆశిస్తున్న జనం.. భూముల ధరలకూ రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో రియల్ దందాకు తిరుగుండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి, కామారెడ్డి: ఊపుమీదున్న రియల్ దందా ను కరోనా దెబ్బకొట్టింది. భూముల క్రయ, విక్రయాలు గణనీయంగా తగ్గాయి. వైరస్ ప్రభావం దాదాపు రెండేళ్ల పాటు ఉండింది. రియల్ దందాలో పెట్టుబడులు పెట్టిన వారు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులపాలయ్యారు. కరోనా మూలంగా ప్లాట్లను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్లాట్లను అమ్ముకునేందుకు ప్రయత్నించినా కొనేవారు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్న ధరకన్నా తక్కువకు అమ్ముకుంటే నష్టపోతామన్న భావనతో కొందరు వ్యాపారులు వడ్డీలకు వడ్డీలు కట్టి నష్టపోయారు. ఇప్పుడిప్పుడే దందా కోలుకుంటున్నా.. మునుపటి జోష్లేదు. వెంచర్లు చేసి వాయిదాల పద్ధతిన ప్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేసినా జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. ధరలు అడ్డగోలుగా పెరగడంతో ప్లాట్లు కొనేవారు తగ్గిపోయారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ధరలు కామారెడ్డిలో ఉండడంతో డబ్బులున్నవారు అక్కడే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. మధ్య తరగతి అందుకోలేనంతగా భూముల ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడింది. కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడే నాటికే ఇక్కడ భూముల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. జిల్లా అయిన తర్వాత మరింతగా పెరిగి సామాన్యుడు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోనూ పెద్ద ఎత్తున ప్లాట్ల దందాతో రూ. కోట్లల్లో వ్యాపారం నడిచింది. ఊహిచనంతగా సాగిన రియల్ దందాతో కొందరు ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదిగారు. ఇక్కడ డబ్బులు సంపాదించిన వారు 44వ నంబరు జాతీయ రహదారిపై రామాయంపేట, చేగుంట, తూప్రాన్, మేడ్చల్ దాకా భూములు కొనుగోలు చేశారు. ఎక్కడ వెంచర్లు చేసినా అందులో కామారెడ్డి ప్రాంతానికి చెందిన వ్యాపారుల భాగస్వామ్యం ఉండింది. ప్లాట్ల దందాతో పాటు నిర్మాణ రంగంలోనూ వ్యాపారులు ఆరితేరారు. హైదరాబాద్లోనూ భారీ అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మించి విక్రయించే స్థాయికి ఎదిగారు. అందనంత స్థాయిలో... కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం సామాన్యుడికి భారంగానే మారింది. పట్టణంలో ఇళ్ల మధ్య ప్లాటు తక్కువలో తక్కువ గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఇల్లు నిర్మించుకునేందుకు ప్లాటు కొనుగోలు చేయాలంటే వంద గజాలకు రూ.20 లక్షలు వెచ్చించాల్సిందే. మధ్య తరగతి ప్రజలకు ఇది భారమే.. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సరిపోని సంపాదనతో ఇప్పటికే ప్లాట్లు కొనే పరిస్థితి లేకుండాపోయింది. ప్లాట్ల ధరలు ఇంకా పెరిగితే సామాన్యుడు ఆశలు వదులుకోవాల్సిందేనన్న భావన వ్యక్తమవుతోంది. రియల్ ఎస్టేట్ వర్గాల్లో నూతనోత్సాహం కొంతకాలంగా వ్యాపారం దెబ్బతిని ఇబ్బందు ల్లో ఉన్న రియల్ వ్యాపారులు, ఏజెంట్లలో సీఎం కేసీఆర్ కామారెడ్డినుంచి పోటీ చేస్తారన్న ప్రకటన ఉత్సాహాన్నిచ్చింది. సీఎం పోటీ చేస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో భూముల క్రయవిక్రయా లు పెరుగుతాయని, రియల్ బూం వస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశిస్తున్నారు. ఎవరి ని కదిలించినా కామారెడ్డిలో రియల్ దందా పరుగులు తీస్తుందని చెబుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన దేవునిపల్లి, టేక్రియాల్, లింగాపూర్, ఇల్చిపూర్, అడ్లూర్, రామే శ్వర్పల్లి, నర్సన్నపల్లి, సరంపల్లి, పాతరాజంపే ట, పొందుర్తి తదితర గ్రామాలతోపాటు తాడ్వాయి, పాల్వంచ, దోమకొండ, భిక్కనూరు, రాజంపేటల పరిధిలోని భూములు, ప్లాట్ల అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి. -
ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల సెటైర్
సాక్షి, హైదరాబాద్: ‘బీ ది ఛేంజ్ యు వాంట్ టూ సీ’అంటూ 33% మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సలహా ఇచ్చారు. నిజంగా కవితకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే..రానున్న ఎన్నికల్లో 33% అమలు చేయించాలని మంగళశారం ఆమె ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా అని నిలదీశారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్లోనూ ప్రాధాన్యత దక్కలేదన్నారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి.. కేబినెట్లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలంటూ సెటైర్ వేశారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అని మండిపడ్డారు. -
బోయిన్పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని బోయిన్పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సిద్ధిఖీ అనే వ్యక్తిని ఫయాజుద్దీన్ హత్య చేశాడు. సిద్ధిఖీని దారుణంగా నరికి చంపేశాడు.రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఫయాజుద్దీన్తో పాటు అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రూ.4 కోట్లతో రియల్టర్ పరారీ పట్టిస్తే రూ.3 లక్షలిస్తాం
జగిత్యాల క్రైం: దొంగల్ని పట్టిస్తే నగదు బహుమానం ఇస్తాం.. అంటూ పోలీసులు ప్రకటించడం చూసే ఉంటారు. కానీ జగిత్యాలలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పులు చేసి పారిపోవడంతో.. అతన్ని పట్టిస్తే రూ.3 లక్షల నజరానా.. అంటూ బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. జగిత్యాల జిల్లా గోవిందుపల్లికి చెందిన గాండ్ల వెంకన్న కుటుంబంతో సహా 15 రోజులుగా కనిపించడం లేదు. వెంకన్న చాలాకాలంగా చిట్టీలు నడుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా ఉండటంతో చాలామంది నమ్మి అతనికి సుమారు రూ.4 కోట్ల వరకు అప్పు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వెంకన్న పదిహేను రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. దీంతో బాధితులు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ‘గాండ్ల వెంకన్న కనిపించడం లేదు.. ఆయనను పట్టించిన వారికి రూ.3 లక్షల నజరానా ఇస్తాం’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాధితులెవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement