-
అయోధ్య ధ్వజ స్థంభాల నిర్మాణం జరుగుతోందిలా..
నూతన సంవత్సరం రాకకు మరికొద్ది రోజులే మిగిలివున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదు. 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజు. నాడు జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం, రాముని విగ్రహ ప్రతిష్ణాపన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుజరాత్లోని అహ్మదాబాద్లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది. వీటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. కంపెనీ ఎండీ భరత్ మేవాడ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలోని నూతన రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల తయారీ పని తమకు అప్పగించారని, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. వీటిలో 5,500 కిలోల బరువున్న ఒక ప్రధాన ధ్వజ స్తంభంతో సహా ఏడు ఇతర ధ్వజ స్తంభాలు ఉన్నాయని భరత్ తెలిపారు. మరోవైపు రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. ఆలయ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి #WATCH | Gujarat: Construction of 7 flag poles for the Ram temple in Ayodhya is underway in Ahmedabad. (04.12) pic.twitter.com/GkPCQudVoq — ANI (@ANI) December 5, 2023 -
విరిగిన 15 స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు
మహబూబ్నగర్: రైతు పొలం నుంచి చెరుకు లోడ్తో వెళ్తున్న లారీకి విద్యుత్ స్తంభాల తీగలు తగిలి వరుసగా నాలుగు ట్రాన్స్ఫార్మర్లు దిమ్మెల పైనుంచి కింద పడి, స్తంభాలు విరిగిన సంఘటన మహమ్మదాబాద్ మండలంలో చోటుచేసకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అన్నారెడ్డిలో ఓ రైతు పొలంలో చెరుకు కోసుకుని లారీకి లోడ్ చేశారు. అటు నుంచి రోడ్డుపైకి వచ్చి వెళ్తున్న లారీకి పైనున్న విద్యుత్ తీగలు తగిలాయి. గమనించకుండా లారీని తోలడంతో 15 విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు కిందపడిపోయాయి. దీంతో 20 మంది రైతుల వరకు బోరుమోటార్లు నడవకుండా నిలిచిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని రైతులకు పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలియజేశారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ లైన్ పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. -
భార్య గర్భిణిగా ఉందని చూడటానికి వచ్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
చిత్తూరు: ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి మండలంలో జరిగింది. చిత్తూరు జిల్లాలో ని పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన శివశంకర్ కుమార్తె పల్లవిని బెంగళూరు నార్త్ వైట్ఫీల్డ్ గాంధీపుర మసీదు వీధికి చెందిన అంజనప్ప కుమారుడు బి.ఏ.యశ్వంత్కుమార్కు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం జరిపించారు. పల్లవి గర్భం దాల్చడంతో నెలరోజుల క్రితం పుట్టినిల్లు అయిన కృష్ణాపురానికి వచ్చింది. శనివారం యశ్వంత్కుమార్ భార్యను చూసేందుకు ద్విచక్రవాహనంలో బెంగళూరు నుంచి కృష్ణాపురం వచ్చాడు. కొద్దిసేపు ఇంటి వద్ద గడిపిన అనంతరం రాత్రి 9.45 గంటలకు వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చాడు. తిరిగి కృష్ణాపురానికి వెళుతుండగా మదనపల్లె–బోయకొండ రోడ్డులోని వలసపల్లె సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో కిందపడిన యశ్వంత్కుమార్కు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలతో పడి ఉన్న యశ్వంత్కుమార్ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య పల్లవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. -
మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టింది. తాజాగా ఇద్దరు యువతులు మోడర్న్ డ్రస్ వేసుకుని బాలీవుడ్ సాంగ్కు మెట్రోలో పోల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. 'మెయిన్ టూ బెఘర్ హున్' సాంగ్కు యువతులు లిప్ సింక్ చేస్తూ డ్యాన్సులు చేశారు. ఈ పాట సుహాగ్ చిత్రంలోని కాగా.. ప్రవీణ్ బాబీ, శశి కపూర్ నటించారు. ఈ పాటకు యువతులు పోల్ పట్టుకుని కింద నుంచి మీదకు లయబద్దంగా ఊగుతూ హోరెత్తించే స్టెప్పులు వేశారు. వీరి డ్యాన్సులు చూస్తే అలాగే ఉండిపోయారు తోటి ప్రయాణికులు. ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. After porn, kissing and fighting in Delhi Metro, The latest is Pole Dancing..... 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023 ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయాణికుల తీరు మారట్లేదని వాపోతున్నారు. వైరల్ కావడానికి మెట్రో ఓ సాధనంగా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు పునరావృతమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
అరే ఏంది ఇది? రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలా?. వీడియో వైరల్
ఒక దేశంలో నడి రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు పెట్టారు. ఏదో ఒకటి రెండో కాదు ఏకంగా చాలావరకు విద్యుత్ స్తంభాలన్ని రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. ఈ ఘటన పాకిస్తాన్లో ఒక జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని షామా జునేజో అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ వీడియోలో రహదారిపై కనిపిస్తున్న విద్యుత్ స్తంభాలను చూస్తే ఏదో ప్రమాదవశాత్తు ఏర్పాటు చేసినట్లు లేదు. ఎందుకంటే విద్యుత్ స్తంభాలన్ని అలానే సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులకు ఎంత ప్రమాదకరం అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదీ కూడా శీతకాలంలో మరింత ప్రమాదకరమని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ మాజీ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దర్ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ హయాంలో జరిగిందా అని వీడియోని పోస్ట్ చేసిన షామా జునేజో ప్రశ్నిస్తున్నారు. یہ کھمبے عثمان بوزدار کے دور میں لگے یا چوہدری پرویز اِلٰہی کے؟ pic.twitter.com/zxR52A3CW0 — Shama Junejo (@ShamaJunejo) October 4, 2022 (చదవండి: 11,602 లాలీపాప్లతో వెరైటీ రికార్డు.. కండిషన్స్ ఆప్లై!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement