నెల్లూరు జిల్లాలో పెను విషాదం

సాక్షి, నెల్లూరు : నెల్లూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. కరెంట్ వైర్ ఆ ఇంటి యమపాశంగా మారి ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. వివరాలు.. కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ ఎంఐజీలో కాలనీలో ఒక ఇంటి ప్రధాన గేటుపై 11 కె.వి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీన్ని గమనించకుండా గేటు తీసిన ఇంటి యజమాని టీచర్ వేణుగోపాల్ (56) ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే భర్తను రక్షిద్దామని ఏం ఆలోచించకుండా వెళ్లిన భార్య మరియమ్మ(52), తల్లి బజ్జమ్మ(70) వేణుగోపాల్ చేయి పట్టుకోవడంతో షాక్కు గురై అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత చెందడంతో కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి