mother milk
-
అమ్మపాలు.. అమృతం..
లబ్బీపేట(విజయవాడతూర్పు): బిడ్డకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుదల, మెదడు ఎదుగుదలతో పాటు, పిల్లలు చురుగ్గా ఉండేలా చేస్తాయి. కానీ పాశ్చాత్య సంస్కృతితో భాగంగా కొందరు సౌందర్యం తగ్గుతుందని మరికొందరు ఉద్యోగరీత్యా తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదు. ఇలాంటి చర్యలతో బిడ్డలతో సహా తామూ నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేకపోతున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావం గురించి అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంది. వైద్య ఆరోగ్యశాఖ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శిశు మరణాల నివారణ....ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాస కోశవ్యాధులతో మరణాలు సంభవిస్తున్నాయని యూనిసెఫ్ గుర్తించింది. అలాటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే అవగాహన కలిగిస్తున్నారు.తల్లికీ ప్రయోజనాలు....బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని అంటున్నారు. అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని పేర్కొన్నారు.శిశువులకు ఎంతో మేలు⇒ తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి.⇒ తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు.⇒ మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.⇒ పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను వడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది.⇒ ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటాయి.⇒ శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలూరుబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లును నివారిస్తాయి.⇒ పుట్టిన అరగంటలోపు శిశువుకు తల్లిపాలు పట్టించాలి తల్లిపాలతో వ్యాధి నిరోధకశక్తి పెరుగుదల తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువ నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలుతల్లిపాలు శ్రేష్టమైనవిబిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి. శిశువుకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. సాధారణ ప్రసవం అయితే పుట్టిన అరగంటలోపు, సిజేరియన్ అయితే నాలుగు గంటల్లోపు తల్లిపాలు పట్టించాలి. ముర్రుపాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లలు చురుగ్గా ఉండటంతో పాటు తెలివితేటలు, జ్ఞాపకశక్తి మెండుగా ఉంటాయి.– డాక్టర్ బి.సునీత, అసోసియేట్ ప్రొఫెసర్, పిల్లల వైద్య విభాగం, జీజీహెచ్ -
వెస్ట్రన్ కల్చర్.. తల్లిపాలు ఇవ్వట్లేదు, అరగంటలోపే మరణాలు
పాశ్చాత్య సంస్కృతి అంటూ కొందరు, సౌందర్యం తగ్గుతుందని మరికొందరు, ఉద్యోగరీత్యా ఇంకొందరు తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల బిడ్డలతో పాటు, తాము నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేక పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేత్ర, శిశు సంక్షేమశాఖతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. శిశు మరణాలు నివారించవచ్చు.. ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులతో మరణాలు సంభవించడం జరుగుతున్నట్లు యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలతో ప్రయోజనాలెన్నో.. ► బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ► రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు. ► అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ► తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. ► తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ► మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ● పసిబిడ్డకు ► ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లిశరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ► ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటుంది. ►శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలురూబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లను నివారిస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం తల్లిపాల విశిష్టతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో, కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
అమ్మ పాలకూ బ్యాంక్
అమ్మ పాలు అమృతం కంటే విలువైనవి. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు అద్భుతమైన ఔషధంలా పని చేస్తాయి. మరో విషయం ఏమంటే.. బిడ్డకు పాలివ్వడం తల్లి ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు కలుగుతుంది. తల్లి పాల నుంచి బిడ్డకు విటమిన్లు, ప్రొటీన్లు లభించడమే కాకుండా.. తల్లి స్పర్శ, వాత్సల్యపూరిత ఆలింగనం వల్ల బిడ్డ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో భరోసా కలుగుతుంది. అంత గొప్ప విశిష్టత కలిగిన తల్లి పాలకు కొందరు బిడ్డలు దూరం కావాల్సి వస్తోంది. తల్లి పాలు దొరక్క నవజాత శిశువులు అక్కడక్కడ మరణిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు కాకినాడ జీజీహెచ్లో తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు కాబోతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఇప్పుడు అంతకంటే గొప్ప దానం మరొకటి రాబోతోంది. అదే తల్లి పాల దానం చేయవచ్చు. తల్లి పాలు దానం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఔను.. తల్లి పాలను సైతం ఇకనుంచి దానం చేయొచ్చు. తల్లి పాలకు దూరమైన బిడ్డలకు ప్రాణ భిక్ష, ఆరోగ్య భిక్ష కల్పించవచ్చు. రక్తదానం మాదిరిగా అమ్మ పాలను దానంగా స్వీకరించి నిల్వ చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో ‘మదర్ మిల్క్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) పీడియాట్రిక్ విభాగం పైఅంతస్తులో 8 గదులతో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘సుశేణ హెల్త్ ఫౌండేషన్’ మధ్య ఇందుకు సంబంధించి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్కుమార్ దేశంలోనే 8వ మదర్ మిల్క్ బ్యాంక్ను ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫౌండేషన్ రూ.కోటితో మూడు విడతల్లో దీని నిర్మాణం చేపడుతోంది. తల్లి పాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం. వీటి ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల కొందరు.. శరీరాకృతి మారిపోతుందనే అపోహతో మరికొందరు.. తల్లి పాలు రాక ఇంకొందరు పిల్లలు చనుబాలకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా పోత పాలతో బిడ్డ ఆకలి తీరుస్తుండటం వల్ల బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బ తీస్తున్నాయి. తల్లి నుంచి పాలు సేకరిస్తున్న దృశ్యం (ఫైల్) బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను.. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా ప్రసవాలు జరిగే టాప్–5లో ఉన్న కాకినాడ జీజీహెచ్ను ‘సుశేణ’ హెల్త్ ఫౌండేషన్ ఎంపిక చేసుకుంది. నవజాత శిశువు నుంచి రెండేళ్ల బిడ్డ వరకు ఈ బ్యాంక్లో పాలు ఇస్తారు. తల్లి బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను సేకరించి అవసరమైన పిల్లలకు అందిస్తారు. హెచ్ఐవీ, వీడీఆర్ఎల్ (వెనెరియల్ డిసీజ్ రీసెర్చ్ లేబొరేటరీ టెస్ట్), హెపటైటిస్ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే తల్లి పాలు తీసుకుంటారు. కాగా, ఇక్కడ తల్లుల చనుబాల పరిమాణం పెంచేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. మసాజ్ థెరఫీ, న్యూట్రిషనల్ ట్రీట్మెంట్ (పోషకాలతో కూడిన వైద్యం), మదర్కేర్ (బిడ్డను హత్తుకుని పాలిచ్చే) తరహాలో తల్లులకు బిడ్డలను కనీసం గంటపాటు హత్తుకుని ఉండేటట్టు ఈ బ్యాంక్లోని ప్రత్యేక వార్డులో నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా ఈ బ్యాంక్లో రెండు, మూడు రోజులు ఉంచి తల్లులకు అవగాహన వచ్చాక ఇంటి వద్ద ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించి పంపేస్తారు. స్వచ్ఛంద దాతలు జీజీహెచ్ మిల్క్ బ్యాంక్కు వచ్చి పాలు దానం చేయవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితం. తొలి దశలో సేకరించిన పాలను నిల్వ చేయకుండా వెంటనే అవసరమైన శిశువులకు పట్టిస్తారు. రెండో దశలో పాలను నిల్వ చేస్తారు. కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు వాటిని పాడవకుండా భద్రపరుస్తారు. ఇందుకు ప్రత్యేక యంత్రాలు జీజీహెచ్లో సిద్ధమయ్యాయి. తొలి దశ ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో మిల్క్ పాశ్చరైజేషన్ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏపీలో తొలి బ్యాంక్ సామాజిక బాధ్యతలో భాగంగా నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకున్నాం. రాష్ట్రంలోనే తొలిసారి కాకినాడ జీజీహెచ్లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వంతో ఇటీవలనే ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమవుతోంది. – రమేష్ లక్కర్సు, కన్సల్టెంట్ ప్రోగ్రాం మేనేజర్, సుశేణ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధి విస్తృతం చేస్తాం ఈ సేవలను విస్తృతం చేసేందుకు నెట్వర్క్ ఆస్పత్రులతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం. మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు జీజీహెచ్లో పరిస్థితులు ఉండటంతో సుశేణ ఫౌండేషన్ ముందుకొచ్చింది. – డాక్టర్ హేమలతాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ శిశువుల ప్రాణాలకు రక్ష కాకినాడ జీజీహెచ్లో ప్రతి నెలా 700 నుంచి 800 ప్రసవాలు జరుగుతున్నాయి. రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుడుతున్న నవజాత శిశువుల సంఖ్య 75 నుంచి 85 మధ్య ఉంటుంది. కిలో కంటే తక్కువ బరువుతో పుడుతున్న వారు 10 మంది ఉంటున్నారు. ఈ బ్యాంక్ శిశువుల ప్రాణ రక్షణకు తోడ్పడుతుంది. – ఎంఎస్ రాజు, హెచ్వోడీ, పీడియాట్రిక్, జీజీహెచ్, కాకినాడ -
తల్లిపాలలోనూ ప్లాస్టిక్!
సాక్షి, హైదరాబాద్: సృష్టిలో స్వచ్ఛమైన పదార్థమంటే టక్కున గుర్తొచ్చేది అమ్మ పాలే. కానీ ఇప్పుడా తల్లి పాలు సైతం కలుషితం అవుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ప్లాస్టిక్ రక్కసి చివరికి తల్లి పాలలోనూ చేరుతోంది. ఆ రూపంలో శిశువుల శరీరంలోనికీ వెళుతోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి పనిలో, ప్రతిచోటా ప్లాస్టిక్తో ముడిపడిపోయిన పరిస్థితే దీనికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు, పాత్రల్లో వేసిన ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్లు, ఇతర పానీయాలు తాగుతున్నప్పుడు అతి సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పీల్చే గాలి ద్వారా ప్లాస్టిక్ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. మనుషుల రక్తంలో కూడా ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్టు కొద్దిరోజుల కింద శాస్త్రవేత్తలు తేల్చారు. అలాంటిది చివరికి తల్లిపాలలోనూ ప్లాస్టిక్ చేరినట్టు ఇటలీ వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పరిశీలన సాగిందిలా..: స్త్రీ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం యూనివర్సిటీ ఆస్పత్రిలో 34 మంది తల్లుల నుంచి నిర్ణీత మొత్తంలో పాల నమూనాలను సేకరించింది. వాటిని రామన్ మైక్రో స్పెక్ట్రోస్కొపీ సాంకేతికత సాయంతో విశ్లేషించింది. ఈ సందర్భంగా 26 మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించారు. ఆ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఏ రకమైనవి, వాటి పరిణామం, రంగులను నిర్ధారించారు. కొందరి పాలలో అయితే రెండు, మూడు రకాల మైక్రో ప్లాస్టిక్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి, నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఉపయోగంచే ప్లాస్టిక్ రకాలేనని తేల్చారు. రకరకాలుగా కలుషితం ఆహారం, కలుషిత గాలి ద్వారా ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి మొదలు.. నిల్వ, రవాణా, వండటం, వడ్డించడం, చివరి ప్లాస్టిక్ చెంచాలతో తినడం వరకు అన్ని స్థాయిల్లో ప్లాస్టిక్ చేరుతోంది. ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతోంది. ఇక ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు గాలిలో చేరుతున్నాయి. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలో ప్రవేశించి శరీర భాగాలన్నింటికీ వెళుతున్నాయి. సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్టు అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తులు నీటిలో కలవడం, వాటి నుంచి అతిచిన్న ముక్కలు నీటిలోకి, జలచరాల్లోకి చేరడం, వాటిని ఆహారంగా తీసుకుంటున్న మన శరీరంలోకి చేరడం జరుగుతోంది. ఇదంతా అత్యంత సూక్ష్మస్థాయిలో ముంచుకొస్తున్న ప్రమాదమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిందే.. భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), ఐసీఎంఆర్ సంస్థల వివరాల ప్రకారం మన దేశంలో మానవాళిపై ప్లాస్టిక్ కణాల ప్రభావంపై పరిశోధన జరగలేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఈ అంశంలో సరైన స్పష్టత లేదని ఐసీఎంఆర్ అంటోంది. తల్లిపాలలోనూ ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయని తేలిన నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధనలు మరింతగా జరగాల్సి ఉంది. మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకురావాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి తల్లిపాలలో ప్లాస్టిక్తోపాటు లెడ్ వంటి భారలోహల అవశేషాలు ఉన్నాయన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లి పాలలో ప్లాస్టిక్, లెడ్ అవశేషాలతో జరిగే నష్టంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టతా లేదు. కానీ పుట్టినబిడ్డకు తల్లి పాలు అత్యంత కీలకం. అందువల్ల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్ వినియోగానికి వీలైనంత దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ ప్యాకేజింగ్తో ఉండే ఆహారం తీసుకోవద్దు. – డాక్టర్ బబిత మాటూరి, సీనియర్ గైనకాలజిస్ట్ ప్రమాదం ఎంత వరకు? తల్లి పాలలోని ప్లాస్టిక్ అవశేషాలతో బిడ్డకు ప్రమాదం కలగవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని.. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే తల్లి పాలలోని మైక్రోప్లాస్టిక్ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై మన దేశంలో ఎలాంటి పరిశోధన జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో కూడా లోతైన పరిశోధనలేవీ లేవని తెలిపింది. -
తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!
Jewellery Made From Breast Milk: ఇంతవరకు తల్లిపాల ప్రాధాన్యత గురించి మాత్రమే తెలుసు. అంతేకాదు పుట్టిన నవజాత శిశువులకు తొలి ఆరునెలల తల్లిపాలు తాగితే వారికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. అంతేందుకు తల్లిపాల వారోత్సవాలు లేదా మథర్ బ్రెస్ట్ మిల్క్ డే అని ఒక రోజు కూడా ఏర్పాటు చేశారు. పైగా తల్లిపాలకు నోచుకోని చిన్నారులకు తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో మిల్క్ బ్యాంక్స్ ఏర్పాటు చేద్దాం అంటూ విన్నూతన పద్ధతులు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు నిపుణులు. కొన్ని దేశాల ఇప్పటికే ఆ పద్ధతులను అవలంభించాయి కూడా. అయితే ఇప్పుడు ఈ తల్లిపాలతో విలువైన ఆభరణాలను కూడా తయారుచేస్తున్నారట. అంతేకాదు ఇది తల్లులు తమ పిల్లతో గల విశిష్ట అనుబంధానికి గుర్తుగా రూపొందిస్తున్నారట!. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్కి చెందిన అల్మా పార్టిడా తన కుమార్తె అలెస్సాకు సుమారు 18 నెలల పాటు పాలిచ్చింది. అయితే అప్పుడే ఆమెకు తాను తన పిల్లలకు ఇస్తున్న పాలను మాృతృత్వపు మాధుర్యానికి గుర్తుగా ఉంచుకునే మార్గం కోసం అన్వేషించింది. అంతేకాదు ఇందుకోసం ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్చ్ చేసింది. అప్పుడే ఆమెకు తల్లిపాలతో తయారు చేసే నగల కంపెనీ కీప్సేక్స్ బై గ్రేస్ గురించి తెలుసుకుంది. ఇక ఆమె వెంటనే తల్లిపాలలో దాదాపు 10 మిల్లీలీటర్లను కీప్సేక్స్ బై గ్రేస్ అనే కంపెనీకి పంపింది. ఈ మేరకు ఒక నెల తర్వాత ఆ కంపెనీ ఆమె చేతికి మిల్కీ-వైట్ గుండె ఆకారంలో లాకెట్టును పంపించింది. దీంతో అల్మా పార్టిడా తన కోరిక ఫలించినందకు సంతోషించడమే కాక తాను తల్లిగా మారిన తర్వాత చివరి మిల్క్ డ్రాప్గా తన బిడ్డకు పాలు ఇస్తు సాగిన జీవితపు తీపి గుర్తుగా పదిలంగా ఉంటుందని పేర్కొంది . ఈ మేరకు కీప్సేక్స్ బై గ్రేస్ కంపెనీ యజమాని సారా కాస్టిల్లో మాట్లాడుతూ...తల్లిపాలతో ఆభరణాలా అంటూ ఆశ్యర్యంతోపాటు నన్ను ఒక వెర్రిదాని వలే చూశారు. నేను తయారు చేసిన ఆభరణాలను చూసిన తర్వాతే నాకు చాలా ఆర్డర్లు రావడం జరిగింది. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడూ విపరీతమైన నరకయాతనను అనుభవించిన తల్లుల నుంచే తనకు ఎక్కు ఆర్డర్లు వచ్చాయి" అని న్యూయార్క్ టైమ్స్కి తెలిపింది. అంతేకాదు సారా తల్లిపాలతో తయారు చేసే స్టోన్లు దాదాపు రూ.4 వేల నుంచి 11 వేలు వరకు ధర పలుకుతాయి. అంతేకాదు సదరు మహిళ అల్మా చేతికి జ్యువెలరీని ధరించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆవీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) View this post on Instagram A post shared by Sarah | Breastmilk Jewelry (@keepsakesbygrace) -
ఎదిగే పిల్లలకు ఈ పోషకాహారం ఇస్తున్నారా? పాలు, గుడ్డు, పాలకూర..
ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అవసరం. అలాగని ఏది పడితే అది తినిపించడమూ మంచిది కాదు. ముఖ్యంగా వాళ్లు ఇష్టంగా తింటున్నారు కదా అని జంక్ ఫుడ్ తినిపిస్తే ఆరోగ్యంగా ఎదగకపోగా ఊబకాయం వస్తుంది. ముందు ముందు అది మరెన్నో సమస్యలకు దారి తీయవచ్చు. అందువల్ల ఏ ఆహారంలో ఏముంటుందో తెలుసుకుని, వాటినే వారు తినేలా చూడగలిగితే పిల్లలు ఆరోగ్యంగా పెరగడంతోపాటు మానసిక వికాసం కూడా కలుగుతుంది. ►పాలు: బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్ఠమైనవి, ఆరోగ్యకరమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రంగా జీర్ణం అయ్యే ఆహారం.తల్లి పాల తర్వాత ప్రోటీనులూ, విటమిన్లు, ఖనిజాలు గల పాలు ఆవుపాలు. పిల్లలకు ఆవుపాలు తాగించడం వల్ల వారిలో ధారణ శక్తి కలుగుతుంది. ఆవుపాలు శ్వాస సంబంధిత వ్యాధులను తొలగించడంతోపాటు. శరీరానికి కాంతిని, ఇంద్రియాలకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. అందువల్ల పిల్లలకు ఆవుపాలు తాగించడం మంచిది. ►విటమిన్ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం జున్ను, క్యారెట్, పాలూ, గుడ్లూ ఇవ్వాలి. ►బి కాంప్లెక్స్ విటమిన్లు: శరీర పనితీరు బాగుండాలంటే బీ కాంప్లెక్స్ అత్యవసరం. మాంసం, చేపలూ, సోయా బీన్స్ వంటివి ఇవ్వడం వల్ల బి కాంప్లెక్స్ అందుతుంది. ►కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్ సి చాలా అవసరం. టొమాటో, తాజా కూరలూ, పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. ►ఎముక బలానికి: ఎదిగే పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్ డి తప్పనిసరి. ఇందుకోసం పాలూ, పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి. ►ఐరన్ లోపం లేకుండా: ఐరన్ రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ వంటివి ఇవ్వాలి. ►గుడ్డు: గుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. రోజుకో గుడ్డు ఇవ్వడం వల్ల మాంసకృత్తులు సమృద్ధిగా అందు తాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి దోహదం చేస్తుంది. గుడ్లు చవకైన పోషకాహారమే కాదు. ఎప్పుడంటే అప్పుడు తినటానికి వీలుగా ఉంటాయి కూడా. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో విటమిన్ డి దండిగా ఉంటుంది. అందువల్ల గుడ్లను పిల్లల ఆహారంలో చేర్చటం మంచిది. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరకశ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. ►మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్ను తయారు చేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయ వ్యాధి, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ►ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్ల వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్డీఎల్ స్థాయులు మెరుగుపడతాయి. ట్రై గ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి. ఏ పాలు..? ఎన్ని పాళ్లు ..? పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను తాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాగి (వేడి చేసి) కాచిన తర్వాతనే తాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్ మిల్క్ను కనీసం పదినిముషాలయినా కాచినట్లయితే అందులోని బాక్టీరియా నశిస్తుంది. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తాగించాలి. చల్లారిన, నిల్వ ఉన్న పాలను తాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి తాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు తాగించాలన్నదీ తెలుసుకోవడం మంచిది. చదవండి: Dairy Rich Diet: గుండె ఆరోగ్యానికి అందుబాటులోని 5 పాల ఉత్పత్తులు ఇవే... -
తల్లిపాలు: మొదటి మూడురోజుల్లో వచ్చే పాలలో ఔషధ గుణాలు..
సాక్షి, బన్సీలాల్పేట్ (హైదరాబాద్): తల్లిపాలు పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పలువురు వక్తలు అన్నారు. బోయిగూడ మల్టీ ఫంక్షన్హాల్లో సోమవారం తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కె.హేమలత, గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ మహాలక్ష్మి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి.విద్యులత, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడారు. తల్లిపాలు బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి నృత్యరూపకం, నాటకాలు, ఉపన్యాసాల ద్వారా గర్భిణులు, బాలింతలకు వివరించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు పండ్లు, గాజులు, పువ్వులు తదితరాలను అందజేశారు. తల్లిపాలలో ఔషధ గుణాలు.. సనత్నగర్: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం సనత్నగర్ అల్లావుద్దీన్ కోఠి–2, బల్కంపేట–ఇందిరాగాంధీ పురం అంగన్వాడీ సెంటర్లలో తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా సెంటర్ల అంగన్వాడీ టీచర్లు హాజరై తల్లులకు, మహిళలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రసవం సాధారణంగా జరిగినా, శస్త్ర చికిత్స ద్వారా జరిగినా గంట లోపు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్రసవానంతరం మొదటి మూడు రోజుల్లో వచ్చే పాలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని, బిడ్డకు ఉదర కోశ వ్యాధులు, న్యూమోనియా వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు ప్రవీణదేవి, శోభారాణి, బబిత, ఏఎన్ఎం అనురాధ పాల్గొన్నారు. -
తల్లిపాలు... రకాలు!
రొమ్ము పాలు పట్టే తల్లి... తన బిడ్డకు పాలు తాగేటప్పుడు ఆమె నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదటిది తొలిసారి వచ్చే పాలు. వీటిని ఫోర్ మిల్క్ అంటారు. రెండోది మలిసారి పాలు... వీటిని హైండ్ మిల్క్ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ హైండ్ మిల్క్ అన్నవి.. చిన్నారి కాసిన్ని పాలు తాగాక స్రవించడం మొదలవుతాయి. వాస్తవానికి ఫోర్ మిల్క్ కంటే... హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి, పుష్టికరమైనవి, మంచి పోషకాలను ఇచ్చేవి. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. అందుకే పిల్లలు పది పదిహేను గుటకలు వేశాక స్రవించే పాలు చాలా మంచివన్న విషయం తల్లి గ్రహించడం మేలు. ఫోర్ మిల్క్ను ముర్రుపాలతో పొరబడవద్దు... పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ మొదలు కాగానే... స్రవించే ఫోర్ మిల్క్ను... ప్రసవం కాగానే తొలి రెండు మూడు రోజుల్లో స్రవించే ముర్రుపాలతో పొరబాటు పడవద్దు. నిజానికి ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. మంచి రోగనిరోధకతను ఇస్తాయి. అద్భుతమైన ఇమ్యూనిటీ వ్యవస్థను నిర్మించడానికి దోహదపడతాయి. ఫోర్ మిల్క్ అంటే... ప్రతిసారీ పాలు తాగడం మొదలు పెట్టగానే తొలిసారి స్రవించేవి అనీ... ఓ పది–పదిహేను గుటకల తర్వాత స్రవించేవి హైండ్ మిల్క్ అనీ గుర్తుపెట్టుకుంటే చాలు. -
తల్లికి పాజిటివ్ ఉన్నా.. శిశువుకు పాలు ఇవ్వొచ్చా?
సాక్షి, మహబూబ్నగర్: ‘కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి.. శిశువుకు పాలు ఇవ్వొచ్చు. కాకపోతే పాలు ఇచ్చే సమయంలో తల్లి రెండు మాస్కులు ధరించాలి.’ కేవలం పాలు ఇచ్చే సమయంలో మాత్రమే శిశువును దగ్గరకు తీసుకోవాలి, ఇతర ఆలనాపాలన మాత్రం నెగిటివ్ ఉన్న మహిళతో చేయించాలి. శిశువుకు లక్షణాలు ఉంటే కావాల్సిన మందులు వాడాలి. పరీక్షలు మాత్రం చేయించాల్సిన అవసరం లేదు. చిన్నారులకు మాస్కు పెట్టలేం కనుక అధిక లక్షణాలతో పాజిటివ్ ఉండే తల్లులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తరచూ శిశువు పట్టుకోకుండా పాలు ఇచ్చే సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కొంత దూరం ఉండడం ఉత్తమం.’ అని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం సాక్షి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పలువురు కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేయడంతో పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్లో 3 నుంచి 4శాతం చిన్నారులు అధికంగా కరోనా బారినపడుతున్నారు. కాకపోతే ఎవరూ కూడా తీవ్ర సమస్యలకు గురికాకుండా స్వల్ప లక్షణాలతో రికవరీ అవుతున్నారు. సెకండ్ వేవ్లో వందలో పదిశాతం చిన్నారులు కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం చిన్నారులలో ఎవరిలో కూడా ఆయాసం కన్పించడం లేదు. పిల్లలకు ఒకటి లేదా రెండు రోజుల పాటు జ్వరం వస్తుంటే పారాసిటమాల్ ప్రతి ఆరు గంటలకు ఓసారి వేయాలి. మల్టీవిటమిన్, కొద్దిగా లక్షణాలు అధికంగా యాంటీబయోటిక్స్ వాడాలి. తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చి పిల్లలకు ఆ రోజు నెగిటివ్ వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. మళ్లీ రెండు రోజుల తర్వాత వారిలో లక్షణాలు బయటపడుతాయి. వారిలో ఉండే టీకా, రోగనిరోధక శక్తివల్ల లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. 24గంటల నుంచి 48 గంటల పాటు పారాసిటమాల్ వేసిన కూడా జ్వరం తగ్గకపోతే అప్పుడు కరోనా పరీక్షలకు వెళ్లాలి.’ అని పేర్కొన్నారు. ప్రశ్న: మా తల్లిదండ్రులతో పాటు నాకు పాజిటివ్ వచ్చింది. నాకు చిన్నారి ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్: మీ పాపను కొంత దూరంగా పెట్టండి. ఏదైనా అత్యవసరం ఉండి, పాలు ఇవ్వాల్సిన సమయంలో చేతులకు గ్లౌజ్, రెండు మాస్కులు పెట్టుకొని శిశువును పట్టుకోవాలి. పాపకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే మందులు వాడండి. ప్రశ్న: మా పాపకు 8 ఏళ్లు నా తల్లిదండ్రులతో ఉంటుంది. ఇటీవల వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ పాపకు నెగిటివ్ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాపకు మళ్లీ పరీక్ష చేయించాలా? డాక్టర్: పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు పాపను కొంత దూరం పెట్టండి. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటే మళ్లీ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. జ్వరం ఉంటే పారాసిటమాల్ వాడండి. ప్రశ్న: మా ఇంట్లో నలుగురం ఉంటే మా చిన్న బాబుకు తప్పా అందరికీ పాజిటివ్ వచ్చింది. మాతో పాటు బాబు ఉండవచ్చా? డాక్టర్: మీ ముగ్గురు కూడా ఇంట్లో వేరువేరుగా ఉంటూ మాస్కులు వాడండి. నెగిటివ్ ఉన్న బాబును మాత్రం ప్రత్యేకంగా ఉంచండి. ఆ బాబుకు ఏదైనా లక్షణాలు ఇతర సమస్య ఏదైనా ఉంటే పరిశీలించండి. లక్షణాలు లేకపోతే పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ప్రశ్న: చిన్న పిల్లలలో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి. తుమ్ములు రావడం కూడా కరోనా లక్షణమేనా? డాక్టర్: సాధారణంగా చిన్న పిల్లలలో ప్రస్తుతం జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ మూడింటిలో రెండు లక్షణాలు రెండు కంటే ఎక్కువ రోజులు ఉంటే ఓసారి పరీక్ష చేసు కోవాలి. తుమ్ములు రావడం కరోనా లక్షణం కాదు. ప్రశ్న: మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది. మా 8 ఏళ్ల బాబు వారితో ఉండేవాడు. అతడికి పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్: కొందరి పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిలో వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. మళ్లీమళ్లీ పరీక్షలు చేయకండి. ఏదైనా లక్షణాలు కన్పిస్తే అవి కూడా మూడు రోజుల పాటు తగ్గకుండా ఉంటే అప్పుడు చూడండి. లక్షణాలు కనిపిస్తే మల్టీ విటమిన్ సిరఫ్, పారాసిటమాల్ వాడండి. ప్రశ్న: మా ఇంట్లో నిమోనియా వచ్చిన వ్యక్తి ఉన్నాడు. కరోనా నేపథ్యంలో పిల్లలు అలాంటి వారికి దూరంగా ఉండాలా? డాక్టర్: సాధారణంగా నిమోనియా వచ్చిన వారికి పిల్లలను దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. అతనికి దగ్గు కూడా ఉంటుంది కనుక ఎప్పుడూ మాస్కు పెట్టండి. ఇలాంటి వారికి వైరస్ తొందరగా సోకుతుంది. ప్రశ్న: నాకు పాజిటివ్ ఉంది. నా పాప ప్రస్తుతం మూడు నెలల శిశువు. పాపకు పరీక్ష చేయలేదు. తల్లి పాలు ఇవ్వొచ్చా? డాక్టర్: శిశువుకు పాలు ఇచ్చే సమయంలో తల్లిగా మీరు రెండు మాస్కులు పెట్టుకోవాలి. కరోనా ఉన్నా..పాలు ఇవ్వొచ్చు. పాపకు రెండురోజుల పాటు జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉంటే టానిక్స్తో పాటు ఇతర మందులు వాడండి. మూడేళ్ల పైబడిన పిల్లలకు మాత్రమే మాస్కులు పెట్టవచ్చు. పిల్లల్లోజ్వరం, దగ్గు, కంట్లో నలత, గొంతు నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, 8 ఏళ్లు పైబడిన వారికి వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తే అప్పుడుఅనుమానించాలి. ముఖ్యంగా కిడ్నీ, గుండె జబ్బులు, లివర్ సమస్య, ఎదుగుదల లోపం ఉన్న వారు హైరిస్క్లో ఉన్నట్లు. వీరికి వైరస్ కొంచెం త్వరగా సోకే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పాజిటివ్ ఉన్న సమయంలో ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. - డాక్టర్ రాఘవేంద్రకుమార్ -
అమ్మపాలే ‘అమృతం’
గుంటూరు మెడికల్: శిశుమరణాల నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం చేపట్టింది. అందులో భాగంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా 1992లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించి 210 దేశాల్లో అమలు చేస్తోంది. తల్లిపాల ఆవశ్యకత గురించి వరల్డ్ అలయన్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. ఆగస్టు ఒకటో నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిసస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. తల్లిపాలతో ప్రయోజనాలు... ♦ తల్లిపాలలో సహజ సిద్ధమైన ప్రొటీన్లు లాక్టొఫెరిన్, కోలోస్ట్రమ్, కొన్ని కీలకమైన హార్మోన్లు, రోగ నిరోధక బ్యాక్టీరియా ఉంటాయి. ♦ తల్లిపాలు తాగే పిల్లలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. డబ్బాపాలు తాగే పిల్లల కంటే చురుగ్గా ఉంటారు. ♦ తల్లి బిడ్డకు పాలు ఇవ్వటంతో తల్లీబిడ్డ మధ్య అనుబంధం పెనవేసుకుంటుంది. ♦ మంచి గుణాలు, మానవ సంబంధాలు శిశువులో పుట్టుక నుంచే అలవడతాయి. ♦ పాలిచ్చే తల్లులకు క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ♦ పొత్తికడుపు త్వరగా తగ్గిపోతుంది. పాలు ఇస్తున్నంతకాలం వెంటనే గర్భం రాకుండా కృత్రిమంగా ఆగిపోతుంది. ♦ ప్రసవ సమయంలో అయ్యే బ్లీడింగ్ కూడా త్వరగా తగ్గిపోతుంది. -
ఏ తల్లి పాలోఈ ప్రాణధారలు
ప్రాణమిచ్చిన అమ్మ.. పాలు ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వడానికి ఆ తల్లి దగ్గర పాలు లేకపోవచ్చు. ఒక్కోసారి తల్లే లేకపోవచ్చు! అయినా సరే.. ఆకలితో డొక్కలు ఎగిరేలా బిడ్డ ఏడ్వకూడదు. ఏడ్చాడంటే.. పాలు లేవని కాదు. అమ్మ లేదని కాదు. ఆ బిడ్డ జీవించే హక్కును కాపాడేవారు లేరని! పాలిచ్చే తల్లి లేకపోయినా..పాలు పంచే తల్లులకు కొదవలేదని ‘ధాత్రి’ నిరూపిస్తోంది.అభాగ్య శిశువులకు ప్రాణధారలు పోస్తోంది. పుట్టిన ప్రతి బిడ్డా బతికి బట్టకట్టాలి. తల్లి గర్భంలో జీవం పోసుకున్నప్పుడే జీవించే హక్కుకు తనతో భూమ్మీదకు తెచ్చుకుంటుంది ప్రాణి. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే కాదు, సమాజంలో అందరి మీదా ఉంటుంది. అయితే అందరూ అన్ని బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లే కనిపిస్తుంటుంది. అయినా చంటిబిడ్డల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు వైద్యం అందక ప్రాణాలు పోతున్న చంటిపిల్లల కంటే తల్లిపాలు లేక మరణాన్ని ఆశ్రయిస్తున్న వాళ్లే ఎక్కువ అంటే నమ్మడానికి బాధగానే ఉంటుంది. అయినా ఇది నిజం. ఇరవై ఒకటో శతాబ్దంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ ఎంత గొప్ప హాస్పిటల్ అయినా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బిడ్డలకు వైద్యం మాత్రమే చేయగలుగుతుంది. ఆ బిడ్డకు తల్లి పాలనివ్వడం ఇటు హాస్పిటల్ చేతిలోను, అటు వైద్యరంగం చేతిలోను లేని విషయం. బిడ్డకు తల్లిపాల కొరతను తీర్చే టానిక్ను ఇవ్వడం వైద్యరంగం చేయలేని పని. ఇది కేవలం మరో తల్లి మాత్రమే చేయగలిగిన పని. అందుకే పుట్టే బిడ్డల కోసం తల్లిపాల బ్యాంకులు కూడా పుట్టాయి. ‘ధాత్రి’ కూడా అలాగే పుట్టింది. ధాత్రి అంటే పెంపుడు తల్లి. ‘‘తల్లికి దూరమైన బిడ్డను కన్నతల్లిలా పెంచే మరో మహిళను ధాత్రి అంటారు. అందుకే తల్లిపాలకు దూరమైన బిడ్డలకు తన పాలిచ్చి కాపాడే తల్లి పాల బ్యాంకుకు ధాత్రి అని పేరు పెట్టాం’’ అని చెప్పారు హైదరాబాద్, నీలోఫర్ హాస్పిటల్లోని తల్లిపాల బ్యాంకు నిర్వహకులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్. పాలిచ్చే అమ్మ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ... తల్లి పాలు లేక తల్లడిల్లుతున్న మరో బిడ్డకు ఒక పూట పాలివ్వడం మనకు పూర్వం నుంచి ఉన్న సంప్రదాయమే. ఒక అవసరం నుంచి ఆర్ద్రతతో పుట్టుకొచ్చిన సహాయం ఇది. పురిటిలోనే తల్లి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ తల్లిలేని బిడ్డకు మరో బాలింత తన మాతృత్వాన్ని పంచేది. తన బిడ్డతోపాటు తల్లిలేని బిడ్డకు కూడా ప్రాణం పోసేది. ఒక తల్లి అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఆమె కోలుకునే వరకు ఆ బిడ్డను మరో తల్లి ఆదుకునేది. విదేశాల్లో ‘వెట్ నర్సింగ్’ పేరుతో పిలిచినా, మనదేశంలో దాదమ్మ అని, పాల దాది అని, పాలమ్మ అనీ పిలిచినా... ఆ పాలిచ్చిన తల్లిని కన్నతల్లితో సమానంగా ప్రేమించేవాళ్లు పిల్లలు. పాలిచ్చిన తల్లులు... ఆ బిడ్డకు తన కన్నబిడ్డతో సమానంగా ప్రేమను పంచేవాళ్లు. ఇప్పుడూ ఉన్నారు ‘‘కెరీర్ కోసం పరుగులు తీసే క్రమంలో తల్లులు తమ బిడ్డలకు పాలివ్వడానికి కూడా టైమ్ లేకుండా ఉంటున్నారు. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన మా ప్రయత్నం సఫలమైంది. మా హాస్పిటల్కి వచ్చే మహిళలు తమ బిడ్డలకు పాలిస్తూ, మరో తల్లి బిడ్డకు కూడా పాలిస్తున్నారు’’ అంటున్నారు ధాత్రి మదర్ మిల్క్ బ్యాంకు స్థాపకులు డాక్టర్ సంతోష్కుమార్. ‘‘నెలలు నిండక ముందే పుట్టే పిల్లలను, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను ఇంక్యుబేటర్లో ఉంచి చికిత్స చేస్తాం. ఇతర అనారోగ్యాలతో పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. ట్రీట్మెంట్ సమయంలో బిడ్డకు పాలు పట్టాల్సిన ప్రతిసారీ తల్లి అందుబాటులో ఉండడం సాధ్యం కాదు. మా హాస్పిటల్కి వైద్యం కోసం వచ్చే చంటిపిల్లలు రోజూ మూడు వందల మందికి తగ్గరు. అంతకుముందు వాళ్లందరికీ ఫార్ములా పాలు, ఇతర పోతపాలు పట్టేవాళ్లం. అయితే రోజుల బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. తల్లిపాలలో ఉండే హెచ్ఎమ్వో బిడ్డ పేగును రక్షిస్తుంది. ఇతర ఏ పాలు పట్టినా జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపించేది. దాంతో ఒక సమస్య నుంచి బయటపడిన బిడ్డ మరో సమస్యతో బాధపడాల్సి వచ్చేది. దీనికి పరిష్కారం తల్లిపాల బ్యాంకును స్థాపించడమే అనుకున్నాం. మా ప్రయత్నం విజయవంతమైంది. శిశు మరణాలను తగ్గించగలిగాం. నీలోఫర్ హాస్పిటల్లో రోజుకు నాలుగున్నర లీటర్ల పాలను ప్రాసెస్ చేసి అనారోగ్యంతో ఉన్న చంటిబిడ్డలకు, అనాథ బిడ్డలకు అందించగలుగుతున్నాం. రోజుకు తొమ్మిది లీటర్ల పాలను సేకరించగలిగితే తల్లిపాల కోసం తపించే బయటి పిల్లలకు కూడా ఇవ్వడం సాధ్యమవుతుంది’’ అన్నారాయన. వచ్చి ఇస్తున్నారు నీలోఫర్ హాస్పిటల్కి రోజూ యాభై మంది వరకు పాలిచ్చే తల్లులు వస్తున్నారు. వచ్చేవారిలో ఓ ఇరవై మంది కేవలం పాలను డొనేషన్ ఇవ్వడానికే ఇస్తున్నారు. తన బిడ్డ తాగిన తర్వాత అదనంగా ఉన్న పాలను మరో బిడ్డకు ఇవ్వడం కోసమే హాస్పిటల్కి వస్తున్న తల్లులు వాళ్లు. మరికొంత మంది హాస్పిటల్లో పంప్ సహాయంతో పాలు తీసి తమ బిడ్డకు అవసరమైనన్ని తమతో ఇంటికి తీసుకువెళ్తారు, కొన్ని పాలను హాస్పిటల్లో ఉన్న పిల్లలకు ఇస్తారు. బ్రెస్ట్ పంప్ సహాయంతో పాలను బాటిల్స్లోకి సేకరిస్తారు. అలా అందరి పాలను కలిపేసి పాశ్చరైజ్ చేస్తారు. పాశ్చరైజేషన్ ప్రక్రియకు సుమారు రెండున్నర గంటల సమయం పడుతుంది. పాశ్చరైజేషన్ తర్వాత పాలను కొత్త బాటిల్స్లో నింపుతారు. అవి పిల్లలు తాగడానికి సిద్ధంగా ఉన్న పాలు. ఈ పాలను మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే ఏడాది పాటు తాజాగా ఉంటాయి. – డాక్టర్ సంతోష్ కుమార్,ఫౌండర్ డైరెక్టర్, ధాత్రి లాక్టేషన్ సెంటర్ ఇంట్లో నిల్వ చేసిన పాలు ఉద్యోగాలకు వెళ్లే తల్లులు ఇంట్లోనే బ్రెస్ట్ పంప్తో పాలను తీసి బిడ్డకు తాగించవచ్చు. తల్లి నుంచి తీసిన పాలను మన వాతావరణంలో గది ఉష్ణోగ్రతలో ఉంచినా కూడా నాలుగు గంటల వరకు తాజాగా ఉంటాయి. అంతకంటే ఎక్కువ సేపు నిల్వ చేయాల్సి వస్తే ఫ్రిజ్లో పెట్టి 24 గంటల వరకు వాడుకోవచ్చు. డీప్ ఫ్రిజ్లో నిల్వ చేసిన పాలు 72 గంటల వరకు తాజాగా ఉంటాయి. వీటికి పాశ్చరైజేషన్ అవసరం లేదు. బ్యాంకులు పెరగాలి బాలింతలున్నారు, చంటిబిడ్డలూ ఉన్నారు. ఆ ఇద్దరినీ కలిపే వార«ధులే తల్లి పాల బ్యాంకులు. మనదేశంలో ఈ మదర్ మిల్క్ బ్యాంకులు పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి. అది కూడా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పూనా, ఉదయ్పూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒకతల్లి పాల బ్యాంకును స్థాపించగలిగితే శిశుమరణాలనేవి లేకుండా చేయవచ్చు. మా హాస్పిటల్లో మిల్క్ బ్యాంకు స్థాపించడానికి ఎనభై లక్షలైంది. నిర్వహణ వ్యయం నెలకు లక్షన్నర వరకు అవుతోంది. పుట్టిన ప్రతి బిడ్డా ఆరోగ్యంగా పెరగాలంటే తల్లి పాలు తప్పని సరి. హెల్దీ నేషన్ బిల్డింగ్లో ప్రధానమైన వాళ్లు చంటిబిడ్డలే. అందుకే ఈ మాత్రం ఖర్చుకు ప్రభుత్వాలు వెనుకాడకూడదు.– డాక్టర్ శ్రీనివాస్ గౌడ్,డైరెక్టర్, ధాత్రి కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్,నీలోఫర్ హాస్పిటల్, హైదరాబాద్ కంటిరెప్ప కంటే ఎక్కువే ‘‘ధాత్రి అనే పాపాయి 900 గ్రాముల బరువుతో పుట్టింది. నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి రెండున్నర నెలల పాటు పాశ్చరైజ్ చేసిన మదర్ బ్యాంకు పాలను పట్టాం. పాపాయి బరువు రెండున్నర కేజీలకు పెరిగే వరకు అలా కాపాడాం. కేజీ బరువు కూడా లేకుండా భూమ్మీదకొచ్చిన బిడ్డలను బతికించడం చిన్నసంగతి కాదు. కంటికి రెప్పలా కాపాడాం అనేది చాలా చిన్న మాటే అవుతుంది. అలాంటి సంక్లిష్ట స్థితిని ధైర్యంగా దాట గలిగింది తల్లి పాల ఆసరాతోనే. తల్లి పాలను పాశ్చరైజ్ చేసి, మైనస్ 20 డిగ్రీలలో నిల్వ చేస్తే ఏడాది వరకు నిల్వ ఉంటాయి. తల్లిపాలంటే ద్రవరూపంలో ఉన్న బంగారం. బిడ్డకు ఒంటి నిండా బంగారంతో నింపడం కంటే బంగారంలాంటి తల్లిపాలనిచ్చి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేద్దాం’’ అన్నారు డాక్టర్లు.– వాకా మంజులారెడ్డి -
తల్లిపాలకు దూరం..దూరం..!
సాక్షి, సిటీబ్యూరో: అమ్మపాల స్థానాన్ని ‘అమ్మకపు’ పాలు ఆక్రమించేశాయి. ఆధునిక జీవన శైలి, పని ఒత్తిడి తల్లీ పిల్లల అనుబంధాన్ని శాసిస్తున్నాయి. సకల సౌకర్యాలతో తులతూగుతున్న నవతరం శిశువులు అమ్మ మురిపాలకు, చనుబాలకు నోచుకోలేక పోతున్నారు. చాలా మంది పోతపాలే ఆహారంగా పెరుగుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమిత మైన ఈ విషసంస్కృతి నేడు పల్లెలకు సైతం పాకింది. బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన అన్ని రకాల పోషకాహారాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, క్యాల్షియం, ఐరెన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఎన్ఎఫ్హెచ్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 22 శాతం మంది చిన్నారులు మాత్రమే పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగుతుండగా, 30 శాతం మంది అసలు తల్లిపాల రుచే ఎరుగడం లేదు. దీంతో అనేక మంది చిన్నారులు వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. ఏటా వెయ్యి కోట్లపైనే వ్యాపారం నాగరికతపై ఉన్న మోజు...అందం చెడిపోతుందనే అపోహ.. ఉద్యోగం... సంపాదన..పనిఒత్తిడి... మారిన జీవనశైలి.. తదితర కారణాల వల్ల ఆధునిక తల్లులు డబ్బాపాలను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఏడాదికి దాదాపు 1.5లక్షల మంది శిశువులు జన్మిస్తుండగా, వీరిలో 75 శాతం మందికి డబ్బా పాలే దిక్కవడంతో పాల పౌడర్, సీసాల ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెల్లో ఒక్కో పాల సీసా ధర రూ.90 నుంచి రూ. 200 పలుకుతుండగా, పాలపౌడర్ ధర కూడా రూ.130 నుంచి రూ.180 పలుకుతోంది. పోతపాల వల్ల తల్లికి బిడ్డపై, బిడ్డకు తల్లిపై ఉండాల్సిన ప్రేమ తగ్గుతోంది. వయసు వచ్చాక ఇరువురి మధ్య దూరం పెరుగడంతో పాటు చాలా మంది తల్లులు రొమ్ము, అండాశయ క్యాన్సర్కు గురవుతున్నారు. బిడ్డకు తల్లిపాలే శ్రేష్ఠం అప్పుడే పుట్టిన పిల్లలకు అందే మొట్టమొదటి ప్రకృతిసిద్ధ ఆహారం తల్లిపాలు. జీవితంలోని తొలి మాసంలో పిల్లలకు అవసరమైన శక్తి, పోషకాలను అందించడమే కాకుండా ఆరు నుంచి పన్నెండు నెలలకు, ఏడాది నుంచి ఏడాదిన్నర వరకూ వారి పోషక అవసరాలను ఎక్కువ వరకూ తల్లిపాలు అందిస్తాయి. స్పర్శ, మానసిక వికాసాన్ని తల్లిపాలు పెంపొందిస్తాయి. పిల్లలకు అంటు, దీర్ఘకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ప్రత్యేకంగా తల్లిపాలు బాల్యంలో వచ్చే డయేరియా , న్యుమోనియా లాంటి వ్యాధుల బారినుంచి తొందరగా కోలుకునేలా చేసి వారి ఆయుష్షు పెంచుతాయి. –డాక్టర్ అనిత కున్నయ్య, గైనకాలజిస్ట్, సిటిజన్ ఆస్పత్రి, నల్లగండ్ల -
అమ్మ పాలు... ఎంతో మేలు
తల్లిపాలలో ఎన్నో రకాలు పోషకాలు, యాంటీబాడీస్, పెరుగుదలకు దోహదపడే సంక్లిష్ట అంశాలు ఎన్నో ఉంటాయి. బిడ్డ పెరుగుదలకు దోహదపడే ఈ అంశాలన్నీ తల్లిపాలలో ఉంటాయి. వాటి గొప్పదనాన్ని వివరించాలంటే మాటలూ సరిపోవు. నేటి (ఆగష్టు 1) నుంచి 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల్లో సందర్భంగా తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించుకోడానికే ఈ కథనం. మిగతా వారితో పోలిస్తే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. శారీరకంగానూ, మానసికంగానూ బాగా ఆరోగ్యంగా ఎదుగుతారు. రోగాలను సమర్థంగా ఎదుర్కొంటారు. తల్లిపాలుతాగితే... ఆ రోగనిరోధక శక్తి వారికి సహజంగానే సమకూరుతుంది. తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉన్నాయి. వాటన్నింటినీ కృత్రిమంగా తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. అందుకే కృత్రిమంగా తయారుచేసే ఫార్ములా పాలేవీ తల్లిపాల దరిదాపుల్లోకి కూడా రాలేవు. తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు తల్లిపాలతో అటు బిడ్డకూ, ఇటు తల్లికీ, మరోవైపు సమాజానికీ... ఇలా ఎన్నోరకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు. తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి... జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. కానీ ఫార్ములా పాలు/పోతపాలతో జీర్ణకోశ ఇబ్బందులొస్తాయి. ఆస్తమా: తల్లిపాలు బిడ్డకు సరిపడకపోవడం అంటూ ఉండదు. కానీ పోతపాలుగా ఇచ్చే యానిమల్ మిల్క్ చాలావరకు బిడ్డకు సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో పాటు తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ∙బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ ∙పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పోతపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ∙చిన్నప్పుడు వచ్చే (ఛైల్డ్హుడ్) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ∙నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులకు అవకాశాలూ తక్కువే. తల్లికీ చేస్తాయి మేలు: బిడ్డకు పాలు పడుతుండటం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాల్లో కొన్ని... ∙పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది ∙పాలిచ్చే తల్లుల బరువు స్వాభావికంగా తగ్గుతుంది. దాంతో బరువు రిస్క్ ఫ్యాక్టర్గా గల అనేక జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది ∙అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది ∙డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ ∙ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు తక్కువ.-డాక్టర్ భావన కాసుఅబ్స్ట్రిటీషియన్ అండ్ గైనకాలజిస్ట్బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్ -
చిన్ని పొట్టకు కష్టాలా?
సాక్షి బెంగళూరు: చిన్నారి శిశువుకు ప్రపంచంలో తల్లి పాల కంటే స్వచ్ఛమైన పౌష్టికాహారం లేదు. శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి, అలాగే తల్లి క్షేమా ని కి కూడా స్తన్యమివ్వడం ఎంతో దోహదం చేస్తుంది. అయితే దాదాపు 70 శాతం మాతృమూర్తులు పిల్లలకు స్తన్యం ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఒక సర్వేలో తేలింది. కొన్ని ఆరోగ్య కారణాలు, పనిచేసే చోట తగిన వాతావరణం లేకపోవడం ఇందుకు కొన్ని కారణాలుగా తేలింది. ఏటా ఆగస్టు తొలివారాన్ని (1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు) ‘ప్రపంచ తల్లిపాల వారం’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామ్ప్రెస్సో అనే సంస్థ నిర్వహించిన సర్వేలో శిశువుల తల్లుల సమస్యలు వెలుగుచూశాయి. 510 మంది నుంచి అభిప్రాయ సేకరణ మొత్తం 510 తల్లుల నుంచి అభిప్రాయాలు సేకరించి సంస్థ ప్రతినిధులు అధ్యయనం జరిపారు. సర్వే ప్రకారం 70 శాతం తల్లులు పిల్లలకు పాలివ్వడం ఎంతో సవాలుతో కూడుకున్న పనిగా తే ల్చారు. వీరిలో 78 శాతం మంది పిల్లలకు సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం పాలిస్తున్నారు. స్తన్యం వల్ల చంటిపిల్లలు ఆరోగ్యంగా ఉం టారని 98.6 శాతం మాతృమూర్తులు పేర్కొ న్నారు. 57.5 శాతం మందిలో తల్లి ఆరోగ్యం మెరుగైనట్లు, ప్రసవం తర్వాత తల్లి బరువు 39.7 శాతం మందిలో తగ్గినట్లు సర్వేలో తేలింది. ఏ తల్లైనా తన బిడ్డ ఆరోగ్యంగా, అందంగా ఉండాలని కోరుకుంటుంది. చకచకా ఎదగాలని, ఎలాంటి అనారోగ్యం దరిచేరకూడదని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటుంది. అయితే అందుకు దోహదం చేసే తల్లిపాల విషయంలో అంత అవగాహన లేదని ఒక సర్వే చెబుతోంది. తల్లీబిడ్డకు ఆరోగ్యాన్ని పెంపొందించే తల్లిపాల ప్రాధాన్యం పై ప్రచారం మరింత పెరగాల్సి ఉంది. ఇవే ప్రధాన ఆటంకాలు ♦ తల్లుల సమస్యల విషయానికి వస్తే 31.8 శా తం మంది పిల్లలకు అర్ధరాత్రులు లేదా ఎక్కువసార్లుపాలివ్వడంఇబ్బందిగామారినట్లు చెప్పారు. ♦ 17.8 శాతం మంది బహిరంగ ప్రాంతాల్లో స్తన్యమివ్వడం ఇబ్బందిగా ఉందన్నారు. ♦ 38 శాతం మంది తొలిసారి తల్లయినవారు అయోమయానికి గురవుతున్నారు. ♦ స్తన్యమెలా ఇవ్వాలి అని ఇతరుల సలహాలను తీసుకుంటున్నారు. 24 శాతం మంది తమ తోటి వారి దగ్గరి నుంచి సమాచారం సేకరించగా, 24 శాతం మంది ఇంటర్నెట్ ద్వారా, 19.9 శాతం మంది వైద్యుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తల్లి పాలను మించిన బహుమతి లేదు అప్పుడే పుట్టిన శిశువులకు తల్లిపాల కంటే విలువైన బహుమతి మరొకటి ఉండదు. పుట్టిన తొలి గంట నుంచి తొలి ఆరు నెలల పాటు శిశువుకు స్తన్యపానం ఇవ్వడం వల్ల వారి మిగిలిన జీవితంలో దాని తాలుకు లాభాలను శిశువులు పొందుతారు. తల్లిపాలు శిశువుకు కావాల్సిన అన్ని రకాల పౌష్టిక విలువలను అందజేస్తుంది. రెండేళ్ల వయసు వరకు కూడా శిశువుకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించవచ్చు. స్తన్యపానం వల్ల శిశువు మానసిక, శారీరకంగా మిగిలిన జీవితాన్ని ఆరోగ్యంగా జీవించడంలో సహకరిస్తుంది. – డాక్టర్ దేవిక, డా.అనితా కె. మోహన్, గైనకాలజిస్టులు, బెంగళూరు -
అమ్మపాలే అమృతం!
తల్లిపాలే పిల్లలకు అమృత తుల్యం. బిడ్డ శారీరక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. నవజాత శిశువుకు బలం చేకూర్చే ఆహారం తల్లిపాలేనని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, ఈ విషయం తెలిసినా చాలా మంది ముర్రుపాలు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. అపనమ్మకం, అభద్రతా భావం కారణం ఏదైతేనేం బిడ్డకు పాలు అందించేందుకు అయిష్టత చూపుతున్నారు. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధకశక్తి తగ్గి భవిష్యత్తులో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తల్లి పాల ఆవశ్యకతను తెలుపుతూ ప్రభుత్వం ఏటా వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐసీడీఎస్ శాఖ నేటి నుంచి 7వ తేదీ వరకు వారోత్సవాలను చేపట్టనుంది. దీనిపై ప్రత్యేక కథనం. చిత్తూరు రూరల్: జిల్లా వ్యాప్తంగా 1,95,362 మంది చిన్నారులు ఉండగా.. 10,108 మంది పోషకాహార లోపంతో ఇబ్బందిపడుతున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, పుట్టిన బిడ్డకు తల్లి పాలు అందించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. బిడ్డ పుట్టిన వెంటనే 70 శాతం మంది తల్లులు బిడ్డలకు ముర్రుపాలు అందిస్తుండగా, కేవలం 30 శాతం మంది మా త్రమే ఆరు నెలల పాటు పాలు పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. మొదటి రెండు రోజులు కీలకం.. బిడ్డ పుట్టిన మొదటి రెండు రోజులు ఎంతో కీలకమని వైద్యనిపుణులు చెబుతున్నారు. పుట్టిన కొద్దిసేపటికే ముర్రుపాలు తాగేలా చూడాలి. ఈ రోజుల్లో ఇచ్చే పాలల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇందులో రోగ నిరోధకశక్తి పెంచే అంశాలు ఉం టాయి. బిడ్డ పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఎంతగానో దోహదపడుతుంది. దీంతో పాటు ఆరు నెలల వరకు తల్లిపాలను మాత్రమే అందించాలి. తర్వాత మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన ప్రోటీన్లు, పోషకాలు, మాంసకృత్తులు, పిండి పదార్థాలన్నీ సమత్యులంగా తల్లిపాలల్లో లభిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఆరు నెలల వరకు తల్లిపాలనే పట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తోంది. తల్లికీ పోషకాలు అవసరం ప్రసవం తరువాత బాలింతలు తీసుకునే ఆహారం కూడా పోషక విలువలు కలిగి ఉండాలని వైద్యులు చెబుతున్నారు. తల్లి పోషకాహారం తీసుకుంటే బిడ్డకు కూడా అలాంటి ఆహారాన్ని అందించేందుకు అవకాశం ఉంటుంది. రోజూ 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల పప్పు, 150 గ్రాముల కూరలు, ఉడకబెట్టిన గుడ్డు, ఓ పండు, 100 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. ప్రతి రోజూ ఆహారంలో పప్పు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వారం రోజుల పాటు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. తల్లిపాలు బిడ్డకు అందించడం ద్వారా ఎలాంటి లాభాలు చేకూరతాయనే అంశంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తాం. – ఉషా ఫణికర్, ఐసీడీఎస్ పీడీ తల్లి పాలే బిడ్డకు శ్రీ రామరక్ష ప్రసవం జరిగిన రెండు గంటల్లోగా తల్లిపాలను బిడ్డకు అందించాలి. ఆరు నెలల పాటూ అందిస్తూ ఉండాలి. చాలా మంది అవగాహన లోపంతో ప్రసవం తర్వాత ఇవ్వడం లేదు. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపైన, ఆరోగ్యంపైన భవిష్యత్తులో ప్రభావం పడుతుంది. – సరళమ్మ, డీసీహెచ్ఎస్ ప్రయోజనాలు ఇలా.. ♦ పోతపాలు తాగే వారితో పోలిస్తే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు తక్కువని పలు పరిశోధనల్లో తేలింది. ♦ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. ఎముకల పుష్టి బాగుంటుంది. ♦ కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే శాతం తక్కువ. మానసిక రుగ్మతలూ దూరమవుతాయని వైద్యునిపుణులు చెబుతున్నారు. ♦ పాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది. ♦ కాన్పు తరువాత వచ్చే కొన్ని రకాల మానసిక వ్యాధులు తల్లి దరిచేరవు. ♦ బిడ్డకు పాలిచ్చే స్త్రీలో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది. -
బందీగా అమ్మ... ఆకలితో పసికూన
మూడు నెలల పదకొండు రోజుల వయసున్న ఈ పసికూనకు మాట్లాడే శక్తే ఉంటే.. తన తల్లిని ఇలాగే వేడుకునేవాడేమో...!!! ఆ తల్లి ఎవరు..? ఎక్కడికెళ్లింది...? పసికూనకు ఎందుకు దూరమైంది,...? వీటికి సమాధానమే ఈ కథనం... ఇల్లెందు : ఇదొక ప్రేమికుడి వేదన. ఇదొక ప్రియురాలి యాతన. ఇదొక పసికూన రోదన. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన ఆమె పేరు బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన అతడి పేరు బళ్లెం కళ్యాణ్. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. గార్ల శివాలయంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ–పెళ్లికి రజిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారి నుంచి తామిద్దరికీ ప్రాణ భయం ఉందంటూ గార్ల పోలీసులను ఆ ప్రేమ జంట ఆశ్రయించింది. వారిని ఇల్లెందు పోలీస్ స్టేషన్కు గార్ల పోలీసులు పంపించారు. రజిత తల్లిదండ్రులను ఇల్లెందు పోలీసులు పిలిపించారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తరువాత, రజిత– కళ్యాణ్ జంట హైదరాబాద్ వెళ్లింది. అక్కడే ఉంటున్నారు. రజిత గర్భవతయింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ముల్కనూరుకు వచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. రజితతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు ఫోన్లో మాట్లాడసాగారు. యోగ క్షేమాలు తెలుసుకోసాగారు. మార్చి 19న పండంటి బాబుకు రజిత జన్మనిచ్చింది. బాబును, రజితను చూసేందుకు తల్లిదండ్రులు పలుమార్లు ముల్కనూరు వచ్చారు. రజిత–కళ్యాణ్ కుటుంబాల మధ్య సుహృద్బావ వాతావరణం ఏర్పడింది. వారం రోజుల కిందట రజిత అస్వస్థురాలైంది. ఆమె కుటుంబీకులకు తెలిసింది. ఇల్లెందులోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తామన్నారు. కళ్యాణ్–రజిత దంపతులు తమ పసికూనతో ఇల్లెందు చేరుకున్నారు. ప్రైవేటు వైద్యశాలలో రజితకు ఆమె కుటుంబీకులు వైద్యం చేయించారు. ఆ దంపతులు ఆ రోజు సాయంత్రం ముల్కనూరు చేరుకున్నారు. ఇంటికి రావాలంటూ రెండు రోజుల కిందట రజిత కుటుంబీకుల నుంచి పిలుపొచ్చింది. బాబును తీసుకుని కళ్యాణ్–రజిత ఇల్లెందు వచ్చారు. ఆమెను మిట్టపల్లిలోని పుట్టింటికి పంపించాడు. ఆ పసికూనకు ఆరోగ్యం బాగోలేదు. సాయంత్రానికి రావాలని, అప్పటివరకు బాబును తన వద్దనే ఉంచుకుంటానని అన్నాడు. ఆమె సరేనంది. తన పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం వరకు కళ్యాణ్తో రజిత ఫోన్లో మాట్లాడింది. మరో గంటలో బయల్దేరుతానని చెప్పింది. సాయంత్రమైంది. ఆమె రాలేదు. బాబు ఏడుస్తున్నాడు. రజితకు ఫోన్ చేశాడు. ఆమె కుటుంబీకులు మాట్లాడారు. ‘‘రజిత రాదు. నీ దిక్కున్న చోట చెప్పుకోపో...’’ – అటు నుంచి వచ్చిన సమాధానమిది. ఈ హఠాత్పరిణామంతో కళ్యాణ్కు నోట మాట రాలేదు. శనివారం సాయంత్రమైంది. ఆ పసికూనకు ఒకటిన్నర రోజుపాటు తల్లి పాలు లేవు. పాపం.. ఆకలవుతుందేమో..! గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కళ్యాణ్కు ఎటూ పాలుపోలేదు. పసికూనను ఎత్తుకుని, తన తల్లి సువార్తతో కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. జరిగినదంతా చెప్పాడు (ఫిర్యాదు చేశాడు). పోలీసులు స్పందించడం లేదని కళ్యాణ్ అంటున్నాడు. తనకు, తమ బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఎస్సై ఏమంటున్నారంటే.... దీనిపై ఇల్లెందు ఎస్ఐ బి.రాజును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘తన భార్య రజితను మిట్టపల్లిలోని ఆమె పుట్టింటి వాళ్లు బంధించారంటూ పోలీస్ స్టేషన్కు కళ్యాణ్ వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం మిట్టపల్లి నుంచి రజితను, తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి విచారిస్తాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం ఖమ్మానికి రిఫర్ చేస్తాం. తనను బంధించినట్టుగా రజిత చెప్పలేదు. ఆమెను బంధించినట్టుగా ఆ గ్రామానికి చెందిన ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఎవరైనా చెబితే... ఆ కుటుంబంపై చర్యలు తీసుకుంటాం. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉండవచ్చు. అలాంటప్పుడు ఆమెను బంధించినట్టు ఎలా అవుతుంది...? బంధించారని కళ్యాణ్ చెబితే సరిపోదు’’ అని, ఎస్సై అన్నారు. పాపం.. పసికూన.. ‘‘తల్లి నులివెచ్చని స్పర్శకు, పాలకు దూరమైన ఆ పసికందు పరిస్థితేమిటి..? తల్లిపాలకు దూరమై నిన్నటి రాత్రికి ఒకటిన్నర రోజు. ఎస్సై చెప్పినట్టుగా... కౌన్సిలింగ్ జరిపించి, తల్లి వద్దకు బిడ్డను పంపించేసరికి ఎన్ని గంటలు.. ఎన్ని రోజులు పడుతుందో...? అప్పటివరకు ఆ పసికందు ఆకలిదప్పులు, ఆరోగ్యం పట్టించుకునేదెవరు..? (పసిపిల్లల సంరక్షణ.. తండ్రికన్నా తల్లితోనే సాధ్యం కదా..!)’’ ఈ జంట–పసికూన వ్యవహారం తెలిసిన–చూసిన వారందరి ఆవేదన ఇది -
తల్లి పాలలో పాము విషం.!
సాక్షి, లక్నో : పాము కాటుకు ఓ మాతృమూర్తి మరణించగా, ఆమె పాలు తాగిన మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఓ తల్లి.. తన కూతురితో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఓ పాము ఆమెను కాటేసింది. నిద్ర లేచాక తన బిడ్డకు పాలిచ్చింది. అప్పటికే పాము విషం ఆమె శరీరమంతా వ్యాపించడంతో.. ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు కాటేసిన పామును ఇంట్లోనే మరో గదిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు దీనిని యాక్సిడెంటల్ డెత్గా కేసు నమోదు చేసుకున్నారు. -
తల్లిపాలే విషమై..
మాడ్గుల: తల్లి పాలు అమృతతుల్యం. ఓ గుక్కెడు తల్లి పాలు చిన్నారి జానెడు పొట్టకు ప్రాణాధారం. కానీ ఆ గుక్కెడు పాలే ఓ పసిమొగ్గ పాలిట విషమయ్యాయి. తనపై పడిన క్రిమిసంహారక మందును గుర్తించని ఆ మాతృమూర్తి.. పాల కోసం అల్లాడుతున్న కుమార్తెకు పాలు పట్టి తన కనుపాపనే కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామంలో చోటు చేసుకుంది. భర్తను కాపాడుకున్నా.. ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య ఈ నెల 25న రాత్రి మద్యం మత్తులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇది గమనించిన మల్లయ్య భార్య లక్ష్మీదేవి భర్త ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుంది. ఆ ప్రయత్నంలో లక్ష్మీదేవి ఛాతీపై క్రిమిసంహారక మందు పడింది. అయితే దీనిని లక్ష్మీదేవి గమనించలేదు. భర్తను ఎలాగైనా రక్షించుకోవాలనే ఆందోళనలో చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఇంటి దీపం ఆరిపోయింది.. అదే సమయంలో తన మూడేళ్ల కూతురు ప్రణీత పాల కోసం గుక్కపట్టి ఏడుస్తుండగా.. లక్ష్మీదేవి తన ఛాతీపై క్రిమిసంహారక మందు పడిన విషయం గమనించకుండా తన కూతురుకు పాలు పట్టింది. ఆ పాలు తాగిన ప్రణీత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణీత బుధవారం కన్నుమూసింది. తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో శిశువుల ఆకలి తీర్చే మదర్ మిల్క్ బ్యాంక్
-
తల్లిపాల వారోత్సవాలు నిరంతర ప్రక్రియ
హన్మకొండ అర్బన్ : తల్లిపాల వారోత్సవాల పేరుతో వారం పాటు కార్యక్రమాలు అంగన్వాడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ ఇది అంగన్వాడీ కార్యకర్తలకు నిరంతర ప్రక్రియ అని ఐసీడీఎస్ హన్మకొండ రూరల్ సీడీపీఓ శైలజ అన్నారు. కలెక్టరేట్లోని కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన ప్రాజెక్టు సమావేశంలోఆమె మాట్లాడుతూఅంగన్వాడీలు నిత్యం లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆహారం తప్పనిసరిగా కేంద్రంలోనే తినే విధం గా చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలోనే ఆహారం ఇవ్వాలని వారి బంధువులకు ఇచ్చి హాజరు వేసుకోవడం మానుకోవాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ కార్యకర్త ఆయా అందుబాటులో ఉండాలన్నారు. ఇటీవల శాసనసభా కమిటీ జిల్లాకు వచ్చిన సందర్భంగా వీరి పరిశీలనలో పనితీరు బాగున్నట్లు తేలిందని సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. వివిధ సెక్టార్ల సూపర్వైజర్లు, ఏసీడీపీఓతో పాటు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
తల్లిపాలే శ్రేష్టం
-
తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన
ఆదిలాబాద్ రిమ్స్ : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆడిటోరియంలో తల్లిపాల ప్రాముఖ్యతపై ఆస్పత్రిలోని బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. డబ్బా పాలు వద్దు.. తల్లిపాలే ముద్దు.. అనే అంశంపై రిమ్స్లో మూడో సంవత్సరం వైద్య విద్యార్థుల నాటక ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. వైద్య విద్యార్థులు విక్రాంత్, ప్రణయ్, హరిత, మాధురి, మానస, రమ్య, నిహారిక, స్నేహ, లేఖ, లలిత, రోహిత్, గీతలు నాటికలోని తల్లిదండ్రులు, ఆశవర్కర్, వైద్యులు, సర్పంచ్ పాత్రాల్లో నటించారు. గర్భందాల్చిన నాటి నుంచి ప్రసూతి అయ్యే వరకు, తర్వాత పుట్టిన పిల్లలకు తల్లిపాలు తాగించడం వరకు ప్రస్తుత సమాజంలో ఎలా జరుగుతుందనే విధానంపై వివరించారు. పిల్లల వైద్య నిపుణుడు సూర్యకాంత్ తల్లిపాల ప్రాముఖ్యతపై మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు తాగించాలని, వీటినే ముర్రపాలు అంటారని, ఇవి తాగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ పాలు కామెర్లు, విరేచనాల నుంచి బిడ్డను కాపాడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ అశోక్, ఆర్ఎంఓ డాక్టర్ వినయ్కుమార్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
తల్లిపాలు అమృతం
– బిడ్డకు బలమైన ఆహారం తల్లిపాల్లోనే.. – తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం మహబూబ్నగర్ క్రైం : పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు అమ్మపాలు అమృతంలా పనిచేస్తుంది. అమ్మ పాలతో ఆకలి తీర్చుకుంటేనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం. రోగనిరోదకశక్తి పెంచడంతోపాటు భవిష్యత్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. సోమవారం నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారం రోజులపాటు ప్రజలకు అమ్మపాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. వారోత్సవాల లక్ష్యం.. మాతృ దోహద చట్టం–1961 ప్రకారం ఏటా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళా ఉద్యోగులు, కార్మికులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు అనువైన పరిస్థితులు కరువడంతో 1993లో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి సంస్థలో మాతృదోహద పరిస్థితులు తీసుకురావాలనే లక్ష్యం నిర్దేశించారు. గతేడాది 2015 వారోత్సవాల్లో కూడా ఇదే ప్రధాన నినాదంగా పెట్టుకున్నారు. ఇవీ నిబంధనలు.. – ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో పని చేసే మహిళలు వారి బిడ్డలకు పాలిచ్చేందుకు అనువైన పరిస్థితులను, సదుపాయాలను కల్పించాలి. – బిడ్డను వెంట తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలి. – దినచర్యలో రెండుగంటల పాటు బిడ్డకు పాలిచ్చే అవకాశం కల్పిస్తూ విరామం ఇవ్వాలి. – వేతనంతో కూడిన ఆరునెలల ప్రసూతి సెలవు అమలు చేయాలి. అమ్మపాలతో లాభాలు.. – పుట్టిన బిడ్డకు అరగంటలోపు ముర్రుపాలు తాగిస్తే రోగనిరోదక శక్తి పెరుగుతుంది. – బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లిపాలు సహకరిస్తాయి. – బిడ్డకు సరిపడు ప్రోటీన్లు, కాల్షియం నిల్వలు తల్లిపాలలో మెండుగా ఉంటాయి. – అంటు వ్యాధుల నుంచి రక్షిస్తూ మలబద్దకం సమస్య తగ్గిస్తుంది. – బాల్యంలో యవ్వనంలో ఉబకాయం వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. – పుట్టిన బిడ్డకు చనుపాలు ఇవ్వటంతో రక్తస్రావ ప్రమాదం తగ్గి తల్లి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. – తల్లిపాలు జీర్ణమవడం చాలా తేలికగా ఉంటుంది. – బిడ్డకు వచ్చే వ్యాధులతో తల్లిపాలు పోరాడే శక్తినిస్తుంది – ఎముకల పెరుగుదలకు శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. – కంటిచూపు సంబంధించిన లోపాలు రాకుండా నియంత్రిస్తాయి. – బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదగడానికి తోడ్పడతాయి – తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. – తల్లికి బిడ్డకు మధ్య అనుబంధం పెరుగుతుంది – వెన్నముకలోని శక్తిని పెంచుతుంది పాలివ్వడం తల్లి బాధ్యత.. తాగడం బిడ్డ హక్కు ప్రసవం అనంతరం బిడ్డకు పాలివ్వడం తల్లి బాధ్యత. అలాగే తల్లిపాలు తాగడం బిడ్డ హక్కు. తల్లిపాలల్లో న్యూట్రీషన్స్ అధికంగా ఉండటంతో ప్రసవం అయిన ఆరు నెలల వరకు క్రమం తప్పకుండా పాలివ్వాలి. – డాక్టర్ లక్ష్మిపద్మప్రియ, గైనకాలజిస్టు -
ఆన్లైన్ తల్లిపాలతో ముప్పు
లండన్: ఆన్లైన్లో దొరికే తల్లిపాలతో ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బలవర్ధకంగా పేర్కొంటూ ఆన్లైన్లో అమ్మేపాలను తాగితే కేన్సర్, హెపటైటీస్, సిఫిలిస్, హెచ్ఐవీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని లండన్లోని క్వీన్ మేరి విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు కాగని తల్లిపాలను తాగడం వల్ల అంటు వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువని వారు హెచ్చరించారు. ఈ పాలతో ఐస్క్రీములు, ఇతర పాలఉత్పత్తులు తయారుచేసి అమ్మటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఈ పాలను తాగితే కండరాలు, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెబ్సైట్లు ప్రచారం చేస్తున్నాయనీ, కానీ వాటికి ఎలాంటి శాస్త్రీయఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చారు. -
అమ్మకు దూరమై.. పాలు కరువై..
తుర్కపల్లి, న్యూస్లైన్: తల్లి చనుబాల కోసం వారం రోజులుగా వెక్కివెక్కి ఏడ్చిన మూడునెలల చిన్నారి కన్నుమూసింది. అదనపు కట్నం తేవాలని అత్తింటివారు వేధించడంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, బిడ్డను కడసారి కూడా చూసుకోలేకపోయింది. హృదయ విషాదకరమైన ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగింది. తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన కొక్కండ నర్సింహులు, లక్ష్మీల కూతురు భవానికి ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు చెందిన బింగి సంతోష్తో వివాహం జరిగింది. మూడు నెలల క్రితం వారికి రుషికజన్మించింది. సంతోష్ అనారోగ్యం పాలవడంతో భవానికి అత్తింటివారి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భవాని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వారం రోజులుగా తల్లిపాలకు దూరమైన చిన్నారి రుషిక అమ్మమ్మ, తాతయ్య వద్దే ఉంటోంది. తల్లి కోసం ఏడ్చి ఏడ్చి అనారోగ్యం బారిన పడి రుషిక బుధవారం మృతి చెందింది.