-
కంటెస్టెంట్లకే షాక్: బిగ్బాస్ షో క్యాన్సిల్
ఎంతో ఉత్కంఠతో కొనసాగుతున్న బిగ్బాస్ రియాల్టీ షోపై కరోనా పడగ విప్పింది. వాస్తవంగా గతేడాది ప్రారంభం కావాల్సిన కన్నడ బిగ్బాస్ షో క్యాన్సిల్ సీజన్-8 ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత విశేష ప్రేక్షకాదరణతో షో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దేశంలో అత్యధికంగా కరోనా వ్యాపిస్తున్న రాష్ట్రంగా కర్నాటక నిలిచింది. దీంతో ఆ కరోనా ప్రభావం బిగ్బాస్ షోపై కూడా పడింది. వాటితోపాటు ఈ షోను హోస్ట్ చేస్తున్న కిచ్చా సుదీప్ అనారోగ్యం బారిన పడ్డాడు. కొన్నాళ్లు షోకు కూడా రాలేదు. అయినా కూడా షో విరామం లేకుండా కొనసాగింది. అయితే కరోనా కల్లోలం సృష్టిస్తుండడంతో కర్నాటకలో లాక్డౌన్ విధించారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో షో కొనసాగించడం కొంత ఇబ్బందికరంగా మారింది. కంటెస్టెంట్ల ఆరోగ్యం దృష్ట్యా వారిని ఇళ్లకు పంపించేసి ఈ షోను అర్ధాంతరంగా ప్రకటించారు. 71 రోజుల పాటు షో కొనసాగింది. చివరకు 8 మంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. వంద రోజుల షో 29 రోజులు మిగిలి ఉండగానే రద్దయ్యింది. ఈ నిర్ణయంతో ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లు కూడా షాకయ్యారు. కలర్స్ ఆధ్వర్యంలో ఈ షో కొనసాగింది. ప్రశాంత్ సమ్ బర్గీ, అరవింద్ కేపీ మధ్య ట్రోఫీ పోరు కొనసాగుతోంది. వైష్ణవి, శమంత్, దివ్య సురేశ్ టాప్ 5 రేసులో ఉన్నారు. ట్రోఫీ లేకుండానే షో ముగిసింది. అయితే కొన్ని రోజులకు షో విజేతను ప్రకటిస్తారని తెలుస్తోంది. కాకపోతే వారికి బహుమతులు, ట్రోఫీ ప్రదానం పరిస్థితులు చక్కబడ్డ తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం. చదవండి: రేపు కేబినెట్ భేటీ: లాక్డౌన్పై తేల్చనున్న సీఎం కేసీఆర్ చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ -
వైల్డ్కార్డ్ ఎంట్రీ!
మరాఠీ స్క్రిప్ట్ రైటర్కు బంపర్ ఆఫర్ తగిలినట్టుంది. బిగ్బాస్ 8లో అతడికి వైల్డ్కార్డ్ ఎంట్రీ దక్కింది. అది కూడా అలా ఇలా కాదు... రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్తో కలసి నడుస్తూ..! ఇతగాడిని ఈ స్టారే పరిచయం చేస్తుందట. బిగ్ బాస్ హౌస్లో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న కిమ్... తాను ఎంతో ఉత్సుకతకు లోనవుతున్నానని చెబుతోంది. ‘నమస్తే ఇండియా. నా పేరు కిమ్ కర్దాషియన్. భారత్కు వస్తున్నా’ అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది. ఆ క్రమంలోనే ఫైజల్ను ఆమె పరిచయం చేయబుతున్నట్టు సమాచారం. -
సల్మాన్ ఖాన్ కార్యక్రమాల బహిష్కరణ
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కార్యక్రమాలను బహిష్కరించాలని ఫోటోగ్రాఫర్లు నిర్ణయించారు. సల్మాన్ 'బిగ్ బాస్ 8' విలేకరుల సమావేశానికి కూడా వారు హాజరుకాలేదు. హిందీ సినిమా 'కిక్' ప్రమోషన్ కార్యక్రమంలో సల్మాన్ బౌన్సర్లు ఫొటోగ్రాఫర్లపై దాడికి దిగడం, ఆ తరువాత ఆ వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత మీడియా ప్రతినిధులు అతనిపై ఆగ్రహంతో ఉన్నారు. ఫొటోగ్రాఫర్ల నిర్ణయం తనకు నష్టపరిచేదైనప్పటికీ, వారి నిర్ణయాన్ని గౌరవిస్తానని సల్మాన్ అన్నారు. తాను వారిపై ఎటువంటి నిషేధం విధించలేదని, వారే తనను బహిష్కరించారని తెలిపారు. ఈ వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని మీరు అనుకుంటున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ముందు వారు శాంతియుతంగా మెలగడం అవసరం అన్నారు. వారు మర్యాదపూర్వకంగా వ్యవహరించినంతకాలం, తాను వారితో బాగానే ఉన్నట్లు తెలిపారు. అయితే తాను పాల్గొన్న కార్యక్రమాన్ని ఫొటోగ్రాఫర్లు చేపల మార్కెట్గా చేయడాన్ని తాను అంగీకరించనని సల్మాన్ చెప్పారు. **
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement