-
రైతుబిడ్డకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
బిగ్బాస్ సీజన్-7 విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే... ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
నాపై హత్యాయత్నం కుట్ర కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు జరపలేదు
సాక్షి, అమరావతి: తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేసేలా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశించాలన్న పిటిషన్ను విజయవాడ ఎన్ఐఏ కోర్టు కొట్టి వేయటాన్ని సవాల్ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రీ అభ్యంతరాలపై విచారణ జరిపే నిమిత్తం ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచి్చంది. న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి దీనిపై విచారణ జరిపారు. సీఎం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రిజిస్ట్రీ అభ్యంతరాలకు సంబంధించి నిరంజన్రెడ్డి వినిపించిన వాదనలతో న్యాయమూర్తి సంతృప్తి చెందారు. ఈ క్రమంలో ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ చంటి అనే వ్యక్తి ఆయనపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. నిందితుడు పదునైన కత్తితో వైఎస్ జగన్ మెడపై దాడికి ప్రయతి్నంచాడు. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమ చేయికి లోతైన గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ చార్జిïÙట్ దాఖలు చేసింది. వైఎస్ జగన్ను చంపడమే నిందితుడు శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయతి్నంచాడని ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్ర వ్యవహారాన్ని తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు నివేదించింది. అయితే అటు తరువాత కుట్ర కోణంపై ఎన్ఐఏ దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం ఘటన వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని అభ్యరి్థస్తూ సీఎం వైఎస్ జగన్ ఈ ఏడాది ఏప్రిల్లో విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో లోపాలను కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు దీన్ని కొట్టివేస్తూ ఈ ఏడాది జూలై 25న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఎం జగన్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యకాలీన పిటిషన్ (ఇంటర్లాక్యుటరీ)పై ఎన్ఐఏ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చా? అంటూ రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీనిపై విచారణ జరిపే నిమిత్తం పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచి్చంది. సీఎం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ వ్యాజ్యకాలీన పిటిషన్పై క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చని, పలు సుప్రీం కోర్టు తీర్పులను కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే పరిధి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు లేదన్నారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి జిల్లాలు విశాఖ ఎన్ఐఏ కోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ కేసును విచారించే పరిధి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు ఉత్తర్వులు చెల్లవన్నారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. -
పక్కా ప్లాన్ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు
సాక్షి, విజయవాడ: విశాఖ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసుపై సీఎం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు శ్రీనివాస్కు నేర చరిత్ర ఉందని ఎన్ఐఏ ఛార్జ్షీట్లో దాఖలు చేసిందని వెల్లడించారు. కాగా, సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నంపై కేసులో ఎన్ఐఏ 39 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు ఎన్ఐఏకి సిట్ వివరాలు అప్పగించలేదు. నిందితుడు శ్రీనివాస్కు నేర చరిత్ర ఉంది. 2017లో శ్రీనివాస్పై కేసు నమోదైంది. శ్రీనివాస్ పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్ఐఏ ఛార్జ్షీట్లో దాఖలు చేసింది. నాటి డీజీపీ ఎన్ఐఏకి రికార్డ్ చేయవద్దని సిట్కి ఆదేశాలు ఇచ్చారు. రికార్డులు ఎన్ఐఏకి పోలీసులు మొదట అప్పగించలేదు. ఎయిర్పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?.. ఎయిర్పోర్టు అథారిటీకి శ్రీనివాస్ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీనివాస్ది ఎయిర్పోర్టులో ఇల్లీగల్ ఎంట్రీ. కత్తితో ఎయిర్పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?. శ్రీనివాస్పై కేసు ఉన్నందుకు ఎయిర్పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడు. ఎయిర్పోర్టులో ఉద్యోగం చేసే నాటికి శ్రీనివాస్పై కేసు పెండింగ్లో ఉంది. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్ వేశారు. ప్లాన్ ప్రకారమే దాడి.. సీఎం జగన్పై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది. సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిందని ఎన్ఐఏ కూడా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు -
ఎన్ఐఏ దర్యాప్తులో చాలా లోపాలున్నాయి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తులో చాలా లోపాలున్నాయని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు సోమవారం ఎన్ఐఏ కోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ సరైన దిశలో దర్యాప్తు చేయలేదని.. అనేక కీలక అంశాలను సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిల్చిందని ఆరోపించారు. దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిందన్నారు. చార్జిషీట్ను కూడా చాలా హడావుడిగా దాఖలు చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక సాక్ష్యాలను సేకరించిందన్నారు. అయితే ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ మాత్రం ఆ సాక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. అందుకే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టుకు నివేదించారు. ఎంట్రీ పాస్ లేకుండానే విమానాశ్రయంలోకి నిందితుడు.. వైఎస్ జగన్పై అక్టోబర్ 25, 2018లో హత్యాయత్నం జరిగిందని.. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆ మరుసటి రోజు శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్ అధికారులు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ)ని స్వాధీనం చేసుకున్నారన్నారు. హత్యాయత్నం జరిగిన రోజు ఎలాంటి ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్లారని చెప్పారు. పాస్ ఇంటిలోనే ఉన్నప్పుడు శ్రీనివాసరావు ఎయిర్పోర్ట్లోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. నిందితుడు కత్తిని లోపలకు ఎలా తీసుకెళ్లాడు? జగన్తో కలిసి నిందితుడు ఫొటో దిగినట్లు ఉన్న ఫ్లెక్సీని కూడా సిట్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అసలు ఈ ఫ్లెక్సీని ఎవరు తయారు చేశారు? ఏ ఉద్దేశంతో తయారు చేశారన్న వివరాలను ఎన్ఐఏ పట్టించుకోలేదని కోర్టుకు నివేదించారు. ఫెక్ల్సీ విషయంలో నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు ఇచి్చన వాంగ్మూలాన్ని సిట్, ఎన్ఐఏ రికార్డు చేశాయన్నారు. అయితే ఈ రెండు వాంగ్మూలాలకు వైరుధ్యం ఉందన్నారు. ఇందులో ఏది నిజమో తేల్చాల్సిన బాధ్యత ఎన్ఐఏపై ఉందని కోర్టుకు నివేదించారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని గుర్తు చేశారు. లోపల ఉన్న హోటల్లోకి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. మరి శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోపలికి వెళ్లారో ఎన్ఐఏ చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్ఐఏ విచారించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్ హోటల్లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీనివాçÜరావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారన్నారు. దీన్ని ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు. హర్షవర్ధన్ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచచిందన్నారు. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్ఐఏ సరిగా విశ్లేషించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ వాదనలు వినిపించేందుకు ఎన్ఐఏ తరఫు న్యాయవాది సిద్ధిరాములు గడువు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
దేవుని మాలలో ఉండి దారుణం..కూతురు కోసం వచ్చి అత్తపై దాడి
సాక్షి, జ్యోతినగర్: కూతురి ఆచూకీ కోసం వచ్చిన ఓ తల్లిని ఆమె అల్లుడే క్షణికావేశంలో హతమార్చాడు. ఈ విషాద ఘటన ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్కు చెందిన కాసు సతీశ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. సతీశ్ మెకానిక్గా పని చేస్తున్నాడు. అతనికి భార్యతో గొడవలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి, మరో ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పద్మ తీవ్ర మనోవేదనకు గురై, ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు శృతి తండ్రి వద్దకు వెళ్లి, అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. దీంతో అతను తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని, ఎన్టీపీసీ పోలీస్స్టేషన్కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు రామయ్యపల్లెలో ఉంటున్న పద్మ తల్లిదండ్రులు ఈర్ల లక్ష్మీ(65)–రాజయ్యలకు సమాచారం అందించడంతో ఠాణాకు చేరుకున్నారు. అనంతరం మనవరాళ్లను చూసేందుకు కృష్ణానగర్ వెళ్లారు. ఇంట్లో అల్లుడు సతీశ్ కనిపించడంతో తమ కుమార్తె నీ మూలంగానే ఇంటి నుంచి వెళ్లిపోయి ందన్నారు. ఇది గొడవకు దారితీసింది. క్షణికావేశంలో సతీశ్ తాను దేవుని మాల వేసుకున్న విషయాన్నీ మర్చి పోయి, అత్త లక్ష్మీపై దాడి చేశాడు. స్థానికులు అతన్ని సముదాయించి, స్పృహ కోల్పోయిన లక్ష్మిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై బి.జీవన్, పోలీసు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి చిన్న కుమారుడు గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీశ్పై హత్య కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? లక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకున్న సతీశ్ తన మెడలోని మాల తీసివేశాడు. అనంతరం పోలీ స్స్టేషన్కు వెళ్లి, లొంగిపోయినట్లు సమాచారం. (చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement