-
లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..
ఒక్క ఎకరం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఏళ్ల తరబడి తిరిగినా పని జరగని రాష్ట్రంలో ఏకంగా 35 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. ఏళ్ల తరబడి ఆంక్షల చట్రంలో ఇరుక్కు పోయిన చుక్కల భూములు, ఈనాం భూములు, షరతుల గల పట్టా భూములు వంటి లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించారు. చుక్కల భూములు, షరతుగల పట్టా భూముల్ని చంద్రబాబు ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టి లక్షలాది మంది రైతులను రోడ్డున పడేసింది. వాటికి విముక్తి కల్పించి వాటిపై సర్వ హక్కులు కల్పించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. భూములున్నా వాటికి విలువ లేకుండా పోవడంతో హక్కులు కల్పించాలని దీర్ఘ కాలికంగా ఉన్న దళిత, పేద రైతుల కోరికను వైఎస్ జగన్ నెరవేర్చారు. 27.41 లక్షల ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇందుకోసం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించారు. అన్ని లక్షల భూములపై ఆంక్షలు తొలగి వాటి లావాదేవీలు ప్రారంభమవడంతో ఆరి్థక వ్యవస్థకు ఊతం లభించింది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించింది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) చేసి ఇచ్చి చరిత్ర సృష్టించింది. స్థిరాస్థి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్లీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరక్కుండానే ఆటోమేటిక్గా యాజమాన్య హక్కు మారి్పడి జరిగే ఆటో మ్యుటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాహసోపేతంగా వేసిన అడుగులు రెవెన్యూ శాఖ చరిత్రలోనే సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి రాష్ట్రంలో అమలైన రెవెన్యూ సంస్కరణలు దేశానికే దిక్సూచిగా మారాయి. పేదల జీవితాల్లో మార్పు తెచ్చే దిశగా చేపట్టిన ఈ సంస్కరణల్ని ఒక విప్లవంలా మేధావులు చెబుతున్నారు. సంస్కరణ: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములపై 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యాజమాన్య హక్కుల కల్పన. ఇళ్ల స్థలాలకు పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు. హక్కులు కల్పిస్తున్న భూములు: 27,41,698 ఎకరాలు హక్కులు పొందుతున్న రైతుల సంఖ్య : 15,21,160 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు)ప్రయోజనం: ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఏ) నుంచి తొలగింపు. లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణాలు పెరిగాయి. తద్వారా రాష్ట్ర ఆరి్థక వృద్ధికి బాటలు. అసైన్డ్ రైతులు తమ అవసరాల కోసం ఆ భూములను వినియోగించుకునే వీలు ఏర్పడింది. సర్విస్ ఈనాం భూములపై ఆంక్షల తొలగింపుగతం : గతంలో ఈనాం చట్టం ప్రకారం దేవదాయ భూములతోపాటు కుల వృత్తులకు ఇచ్చిన సర్వీస్ ఈనాం భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీనివల్ల లక్షలాది మంది భూములు స్తంభించిపోయాయి. సంస్కరణ:నిషేధిత జాబితా నుంచి ఆ భూముల తొలగింపుఆంక్షలు తొలగిన భూములు: 1,61,584 ఎకరాలు లబ్ధి పొందిన రైతుల సంఖ్య : 1,58,113 ప్రయోజనం: ఆంక్షలు తొలగడంతో కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి వంటి పలు వృత్తుల వారికి కేటాయించిన సర్విస్ ఈనాం భూముల రైతుల కుటుంబాల్లో వెలుగులు.షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు తొలగింపుగతం: పూర్వం నుంచి అనుభవిస్తున్న షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చిన చంద్రబాబు ప్రభుత్వం సంస్కరణ: ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు తొలగించిన భూములు: 33 వేల ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: 30 వేల మంది ప్రయోజనం: నిలిచిపోయిన ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వాటిపై రుణాలు వస్తున్నాయి. అమ్మకాలు జరుగుతున్నాయి. అనాదీనం, ఖాళీకాలమ్ భూముల సమస్య పరిష్కారంగతం : చుక్కల భూములు మాదిరిగానే ఆర్ఎస్ఆర్లో అనాధీనం, ఏమీ రాయకుండా ఖాళీగా వదిలేసిన భూముల సమస్య. సంస్కరణ: అలాంటి భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగింపు తొలగించిన భూములు: సుమారు 50 వేల ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: సుమారు 30 వేల మంది ప్రయోజనం: భూములపై వారికి సర్వ హక్కులు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీకి శ్రీకారం పంపిణీ చేసిన భూమి: 46,463 ఎకరాలు లబి్ధదారులు: 42,307 ప్రయోజనం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆరి్థకంగా పైకి తీసుకువచ్చే కార్యక్రమంలంక భూములకు డీకేటీ పట్టాలు కృష్ణా, గోదావరి లంక గ్రామాల్లో రైతుల సాగులో ఉన్న లంక భూములకు పట్టాలు జారీ. దశాబ్దాల లంక భూముల సమస్యకు పరిష్కారం పట్టాలిచ్చిన భూమి: 9,064 ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: 17,768 ప్రయోజనం: ఆ భూములపై రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాలాంటివి పొందవచ్చు. దళిత వాడలకు శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండకూడదనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం దళిత వాడల కోసం కేటాయించిన శ్మశాన వాటికలు: 1,563 ఇందుకోసం ప్రభుత్వం కేటాయించిన భూమి: 951 ఎకరాలు ప్రయోజనం: స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంత్యక్రియలు చేసుకోవడానికి స్థలాలు లేని గ్రామాల సమస్యకు పరిష్కారం కొత్త రిజిస్ట్రేషన్ల విధానంరిజిస్ట్రేషన్ల విధానాన్ని ఆధునీకరించి మరింత సులభంగా ప్రజలకు రిజిస్ట్రేషన్ల సేవలు. కార్డ్ ప్రైమ్ 2.0 ద్వారా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు. అందులోనే డాక్యుమెంట్లు తయారు చేసుకునే అవకాశం. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్. ఆధార్ సైన్ ద్వారా అవకతవకలకు ఆస్కారం లేని విధానం. ఆటో మ్యుటేషన్ పాత రిజిస్ట్రేషన్ల విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. అంటే రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్లైన్లో పేరు మారుతుంది. ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిని లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేసింది. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు హక్కులు లభించాయి. వాటిని బ్యాంకు ల్లో పెట్టి రుణాలు తీసుకోవచ్చు. పదేళ్ల తర్వాత ఎన్ఓసీ అవసరం లేకుండానే కన్వేయన్స్ డీడ్లు సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ఆ పట్టాలు ప్రైవేటు పట్టాల మాదిరిగా వినియోగించుకోవచ్చు. కుల ధ్రువీకరణ పత్రం శాశ్వతం గతం : సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులను ప్రతిసారీ కుల ధ్రువీకరణ పత్రాలను అడగడం వల్ల ఇబ్బందులు ఏర్పడేవి. సంస్కరణ: ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం తీసుకుంటే దాన్ని శాశ్వతంగా ప్రకటించింది ప్రభుత్వం. మీ సేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రాలు పొందితే ఆ డేటా ఆధారంగానే మళ్లీ పత్రాలు జారీకి అవకాశం. ఆదాయ ధ్రువీకరణ సులభతరంగతం : స్కాలర్íÙప్లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపుల కోసం కుటుంబాల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ప్రతిసారి విచారణ చేయాల్సివచ్చేది. సంస్కరణ: ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే ఆరు దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకునేలా మార్పులు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు అటవీ ప్రాంతంలో ఇచ్చిన పట్టాలు. గత ప్రభుత్వాల కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చారు. పట్టాలిచ్చిన భూమి విస్తీర్ణం: 2,87,710 ఎకరాలు లబ్ధిదారులు: 1,30,368చుక్కల భూములకు విముక్తి గతం: చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదంతో 22(ఏ) జాబితాలో చేరిన 22.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్య. సంస్కరణ: 22ఏ జాబితా నుంచి వాటిని తొలగించి విముక్తి కల్పించిన ప్రభుత్వం ప్రయోజనం: చాలా సంవత్సరాల నుంచి నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. ఆ భూములను రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు ఏర్పడింది.భూమి కొనుగోలు పథకం భూములకు హక్కులు గతం : భూమి లేని నిరుపేద దళితులకు భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములు ఎస్సీ కార్పొరేషన్ తనఖాలో ఉండడంతో వాటిపై కొనసాగుతున్న ఆంక్షలు. సంస్కరణ: ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు : 22,837 ఎకరాలు విముక్తి పొందిన రైతులు : 22,346 ప్రయోజనం: ఆ భూములపై హక్కులు పొందిన దళిత రైతులు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న రైతుల సమస్యకు పరిష్కారం.గిరిజనులకు డీకేటీ పట్టాలు గిరిజనులు అటవీ ప్రాంతంలోని భూములపై ఫల సాయాన్ని పొందేందుకు వీలుగా వారికి డీకేటీ పట్టాల పంపిణీ. పట్టాలిచ్చిన భూముల విస్తీర్ణం: 39,272;లబ్ధిదారులు: 26,287 – బి ఫణికుమార్, సాక్షి అమరావతి -
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్ను సృష్టించి స్కిల్ స్కామ్కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
మాయోపాయాలు.. బెదిరింపులు
► చంద్రబాబు అల్లిన ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో ట్విస్టుల మీద ట్విస్టులు.. కుట్రల మీద కుట్రలు.. పదేళ్లు అధికారానికి మొహం వాచి.. ఒక్క దెబ్బకు వేల కోట్లు ఎలా కొల్లగొట్టాలో పచ్చ దండు పన్నాగం ఈ డ్రామాకే హైలైట్. రాజధానిగా రోజుకో పేరు తెరపైకి తెచ్చి రియల్టర్లు, సామాన్యులకు నిజంగానే సినిమా చూపించారు. అసలు రాజధాని ఎక్కడో తన పరివారం చెవిలో బాబు ముందే ఊదేయడంతో అమరావతి ప్రాంతంలో పచ్చదండు వాలి గద్దల్లా భూములు తన్నుకెళ్లింది. ఇతర ప్రాంతాల్లో భూములు కొన్న రియల్టర్లు, సామాన్యులు ఘొల్లుమంటే.. బాబు అనుచరగణం పండుగ చేసుకుంది. ► విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు.. రావడమే రాజధాని పాటందుకున్నారు. సింగపూర్ను తలదన్నేలా రాజధానిని కట్టేస్తాను.. బడుగుల బతుకుల్ని బాగుచేస్తానంటే నిజమనుకున్నారు. తెరవెనుక ఆ బడుగుల భూములపై కన్నేసిన చంద్రబాబు పన్నాగాన్ని వారు పసిగట్టలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు తేరుకునేలోపు వారి అసైన్డ్ భూముల్ని బినామీల రూపంలో గద్దల్లా తన్నుకుపోయారు. కుట్రలను పక్కాగా అమలు చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు భూదాహానికి బలయ్యింది నిరుపేద రైతులే.. ► రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల భూ దోపిడీ సమిధలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన భావన అడుగడుగునా జీర్ణించుకున్న చంద్రబాబు కన్ను వాళ్ల భూములపై పడింది. కేటగిరీ 1 నుంచి 4 కింద వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్ భూములను అడ్డగోలుగా కాజేయడానికి చట్టాన్ని తన చుట్టంగా మలచుకుని కోర్టులను కూడా బురిడీ కొట్టించారు. రాజధానిలో 617.70 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీలో రూ.3,737.30 కోట్లను స్వాహా చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు. అసైన్డ్ భూముల పరిరక్షణ కోసం చేసిన అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి భూముల్ని చెరబట్టారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల భూముల దోపిడీకి రోడ్ మ్యాప్ ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీవో నెంబరు 1 జారీ చేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ఇస్తామని, అసైన్డ్ భూములకు ప్యాకేజీ లేదని ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్ను బయటపెట్టారు. అప్పుడే చంద్రబాబు, నారాయణ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లు రంగంలోకి దూకారు. తమకు అసైన్డ్ భూములు విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయని, లేదంటే భూములు కోల్పోతారని భయపెట్టారు. దీంతో ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద రైతులు ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే అసైన్డ్ భూములను బాబు బినామీలకు సేల్ డీడ్ ద్వారా విక్రయించారు. అనంతరం వాటిని ఆరు కేటగిరీలుగా విభజిస్తూ భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నెంబరు 41 జారీ చేశారు. వాటికి భారీ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ పేద రైతులకు స్థానం లేకుండా చేశారు. అధికారుల అభ్యంతరాలూ బేఖాతరు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములు మాత్రమే ఇతరులకు విక్రయించుకోవచ్చు. ఆ విషయాన్ని రె వెన్యూ ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్ జన రల్ సైతం గుర్తిస్తూ భూసమీకరణ ప్యాకేజీని వ్యతిరేకించారు. ఉన్నతాధికారులు తాము చెప్పినట్లు చేయాల్సిందేనని చంద్రబాబు, నారా యణ హుకుం జారీ చేశారు. కోర్టుల్ని బురిడీ కొట్టించి.. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా కోర్టునే మోసం చేశారు. అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీ లేవని కోర్టుకు నివేదిక ఇచ్చారు. 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్ భూ ములు పంపిణీ చేశారు. వైఎస్సార్ ప్రభుత్వ హ యాంలో 2004–05లో అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. ఆ రికార్డులు మాయం చేశారు. అసైన్డ్ భూ ముల్లో 1954 తరువాత పంపిణీ చేసిన భూము లు ఉన్నాయన్న విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇలా 617.70 ఎకరాల అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణలు బినామీల పేరిట దోపిడీ చేశారు. ఈ భూములకు ప్యాకేజీ ద్వారా వారి గ్యాంగ్ ఏకంగా రూ.3,737.30 కోట్లు కొల్లగొట్టింది. పచ్చ కుట్ర బట్టబయలు ప్రభుత్వ అసైన్డ్ భూముల కేటగిరీ 5, 6లో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరూ అసలు అమరావతి గ్రామాల్లోనే లేరన్న నిజం సిట్ దర్యాప్తులో బృందాన్ని నివ్వెరపరిచింది. కేవలం భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కొల్లగొట్టేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతో సహా తేటతెల్లమయింది. ప్రభుత్వ భూములకు ఎసరు ప్రభుత్వ అసైన్డ్ భూములను దర్జాగా దోచేశారు. 29 గ్రామాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలు తమ బినామీలైన ప్రైవేటు వ్యక్తుల అనుభవంలో ఉన్నాయని తప్పుడు రికార్డులు సృష్టించి వాటిని గుప్పిట పట్టారు. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట చూపిస్తూ హస్తగతం చేసుకున్నారు. భూసమీకరణ ప్యాకేజీలో రూ.760.25 కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని వ్యక్తుల ఆ«దీనంలో ఉన్నట్టుగా రికార్డుల్లో చూపించారు. అందుకోసం అసైన్డ్ భూముల జాబితాను 5, 6 కేటగిరీలుగా పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5గా, అన్యాక్రాంతమైన, అభ్యంతరాలు ఉన్న భూములను కేటగిరీ 6గా చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. కేటగిరీ 5లో 237.60 ఎకరాలు గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆదీనంలో ఉన్నట్లుగా చూపించారు. కేటగిరీ–6లో 90.52 ఎకరాలు చూపి అవి 227 మంది స్వా«దీనంలో ఉన్నట్టు కనికట్టు చేశారు. వాస్తవానికి అవి ఎవరి ఆధీనంలోనూ లేవు. -
భూ బకాసురుడు!
తమ సొమ్ము సోమవారం.. ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం... ముప్పొద్దుల తింటారు..అనే నానుడి చంద్రబాబు నాయుడికి అక్షరాలా సరిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు విశాఖపట్నం, దొనకొండ, తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఎక్కడో ఒక చోట రాజధానిని ఏర్పాటు చేస్తే తనకు మిగిలేదేముండదనే దురాలోచన బాబు మెదడులో మొలకెత్తింది. ఇంకేముంది.. ఆ 29 గ్రామాల ప్రాంతంలో మూడు పంటలు పండే జరీ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో తన సహచరుడు పొంగూరు నారాయణను ముందు పెట్టి సరికొత్త డ్రామాకు తెరలేపారు. తన పరివారం చెవిలో అసలు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పేశారు. వారి ద్వారా ఆ ప్రాంతంలో భూములు కొనిపించి, ఆ భూములకు కోట్ల విలువ వచ్చేలా కుట్ర పన్నారు. బాబు అమరావతి నాటకంలో అసైన్డ్ భూముల్ని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమిధలయ్యారు. బాబు అండ్ కో మాత్రం లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి... భూముల లభ్యత, వ్యవసాయ అవసరాలు, భవిష్యత్తు ప్రయోజనాలను శాస్త్రీయంగా విశ్లేషించి సహేతుకమైన సిఫార్సులు చేసింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, రాయలసీమలోని తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని సూచించింది. 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. తన బినామీ, సన్నిహితుడైన మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించి.. పలు నాటకీయ పరిణామాల మధ్య రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. సామాన్య రియల్టర్లను ముంచిన బాబు... అమరావతిలో భూ దోపిడీకి పాల్పడటానికి ముందు రాజధాని లీక్స్ పేరిట చంద్రబాబు రాష్ట్రంలోని సామాన్య రియల్టర్లు, సాధారణ ప్రజలను బురిడీ కొట్టించారు. రాజధానిగా ఏలూరు అని ఓసారి... నూజివీడు అని మరోసారి... కాదు కాదు... నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అని ఇంకోసారి ప్రచారంలోకి తీసుకువచ్చారు. తన ఎల్లో మీడియా ద్వారా ఉద్దేశ పూర్వకంగా లీకులు ఇప్పించి వార్తలు రాయించారు. ఆ పచ్చమాటలు నమ్మి సాధారణ రియల్టర్లు అప్పులు చేసి మరీ ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కొద్దికొద్దిగా పొదుపు చేసిన మొత్తాలతో అక్కడ స్థలాలు కొన్నారు. చివరికి చంద్రబాబు ఆ మూడు ప్రాంతాల్లో కాకుండా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని నామకరణం చేశారు. చంద్రబాబు కుట్రను గ్రహించలేక ఏలూరు, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన రియల్టర్లు వందల కోట్ల రూపాయలు నష్టపోయి నిండా మునిగారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ముందస్తు పన్నాగంతోనే... ► చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల చుట్టుపక్కల ఆయన, తన సన్నిహితులు, బినామీలు అతి తక్కువ ధరలకు వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే సరికి ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. తద్వారా కేవలం రాజధాని ప్రకటనతోనే చంద్రబాబు రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి పాల్పడ్డారు. ► రాజధాని కోసం భూ సమీకరణ పేరిట చంద్రబాబు బరితెగించి రైతుల భూములపై దండయాత్రకు పాల్పడ్డారు. రైతులను మభ్య పెట్టి వారి భూములు కొల్లగొట్టడం... అసైన్డ్ భూముల దోపిడీ... ప్రభుత్వ భూముల కబ్జా... లంక భూముల ఆక్రమణ... ఇలా యథేచ్ఛగా దోపిడీకి బరితెగించారు. తద్వారా మరో రూ.లక్ష కోట్ల భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు తానొక భూబకాసురుడినని నిరూపించుకున్నారు. ► అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి, వారి అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. భూ సమీకరణ కింద అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని బెదిరించి.. వాటినీ చెరబట్టింది. తర్వాత ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ అధినేత హోదాలోనే దాదాపు 1,500 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, లంక భూముల దోపిడీకి పాల్పడ్డారు. సింగపూర్ ముసుగులో స్విస్ చాలెంజ్ ► రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి పేరిట చంద్రబాబు అంతర్జాతీయ భూ కుంభకోణానికి తెరతీశారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన స్విస్ చాలెంజ్ విధానం ద్వారా భారీ కుంభకోణానికి తెగబడ్డారు. ► సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెబుతూ... తన సన్నిహితుడైన సింగపూర్ మంత్రికి చెందిన ప్రైవేటు కంపెనీతో వ్యవహారం నడిపారు. రైతుల నుంచి సేకరించిన భూమిని సింగపూర్ కంపెనీకి అప్పగించి ప్రభుత్వమే రూ.5 వేల కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే.. సింగపూర్ కంపెనీ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తుందనే ఓ మాయామోహ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ► భూములు, నిధులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా... సింగపూర్ కంపెనీకి 52 శాతం వాటా కల్పించేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు. సింగపూర్ కంపెనీ ముసుగులో తమ కుటుంబం గుప్పిట్లోనే స్టార్టప్ ఏరియా ఉండేలా చంద్రబాబు కుతంత్రం రచించి రూ.66 వేల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నారు. ► కట్టని రాజధాని... అమరావతిలో నిరి్మంచని ఇన్నర్ రింగ్ (ఐఆర్ఆర్) రోడ్డు పేరిట చంద్రబాబు, నారాయణ ద్వయం తమ భూముల ధరలను అమాంతం పెంచేలా కుట్ర పన్నింది. ఇందుకు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. ► లింగమనేని, చంద్రబాబు, నారాయణ కుటుంబాలకు చెందిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఐఆర్ఆర్ అలైన్మెంట్ను అష్ట వంకర్లు తిప్పింది. తద్వారా కృష్ణా నదికి అటు వైపు, ఇటువైపు ఉన్న తమ భూముల విలువ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగేలా స్కెచ్ వేసింది. లింగమనేని కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం కలి్పంచినందుకు ప్రతిఫలంగా ఆ కుటుంబం నుంచి చంద్రబాబుకు కరకట్ట నివాసం, హెరిటేజ్ ఫుడ్స్కు భూములను పొంది క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. నిర్మాణాలు తాత్కాలికం.. దోపిడీ శాశ్వతం ► మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. ► అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల ముసుగులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారు. శాసన మండలి, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, ఇతర నిర్మాణాల పేరిట అస్మదీయులకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంచనా వ్యయం కంటే భారీగా అధిక శాతానికి టెండర్లు ఖరారు చేసి భారీగా కమిషన్లు దండుకున్నారు. కాంట్రాక్టు సంస్థలు అత్యంత నాసిరకంగా తాత్కాలిక రాజధాని భవనాలను నిర్మించి చేతులు దులుపుకున్నాయి. చిన్నపాటి చినుకులకే కారిపోయేలా.. ఎక్కడికక్కడ పెచ్చులు, ఫ్లోరింగ్ ఊడిపోతూ ఉన్న ఆ భవనాలు చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయి. ► రైతులను మభ్యపెట్టి తీసుకున్న అమరావతిలోని భూములను చంద్రబాబు తన అస్మదీయులకు అడ్డగోలుగా కేటాయించేశారు. ప్రభుత్వ రంగ సంస్థల భవనాలకు అధిక ధరలకు భూములు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ పారీ్టకి సన్నిహితులైన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు మాత్రం కారుచౌకగా భూములు కేటాయించడం చంద్రబాబు వంటి కుంభకోణాల సామ్రాట్కే సాధ్యమైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement