సమాన ప్యాకేజీ ఇవ్వాలి: మేరుగ | Government Should Give Good Packages To Assigned Lands Said By YSRCP Leader M Nagarjuna | Sakshi
Sakshi News home page

సమాన ప్యాకేజీ ఇవ్వాలి: మేరుగ

Jul 31 2018 2:06 PM | Updated on Jul 31 2018 3:37 PM

Government Should Give Good Packages To Assigned Lands Said  By YSRCP Leader M Nagarjuna - Sakshi

 ప్రభుత్వం వెంటనే 41 జీవోను రద్దు చెయ్యాలని కోరారు. అసైన్డ్ భూములకు పట్టా భూమితో సమానంగా ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

అమరావతి : తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అసైన్డ్ భూములను వైఎస్సార్‌సీపీ నేతలు మేరుగ నాగార్జున, హెన్ని క్రిష్టినా పరిశీలించారు. అనంతరం క్రిస్టినాతో కలిసి మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్ల నుంచి అసైన్డ్ భూమలు సాగు చేసుకుంటుంటే..ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యకుండా అధికారులు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వెంటనే దళితులు సాగు చేసుకుంటున్న భూములను వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.

 ప్రభుత్వం వెంటనే 41 జీవోను రద్దు చెయ్యాలని కోరారు. అసైన్డ్ భూములకు పట్టా భూమితో సమానంగా ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చేసి దళితులకు న్యాయం చెయ్యకపోతే సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement