Christina
-
మరో చరిత్రకోసం...
‘మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు అన్నీ మనం సృష్టించుకున్నవే. వాటికి ఎలాంటి అస్తిత్వం లేదు’ అనే క్రిస్టినా కోచ్ శాస్త్రీయ విషయ సంపన్నురాలే కాదు, సామాజిక స్పృహ మూర్తీభవించిన మహిళ. చంద్రుడిని చుట్టి రావడానికి, ‘ఆర్టెమిస్–2’ మిషన్లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములలో ఆమె ఒకరు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా గతంలో రికార్డ్ సృష్టించిన కోచ్ తాజాగా... చంద్రుడి కక్ష్యలో ప్రయాణించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.మిచిగాన్ (అమెరికా)లోని గ్రాండ్ రాపిడ్స్లో జన్మించి, నార్త్ కరోలినాలోని జాక్సన్విల్లేలో పెరిగిన క్రిస్టినా కోచ్ నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు చేశారు. ఆమెకు నాసా మిషన్లు కొత్తేమీ కాదు. 2013లో తొలిసారిగా నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.రికార్డ్ సృష్టించి...2019లో అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డ్ సృష్టించారు కోచ్. అక్టోబర్ 2019లో జెస్సికా మీర్తో కలిసి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్లో కూడా కోచ్ పాల్గొన్నారు. అల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అప్గ్రేడ్ కోసం రోబోటిక్స్ చేయడం, ఫార్మాస్యూటికల్ పరిశోధన కోసం ప్రోటీన్ క్రిస్టల్స్ పెంచడం, సూక్ష్మ గురుత్వాకర్షణలో 3డీ బయోలాజిక్ ప్రింటర్లను పరీక్షించడం... మొదలైనవి ఆమె చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు.అంటార్కిటికాలో...‘ఆర్టెమిస్–2’ మిషన్కు ఎంపిక కావడానికి ముందు ‘నాసా’ ఆస్ట్రోనాట్ ఆఫీస్లో అసైన్డ్ క్రూ బ్రాంచ్కు చీఫ్గా... నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో సెంటర్ డైరెక్టర్కు టెక్నికల్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్గా పనిచేశారు కోచ్. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న కోచ్ అంటార్కిటికాలోని స్కాట్ సౌత్ పోల్ స్టేషన్, పామర్ స్టేషన్లలో అగ్నిమాపక, శోధన, రక్షణ బృందాలలో పనిచేశారు.అంతరిక్ష యోగా!‘మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుంది’ అని చెబుతారు పెద్దలు. క్రిస్టినా కోచ్కు యోగా చేయడం అంటే ఇష్టం. మరి అంతరిక్షంలో అది సాధ్యపడుతుందా?‘యస్’ అంటున్నారు కోచ్. తన గత అంతరిక్ష యాత్రలో యోగా ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతుంటారు కోచ్. ‘నేను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు యోగా చేశాను. అక్కడ యోగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాని అది నిజం కాదు. కొన్ని ఆసనాలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ అక్కడ యోగా చేయడం చాలా సరదాగా ఉంటుంది. యోగా అనేది అద్భుతమైనది.మైక్రో గ్రావిటీ (బరువు లేని స్థితి) లో కూడా అన్వేషించడానికి అనేక రకాల ఆసనాలు ఉంటాయి. అంతరిక్షంలో సాధన చేసినా, భూమిపై చేసినా యోగా ఎప్పటికీ యోగానే. అది అంతరిక్షం అయినా సరే, అన్వేషణ మన నుంచి దూరం కాదు. అన్వేషణ అనేది ఎందుకు మానవ సహజమో మనకు అక్కడ అర్థమవుతుంది. అన్వేషణ అనేది మన డీఎన్ఏలోనే ఉంది. మనం ఇష్టపడే వాటిని కొత్త వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మనం సహజంగా చేసే పని’ అంటారు క్రిస్టినా కోచ్. శాస్త్ర ప్రపంచానికి ఆవల కోచ్కు సర్ఫింగ్, ఐస్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సామాజిక సేవ అంటే ఇష్టం.రికార్డ్లు బద్దలు కావాల్సిందే!→ మీరు ఇప్పటికే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రకు సంబంధించిన రికార్డ్ను బద్దలు కొట్టారు. మరో రికార్డ్ను కూడా సృష్టించడానికి రెడీ కావడం ఉలా ఉంది?క్రిస్టినా కోచ్: నేను రికార్డ్లు, వ్యక్తిగత విజయాల గురించి ఆలోచించను. మరొకరికి స్ఫూర్తినివ్వడం గురించి, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడం గురించి ఆలోచిస్తాను. ఇక రికార్డ్ల విషయానికొస్తే... మీరు ఎక్కడికి వెళ్లారు? అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపారు... అనేది ముఖ్యం కాదు. ఆ సమయంలో మీరు ఏం చేశారు అనేది ముఖ్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నా లక్ష్యం ఎప్పుడూ అదే. రికార్డ్లు వీలైనంత త్వరగా బద్దలు కావాలనేది నా కోరిక. రికార్డ్లు బద్దలు కావడం అంటే దాని అర్థం మనం నిరంతరం విస్తరిస్తున్నామని!→ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించి నాసా వైఖరి?కోచ్: ఒక శాస్త్రీయ అన్వేషణకు మనం స్పందించి, మానవాళి మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమని నాసా చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇది సంతోషకరమైన విషయం. వ్యోమగాముల బృందం మానవాళి మొత్తానికి ప్రతినిధిగా ఉంది. అన్వేషణకు సంబంధిన ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగాముల బృందంలో భాగమయ్యేలా చేసుకోవడమే విజయానికి అత్యత్తమ మార్గం.→ అంతరిక్ష అనుభూతి గురించి...కోచ్: అంతరిక్షం నుంచి వెనక్కి తిరిగి భూమిని చూడడం అనేది అద్భుత అవకాశం. అనంతమైన విశ్వంలో భూమి ఎలా కనిపిస్తుందో చూడడం అనేది జీవితంలో ఎన్నో అనుభవాల కంటే అతి ముఖ్యమైనది. వాతావరణానికి సంబంధించి పలుచని నీలి గీతను చూడడం ద్వారా మన మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువగా ఉన్నాయని, మనమందరం సంతోషంగా జీవించడానికి ఒకే విధానంపై ఆధారపడుతున్నామని, మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు, విభజనలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని, నిజానికి వాటికి ఎలాంటి అస్థిత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. -
ఆహా నా డ్రెస్ అంటా.... ఏఐ డ్రెస్ అంటా...
గూగుల్ సాప్ట్వేర్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్ సృష్టించిన ‘వరల్డ్స్ ఫస్ట్ ఏఐ డ్రెస్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రోబోటిక్ మిదాస్ డ్రెస్ వీడియో 3.6 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఈ బ్లాక్ డ్రెస్లో ఎన్నో రోబోటిక్ పాములు ఉన్నాయి. చాలామంది ఈ డ్రెస్కు ‘ఎక్స్ట్రార్డినరీ’ అని కితాబు ఇవ్వగా కొద్దిమంది మాత్రం ‘బోరింగ్’ అని పెదవి విరిచారు. -
హెన్నీ క్రిస్టీనా కుల ధ్రువీకరణను మళ్లీ తేల్చండి
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్పర్సన్ హెన్నీ క్రిస్టీనా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ల కులాన్ని మరోసారి తేల్చాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. వారి కుల ధ్రువీకరణపై పిటిషనర్ తాజాగా సమర్పించే ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకునే ముందు క్రిస్టీనా, సురేష్ల వాదన కూడా వినాలని కలెక్టర్కు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రిస్టీనా, సురేష్ ఎస్సీలు కారని, అయినా ఎస్సీలుగా చలామణి అవుతున్నారని, వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు సరళకుమారి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ మంగళవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. క్రిస్టీనా, సురేష్ కుమార్ బాప్టిజం తీసుకోవడం ద్వారా క్రైస్తవ మతంలోకి మారారని, అందువల్ల వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని తెలిపారు. వారికిచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలన్న పిటిషనర్ ఫిర్యాదును కలెక్టర్ తోసిపుచ్చారన్నారు. వారు బాప్టిజం తీసుకున్నట్లు అప్పట్లో ఆధారాలు దొరకలేదని, ఇప్పుడు ఆ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. -
సమాన ప్యాకేజీ ఇవ్వాలి: మేరుగ
అమరావతి : తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నేతలు మేరుగ నాగార్జున, హెన్ని క్రిష్టినా పరిశీలించారు. అనంతరం క్రిస్టినాతో కలిసి మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్ల నుంచి అసైన్డ్ భూమలు సాగు చేసుకుంటుంటే..ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యకుండా అధికారులు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వెంటనే దళితులు సాగు చేసుకుంటున్న భూములను వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 41 జీవోను రద్దు చెయ్యాలని కోరారు. అసైన్డ్ భూములకు పట్టా భూమితో సమానంగా ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చేసి దళితులకు న్యాయం చెయ్యకపోతే సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు పంపారు. -
మన్నించుమా ప్రియా!
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘‘ఎంత బాగా పాడతాడు!’’ అనుకుంది క్రిస్టినా. అలా ఆమె అనుకోవడం అది వందోసారి! జిమ్మీ మోర్గంటీ అద్భుతంగా పాడతాడు. ముఖ్యంగా అతను పాడే విషాదగీతం- ‘వెన్ యూ ఆర్ డ్రీమింగ్ విత్ ఏ బ్రోకెన్ హార్ట్’ అంటే ఆమెకి ఎంత ఇష్టమో! క్రిస్టినా, జిమ్మీల మధ్య స్నేహం పెరగడానికి, అది ప్రేమగా మారడానికి, పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి ‘పాట’ మాత్రమే కాదు, వారి అభిరుచులు ఒక్కటి కావడం కూడా కారణం! ఆరోజు న్యూజెర్సీలో... ఫ్రెండ్స్, బంధువుల కోసం తన ఆంటీవాళ్ల ఇంట్లో విందు ఏర్పాటు చేసింది క్రిస్టినా. ఆ విందులో తన పెళ్లి గురించి ప్రకటించాలనేది ఆమె ప్లాన్. జిమ్మీ మోర్గంటీ పాత, కొత్త పాటలతో ఆ విందును పసందుగా మార్చాడు. అంతలో క్రిస్టినాకి ఓ కోరిక పుట్టింది. ఆ సంతోష సమయంలో సరదాగా స్విమ్ చేయాలని ఆశపడింది. స్విమ్మింగ్ పూల్లో దూకింది. ఒక్కసారిగా ఏదో శబ్దం... అంతలోనే నిశ్శబ్దం. జిమ్మీకి అనుమానం వచ్చింది. వెంటనే పూల్లోకి దూకేశాడు. అను కున్నట్లే అయింది. క్రిస్టినా మెడకు బల మైన గాయం అయింది. బాధతో విల విలలాడిపోతోంది. జిమ్మీ మనసు అల్లాడి పోయింది. వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి చేరుకున్నాడు. స్విమ్మింగ్పూల్లో దూకినప్పుడు క్రిస్టినాకు గచ్చు బలంగా తగిలింది. ఆ షాక్లో పక్షవాతం వచ్చింది. వీల్ చెయిర్కి పరిమితమైపోయింది. ఆమె పనులు ఆమె చేసుకోలేని పరిస్థితి. దాంతో దుఃఖిస్తూనే ఉండేది. జిమ్ ఆమెను పాటలతో అల రించేవాడు. జోక్స్ చెప్పి నవ్వించేవాడు. ధైర్యం నూరిపోసేవాడు. జీవితం విలువ గురించి చెబుతుండేవాడు. వింటున్నంత సేపూ ధైర్యంగా కనిపించేది. కానీ తర్వాత మళ్లీ నిరాశ, నిస్పృహ! ఒకరోజు క్రిస్టినా కోసం వచ్చాడు జిమ్మీ. ఆమె గదిలో నిద్రపోతోంది. ‘‘తనని డిస్టర్బ్ చేయకు. ఆమె జీవితాన్ని పాడు చేసింది చాలు’’ అన్నాడు క్రిస్టినా మారుతండ్రి. ‘‘నీతో ప్రేమలో పడ్డాకే నా కూతురి పరిస్థితి ఇలా అయింది. పెళ్లయితే ఇంకేమైనా ఉందా! వెళ్లు’’ అని అరిచింది క్రిస్టినా తల్లి. జిమ్మీ కళ్లు కన్నీటి సంద్రా లయ్యాయి. మౌనంగా వెళ్లిపోయాడు. స్నేహితుల ద్వారా అసలు నిజం తెలిసింది. జిమ్మీని చూడాలంటూ ఏడ్చింది. ఇక తప్పక జిమ్మీని ఇంటికి పిలిపించారు. చాలా రోజుల తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. ‘‘నిన్ను విడిచి ఉండలేను’’ అన్నాడు జిమ్ ఆమెను గుండెకు హత్తుకుంటూ! ‘‘జిమ్మీ ఇవాళ రాలేదా?’’ అడిగింది క్రిస్టినా. ‘‘రాలేదు’’ అని సమాధానం. వారం రోజుల పాటు అదే సమాధానం. ‘‘మొన్నటి వరకు నేను లేక బతకలేను అన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి చూసి ముఖం చాటేశాడు’’ అని కుమిలి పోయింది. కానీ తర్వాత స్నేహితుల ద్వారా అసలు నిజం తెలిసింది. జిమ్మీని చూడాలంటూ ఏడ్చింది. ఇక తప్పక జిమ్మీని ఇంటికి పిలిపించారు. చాలా రోజుల తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. ‘‘నిన్ను విడిచి ఉండలేను’’ అన్నాడు జిమ్ ఆమెను గుండెకు హత్తుకుంటూ! ఆ రాత్రి క్రిస్టినాకు నిద్ర పట్టలేదు. ‘నేను జిమ్మీని పెళ్లాడడం సరైన నిర్ణయ మేనా? నన్ను చేసుకుని అతనేం సుఖపడ తాడు, నాకు సేవ చేస్తుండడం తప్ప’ అని దుఃఖించింది. ‘నా స్వార్థం కోసం అతడి జీవితాన్ని బలి తీసుకోలేను’ అనుకుంది. ‘‘ఇక జిమ్మీని నా దగ్గరికి రానివ్వొద్దు’’ అని తల్లిదండ్రులను కోరింది. వాళ్లకు అది వేరే విధంగా అర్థమైంది. కానీ నిజానికి ఆమె అనుకుంది వేరు. నాటి నుంచీ భోజనం మానేసింది క్రిస్టినా. ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఎంతో బతిమిలాడారు. కానీ వినలేదు. ‘క్షణ క్షణం బతుకుతూ చావలేను’ అంది. ‘చని పోయే హక్కు నీకు లేదు’ అంటే ‘రైట్- టు-డై’ లా గురించి మాట్లాడేది. రోజులు భారంగా సాగిపోతున్నాయి. క్రిస్టినా శరీరాన్ని కొత్త కొత్త సమస్యలు చుట్టు ముడుతున్నాయి. విషయం తెలిసి జిమ్మీ వచ్చాడు. మనసు మార్చుకోమని కన్నీళ్లతో వేడుకున్నాడు. మౌనంగా ఉండిపోయింది క్రిస్టినా. ఆ తర్వాత మూడు రోజులకి ఆమె స్వరం పూర్తిగా మూగవోయింది. ఆమె కన్ను శాశ్వతంగా మూతపడింది. ‘నా కోసం నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను మన్నించు’ అంటూ జిమ్మీకి రాసిన చివరి లేఖలో పేర్కొంది క్రిస్టినా. కానీ ఆమె తప్పుగా ఆలో చించింది. తాను వెళ్లిపోతే జిమ్మీ తనను మర్చిపోతాడనుకుంది. జీవితంలో ముందుకు సాగిపోతాడనుకుంది. అలా జరగలేదు. జిమ్మీ నేటికీ ఆమె ఆరాధన లోనే గడుపుతున్నాడు. ఆమె జ్ఞాపకాలతో జీవచ్ఛవంలా బతుకుతున్నాడు. -
ఓరుగల్లుకొచ్చిన ‘గాలిపటం’
సందడి చేసిన చిత్రం యూనిట్ ఘనంగా సత్కరించిన అభిమానులు, థియేటర్ యాజమాన్యం పోచమ్మమైదాన్ : గాలిపటం చిత్రం యూనిట్ నగరంలో శనివారం సందడి చేసింది. సినిమా విడుదలై విజయవంతంగా రెండో వారం ప్రదర్శింపబడుతున్నందున చిత్రం యూనిట్ ప్రేక్షకులను పలకరించేందుకు వరంగల్లోని లక్ష్మణ్ థియేటర్కు సాయంత్రం 4 గంటలకు విచ్చేసింది. చిత్ర నిర్మాత సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినా, సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో విచ్చేశారు. ఈ సందర్భంగా థియేటర్లో అభిమానులు బాణసంచా కాల్చి, సంబరాలు నిర్వహించారు. యూనిట్ బృందం సినిమా థియేటర్లో ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం సినిమా నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. గాలిపటం సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని అన్నారు. ‘ఫ్యాక్షనిజంలో రెడ్డియిజం.. పవనిజంలో నిజయితీ ఉంటుందని’ సినిమా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. సంగీత దర్శకుడు బిమ్స్ సిసిరిలియో ‘పొద్దున్నే ఏంట్రా తినడం పొంగలి’ అనే పాట పాడి ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. హీరో ఆది మాట్లాడుతూ డిఫరెంట్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘అమ్మాయిలు ఆర్టీసీ బస్సుల మాదిరిగా వచ్చిపోతుంటారు’ అనే డైలాగ్ చెప్పి ప్రజలను మంత్రముగ్దులను చేశారు. అనంతరం థియేటర్ యాజమాన్యం సినిమా యూనిట్ను ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ రవి, సూపర్వైజర్ సాంబయ్య, పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ది చాకోలెట్ రూంలో యూనిట్ సందడి ఎన్జీవోస్కాలనీ : హన్మకొండ నక్కలగుట్టలోని ది చాకోలెట్ రూంలో గాలిపటం చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది. నగరానికి వచ్చిన చిత్ర నిర్మాత, దర్శకుడు సంపత్ నంది, హీరో ఆది, హీరోయిన్ క్రిస్టినాతోపాటు చిత్ర బృందం ది చాకోలెట్ రూంకు వచ్చి అందులోని ఐటెమ్స్ రుచి చూశారు. హీరోయిన్ క్రిస్టినా తనకు ఇష్టమైన ప్యాన్కేక్ చాక్లెట్, ఎక్సెస్ కేక్ తిన్నారు. హీరో ఆది ఫ్రైడ్ చికెన్, చాక్లెట్, ఎక్సెస్ కేక్, ఫ్రైడ్ చికెన్ రుచి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా ఇక్కడ చాకోలెట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన తినుబండారాలు అందించడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాజేష్, శ్రీధర్ పాల్గొన్నారు.


